free training
-
ఎన్ఎఫ్హెచ్సీ.. సేవల్లో భేష్
కేసముద్రం: రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని మారుమూల ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు చేయూతనిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది నేషన్స్ ఫస్ట్ హ్యూమన్ చైన్ ఫౌండేషన్ (ఎన్ఎఫ్హెచ్సీ). ఫీజులు చెల్లించలేని విద్యార్థులకు ఆర్థికసాయం చేయడంతో పాటు వేసవికాలంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేస్తూ, మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య శిబిరాలు, తాగునీటి ప్రాజెక్టుల ఏర్పాటు వంటి పలు సేవాకార్య క్రమాలతో ముందుకు వెళ్తూ అందరితో భేష్ అనిపించు కుంటోంది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తావుర్యా తండాకు చెందిన గిరిజన విద్యాకుసుమం, సైంటిస్ట్ మూడావత్ మోహన్కు వచ్చిన మంచి ఆలోచనతో ఏర్పాటైన ఎన్ఎఫ్హెచ్సీ ఫౌండేషన్ (NFHC Foundation) ద్వారా తన తండా, చదువుకున్న గురుకుల పాఠశాల నుంచి మొదలుకుని, రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లోని మారు మూల గ్రామాల వరకు సేవాకార్యక్రమాలను విస్తరించి, అందరి మన్నలను పొందుతు ఆదర్శంగా నిలుస్తున్నారు. తండా నుంచి సైంటిస్ట్గా..తావుర్యాతండాకు చెందిన మూడావత్ భద్రునాయక్, శాంతి దంపతులకు కుమారుడు మోహన్, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. మొదటి నుంచి ఆ దంపతులు వ్యవసాయం చేస్తూ పిల్లల్ని చదివిస్తూ వచ్చారు. మోహన్ చిన్నప్పటి నుంచే చదువులో ప్రతిభ కనబరుస్తూ వచ్చాడు. ఈ క్రమంలో జిల్లాలోని గూడూరు మండలం దామరవంచ ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో పదో తరగతి వరకు చదివాడు. అక్కడి గణిత ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్రావు ప్రోత్సాహంతో చదువు పట్ల శ్రద్ధ వహించి, పదిలో 550 మార్కులు సాధించి మండల టాపర్గా నిలిచాడు. తన గురువు సహకారంతో విజయవాడలోని ఓ విద్యాసంస్థలో మోహన్ ఇంటర్తోపాటు (ఎంపీసీ), ఐఐటీ కోచింగ్ తీసుకున్నాడు. ఇంటర్లో 963 మార్కులు సాధించాడు. ఈ క్రమంలో ఏఐఈఈఈలో ఉత్తమ ర్యాంకు సాధించి నిట్ వరంగల్లో ఈసీఈ బ్రాంచ్లో అడ్మిషన్ పొందాడు. ఐఐటీ క్వాలీఫై అయినప్పటికీ, తాను కోరుకున్న బ్రాంచ్ రాకపోవడంతో నిట్లో చేరాడు. 2012లో బీటెక్ పూర్తి చేసి, క్యాంపస్ ప్లేస్మెంట్లో ప్రముఖ కేంద్ర ప్రభుత్వ సంస్థ సీడాట్లో రీసెర్చ్ ఇంజనీర్గా ఉద్యోగం పొందాడు. ప్రస్తుతం బెంగళూరులో సీడాట్ కంపెనీలో 4జీ, 5జీ టెక్నాలజీతోపాటు, మిగతా సాంకేతిక ప్రాజెక్టుల అభివృద్ధిపై సైంటిస్టుగా పనిచేస్తున్నాడు. సేవచేయాలనే తపనతో..తన తండ్రి, గురువు అందించిన ప్రోత్సాహంతో మోహన్ చదువులో రాణిస్తూ వచ్చాడు. తన మాదిరిగానే చదువు పట్ల శ్రద్ధ ఉన్న నిరుపేద పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవద్దనే మంచి ఆలోచన విద్యార్థి దశలోనే తనకు వచ్చింది. తాను బీటెక్ చదువుతున్న సమయంలో 2010లో నేషన్స్ ఫస్ట్ హ్యూమన్ చైన్ ఫౌండేషన్ (ఎన్ఎఫ్హెచ్సీ) అనే సేవాసంస్థను ఏర్పాటు చేశాడు. ఆ టీంలో సివిల్ సర్వెంట్స్, ఎన్ఐటీ, ఐఐటీ (IIT) తదితర ప్రముఖ విద్యాసంస్థల నుంచి ఎదిగిన వారితోపాటు, ప్రముఖ వైద్యులు, ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు చెందిన నిపుణులతో కలిసి నాలెడ్డ్ నెట్వర్క్ టీంను ఏర్పాటు చేశాడు. ఎప్పటికప్పుడు ఆ టీం సలహాలు, సూచనలు తీసుకుంటూ, అనేక మంది సహకారంతో పేద విద్యార్థులకు విద్య, ఉద్యోగ అవకాశాలపై అవగాహన కల్పిస్తూ, వారికి అవసరమైన సాయం అందిస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు ఫౌండేషన్లో 100 మంది సభ్యులు ఉన్నారు. సేవా కార్యక్రమాలు ఇవే..రాష్ట్రంలోని మహబూబాబాద్, వరంగల్, మెదక్, నారాయణపేట, నల్లగొండ (Nalgonda) జిల్లాల్లోని మారుమూల గ్రామాల్లో 40 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ప్రేరణ సదస్సులు నిర్వహించారు. ప్రవేశ పరీక్షలకు సంబంధించిన మెటీరియల్స్ను అందించారు. 8వ తరగతి విద్యార్థులకు ఎన్ఎంఎంఎస్ మెటీరియల్, పదో తరగతి పిల్లలకు ఆల్ఇన్వన్, పాలిటెక్నిక్ మెటీరియల్ అందజేశారు. పాఠశాలల్లోని గ్రంథాలయానికి బుక్స్ అందజేశారు. అలాగే స్పోర్ట్స్ కిట్లు అందించారు. ఈ ఏడాది ఇనుగుర్తి మండలం చీన్యాతండాలో వేసవి శిక్షణ శిబిరాన్ని ఇటీవల ప్రారంభించారు. ఈ శిబిరంలో పిల్లలకు స్పోకెన్ ఇంగ్లిష్తోపాటు, ఆటపాటలు నేర్పించడం, పది పిల్లలకు పాలిటెక్నిక్ కోచింగ్ ఇస్తున్నారు. అలాగే ఆయా గ్రామాల్లో వైద్యశిబిరాలు నిర్వహించి, వైద్యపరీక్షల అనంతరం రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. తావుర్యాతండాలో ప్రజల దాహార్తి తీర్చేందుకు వాటర్ప్లాంట్ను ఏర్పాటు చేశారు. ఉన్నత చదువులు చదివే పలువురు నిరుపేద విద్యార్థులకు ఆర్థికసాయం అందిస్తున్నారు.మా నాన్న, గురువు స్ఫూర్తితో ఎన్ఎఫ్హెచ్సీ ఏర్పాటు మానాన్న భద్రునాయక్, మ్యాథ్స్ టీచర్ జి.వెంకటేశ్వర్రావు ప్రోత్సాహంతో ఎన్ఎఫ్హెచ్సీ ఏర్పాటు చేశా. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా అండగా నిలిచి ధైర్యం చెప్పేవారు. మా నాన్న, గురువు ప్రోత్సాహంతో చదువులో రాణించి, ప్రస్తుతం బెంగళూరులోని టెలికాం డిపార్ట్మెంట్ అయిన సీడాన్ కంపెనీలో 4జీ, 5జీ టెక్నాలజీతోపాటు, సాంకేతిక ప్రాజెక్టుల అభివృద్ధిపై సైంటిస్టుగా పనిచేస్తున్నాను. ఎంతో మంది నిపుణులు, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులతో కలిసి పేద విద్యార్థులకు తోడ్పాటునందిస్తూ, ఆర్థిక సాయం అందజేస్తున్నాం. – మూడావత్ మోహన్, ఎన్ఎఫ్హెచ్సీ వ్యవస్థాపకుడు, తావుర్యాతండాజీపీ, కేసముద్రం మండలం సేవ చేయడంలోనే నిజమైన సంతృప్తిచిన్నతనం నుంచి కష్టపడి చదువుకున్నా. చదువుకునే రోజుల్లోనే పేద విద్యార్థులకు సాయం అందించాలనే ఆలోచన ఉండేది. ఆ విధంగా నా వంతుగా ఎంతోమందికి సాయం చేస్తూ వచ్చా. ఆ తర్వాత 2019లో ఎన్ఎఫ్హెచ్సీ ఫౌండేషన్లో సభ్యుడిగా చేరి, ఎన్నో సేవాకార్యక్రమాలు చేశాం. ప్రస్తుతం జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నా. మా తండాలో ఈ వేసవిలో శిక్షణ శిబిరం (Summer Camp) ఏర్పాటు చేశాం. విద్యార్థులకు పాలిటెక్నిక్ కోచింగ్, స్పోకెన్ ఇంగ్లిష్, ఆటలు ఆడించడం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. – జాటోత్ జయకృష్ణ, ఎన్ఎఫ్హెచ్సీ జనరల్ సెక్రటరీ, చీన్యాతండా, ఇనుగుర్తి మండలం కోచింగ్ ఉపయోగపడుతుంది మా తండాలోని ప్రాథమిక పాఠశాలలో ఎన్ఎఫ్హెచ్సీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వేసవి శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో పాలిటెక్నిక్ కోచింగ్ ఇస్తున్నారు. ఈ కోచింగ్ తమకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మాకు వచ్చే అనుమానాలను ఎప్పటికప్పడు నివృత్తి చేసుకుంటున్నాం. పైగా స్పోకెన్ ఇంగ్లిష్ కోచింగ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. – గుగులోత్ శైలజ, విద్యార్థిని, చీన్యాతండా జీపీ, ఇనుగుర్తి మండలం -
Rambabu Muppidi: జ్యూట్ బ్యాగులపైన భారతీయ కళ
కళాకారులు మనదైన ఆత్మను కళ ద్వారా జీవం పోస్తారు. ఆ కళను నలుగురికి పరిచయం చేయడమే కాకుండా దానిని ఉపాధి వనరుగా మార్చి మరికొంత మందికి చేయూతగా నిలుస్తున్నారు డాక్టర్ ముప్పిడి రాంబాబు. హైదరాబాద్ రాయదుర్గంలో ఉంటున్న ఈ కళాకారుడు ఫుట్వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్లో లెదర్ గూడ్స్ అండ్ యాక్సెసరీస్ డిజైనింగ్ డిపార్ట్మెంట్లో ఫ్యాకల్టీగా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఆరేళ్లుగా మహిళలకు, యువతకు జ్యూట్ బ్యాగ్ల తయారీలో ఉచితంగా శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం పార్వతీపురం మన్యం జిల్లాలోని మహిళలకు శిక్షణ ఇస్తున్న సందర్భంగా భారతీయ కళను జ్యూట్ బ్యాగుల మీదకు ఏ విధంగా తీసుకువస్తున్నారో తెలియజేశారు.‘‘జ్యూట్ బ్యాగుల తయారీ సాధారణమే కదా అనుకుంటారు. కానీ, ఇండియన్ ఆర్ట్ మోటిఫ్స్ కలంకారీ, చేర్యాల, వర్లీ, గోండు, పటచిత్ర, మధుబని... డిజైన్స్ను ఉపయోగిస్తూ, స్క్రీన్ ప్రింటింగ్ ద్వారా జ్యూట్ మీదకు తీసుకువస్తున్నాం. దీని ద్వారా జ్యూట్కి కొత్త కళ వస్తుంది. అలాగే, మొన్నటి ఏరువాక పౌర్ణమిని దృష్టిలో పెట్టుకొని రైతు పొలం పనులకు వెళ్లే డిజైన్ని తీసుకువచ్చాను. ఈ కళ ద్వారా పర్యావరణ హితం, మనదైన ఆత్మను పరిచయం చేస్తున్నాం.ఉపాధికి మార్గంకరీంనగర్, ఏలూరు, జంగారెడ్డి గూడెం, పార్వతీ పురం, బొబ్బలి.. మొదలైన ప్రాంతాలలో ఉచితంగా శిక్షణ ఇస్తూ వచ్చాను. నేషనల్ జ్యూట్ బోర్డ్ వాళ్లునన్ను సర్టిఫైడ్ డిజైనర్గా తీసుకున్నారు. స్వచ్ఛంద సంస్థలతో కలిసి ఈ స్కిల్ క్రాఫ్ట్ ట్రెయినింగ్ ప్రోగ్రామ్స్ చేస్తుంటాను. ప్రస్తుతం మన్యం జిల్లా పార్వతీపురంలో 24 మంది మహిళలు శిక్షణ తీసుకుంటున్నారు. 45 రోజుల శిక్షణ కార్యక్రమంలో బ్యాగుల తయారీ, స్క్రీన్ ప్రింటింగ్ నేర్చుకుంటున్నారు. ఇప్పటికే బ్యాగుల తయారీ నేర్చుకున్నవారు, సొంతంగా ఉపాధి మార్గాలను పొందుతున్నారు. ఈ స్కిల్ ప్రోగ్రామ్లో పదవ తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుకున్నవారు ఉన్నారు. బ్యాగులే కాకుండా పాదరక్షలు, లెదర్ బ్యాగులు, వైర్లతో చెయిర్లు, ఇతర యాక్సెసరీస్ తయారుచేస్తుంటాను. వీటితో కంప్యూటర్ ఆధారిత త్రీడీ సాఫ్ట్వేర్ డిజైన్లు కూడా ΄్లాన్ చేస్తుంటాను.కళాకారులను కలిసి...మా ఊరు పశ్చిమగోదావరి దగ్గరిలోని జంగారెడ్డి గూడెం. సినిమా నటుల బ్యానర్లను సృజనాత్మకంగా తయారు చేసి, అందించిన కుటుంబం మాది. నాకున్న పెయింటింగ్ ఆసక్తిని మా అన్నయ్య శ్రీనిసవాసరావు గుర్తించాడు. దీంతో ఇంటర్మీడియెట్ తర్వాత ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ పైన పూర్తి దృష్టి పెట్టాను. ముంబయ్ నిప్ట్ నుంచి మాస్టర్ ఆఫ్ డిజైన్ చేశాను. స్కూల్ చదువు నుంచి డాక్టరేట్ చేసేవరకు మా అన్నయ్యప్రోత్సాహం ఎంతో ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ ఎఫ్డిఐలో ఉద్యోగం చేస్తున్నాను. సాంకేతికంగానూ భారతీయ కళను క్రాఫ్ట్ తయారీలో ఎలా మేళవించవచ్చో పరిశోధన, ్రపాక్టీస్ చేస్తుంటాను. రాబోయే తరాల కోసం క్రాఫ్ట్స్ని డిజిటలైజేషన్ చేసే పనిలో ఉన్నాను. ఆంధ్రప్రదేశ్లో ఉన్న హస్తకళాకారులను నేరుగా కలుసుకొని చేసిన పరిశోధనకు బంగారు పతకాన్ని అందుకున్నాను. నా పరిశోధన ద్వారా తెలుసుకున్న విషయాలను జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో మన కళ, కళాకారుల ప్రత్యేకతను తెలియ జేయడం అదృష్టంగా భావిస్తాను. ఏటి కొ΄్పాక కొయ్యబొమ్మల కళాకారులతో కలిసి, బొమ్మల తయారీ నేర్చుకున్నాను. నేను తయారు చేసిన కొయ్య బొమ్మలకు డిజైన్లకు, పేపర్ బాస్కెట్ డిజైన్స్కి పేటెంట్ హక్కులు ΄పొందాను. కళను భవిష్యత్తు తరాలు గుర్తించేలా మరింత సృజనతో మెరుగ్గా తీర్చిదిద్దాలని.. దీని ద్వారా యువతకు, మహిళలకు ఉపాధి అవకాశాలు లభించాలన్నదే లక్ష్యంగా పనిచేస్తున్నాను’ అని చె΄్పారు రాంబాబు. ఈ కళాకారుడు తన పనిలో సంపూర్ణ విజయాన్ని సాధించాలని కోరుకుందాం. – నిర్మలారెడ్డి -
ప్రభుత్వ ఉద్యోగులకు గూగుల్ బంపరాఫర్..
దేశంలోని ప్రభుత్వ ఉద్యోగులకు ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ (Google) బంపరాఫర్ ప్రకటించింది. 1,000 మంది ప్రభుత్వ అధికారులకు సైబర్ సెక్యూరిటీలో శిక్షణ ఇవ్వడానికి ప్రభుత్వ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ యూనిట్ సెర్ట్ఇన్ (CERT-In)తో గూగుల్ క్లౌడ్ (Google Cloud) తన భాగస్వామ్యాన్ని ప్రకటించింది. సెర్ట్ఇన్ అనేది ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY)లో భాగం. ఇది సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్, హ్యాకింగ్, ఇతర సైబర్ సంబంధిత సమస్యలను చూసుకుంటుంది. (IT jobs data: దారుణంగా ఐటీ ఉద్యోగాలు.. ప్రముఖ జాబ్ పోర్టల్ రిపోర్ట్!) రూ.లక్ష స్కాలర్షిప్ కూడా.. 'సైబర్ ఫోర్స్' పేరుతో కొంతమంది ప్రభుత్వ అధికారులకు సైబర్ డిఫెన్స్ బెస్ట్ ప్రాక్టీస్లలో శిక్షణ ఇస్తున్నారు. ఇందులో భాగంగా వీరికి జనరేటివ్ ఏఐ వినియోగం, సైబర్ సెక్యూరిటీ ఏఐ హ్యాకథాన్ల నిర్వహణ వంటివి గూగుల్ క్లౌడ్, మాండియంట్ నిపుణులచే నిర్వహించన్నట్లు గూగుల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఉద్యోగులకు ఉచిత శిక్షణతోపాటు రూ.లక్ష స్కాలర్షిప్ కూడా ఇవ్వననున్నట్లు పేర్కొంది. ‘సైబర్ భద్రత మన డిజిటల్ భవిష్యత్తుకు మూలస్తంభం. నిరంతరం అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ ప్రపంచంలో మరింత ముందుకు సాగాలంటే జనరేటివ్ ఏఐ శక్తిని వినియోగించుకోవడం చాలా అవసరం’ అని సెర్ట్ఇన్ డైరెక్టర్ జనరల్ సంజయ్ బహ్ల్ పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖతో కలిసి దేశవ్యాప్తంగా భారతీయులకు అవసరమైన నైపుణ్యాభివృద్ధిని సులభతరం చేస్తున్నామని, కొత్త సురక్షితమైన భద్రత సేవలను అందించడానికి సహకారం అందిస్తున్నామని గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్ అన్నారు. -
టెక్కీలకు గుడ్న్యూస్: ఏఐలో ఉచిత సర్టిఫికేషన్.. డేటా సైన్స్ కోర్సు కూడా..
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ తమ ఇన్ఫోసిస్ స్ప్రింగ్బోర్డ్ వర్చువల్ లెర్నింగ్ ప్లాట్ఫాంపై కృత్రిమ మేథలో (ఏఐ) సర్టిఫికేషన్ కోసం ఉచిత శిక్షణ అందించనున్నట్లు తెలిపింది. ఏఐ, జెనరేటివ్ ఏఐలో నైపుణ్యాలను పెంపొందించేలా ఇందులో కోర్సులు ఉంటాయి. అలాగే, పైథాన్ ప్రోగ్రామింగ్, లీనియర్ ఆల్జీబ్రా సహా డేటా సైన్స్కి సంబంధించిన వివిధ అంశాలతో సిటిజెన్స్ డేటా సైన్స్ కోర్సు కూడా ఉంటుంది. కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన వారికి సరి్టఫికెట్ లభిస్తుంది. ఇన్ఫోసిస్ ఏఐ–ఫస్ట్ స్పెషలిస్టులు, డేటా స్ట్రాటెజిస్టులు ఈ బోధనాంశాలను రూపొందించారు. -
కొలువుల శిక్షణ గందరగోళం! పేరుకే ఉచితం.. తీరు అనుచితం..
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి నిర్వహించే అర్హత పరీక్షలకు సన్నద్దమవుతున్న అభ్యర్థులకు బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ఇస్తున్న ఉచిత శిక్షణ దారితప్పింది. గ్రూప్–3, గ్రూప్–4 కొలువులకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు మూడు నెలల పాటు నిర్వహించే శిక్షణ కార్యక్రమాలు లోపభూయిష్టంగా మారాయి. రాష్ట్రవ్యాప్తంగా 50 చోట్ల స్టడీ సెంటర్లు తెరిచి గ్రూప్–3, గ్రూప్–4 అభ్యర్థులకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించిన బీసీ స్టడీ సర్కిల్ ప్రైవేటు శిక్షణ సంస్థలను ఎంపిక చేసి తరగతుల నిర్వహణ బాధ్యతలను అప్పగించింది. ఒక్కో అభ్యర్థికి సగటున రూ.5500 చొప్పున ఫీజు నిర్దేశిస్తూ రాష్ట్రవ్యాప్తంగా 50 శిక్షణ తరగతులకు ప్రైవేటు సెంటర్లను ఎంపిక చేసి సెప్టెంబర్ 15 నుంచి తరగతులను ప్రారంభించింది. మూడు నెలల పాటు కొనసాగించాల్సిన ఈ శిక్షణ తరగతులు పలుచోట్ల నామమాత్రంగా సాగగా... కొన్నిచోట్ల అర్ధంతరంగా నిలిచిపోవడంతో నిరుద్యోగ అభ్యర్థులు తీవ్ర గందరగోళంలో పడ్డారు. ఎంపిక ప్రక్రియలో నిబంధనలు గాలికి... రాష్ట్రవ్యాప్తంగా 50 చోట్ల తెరిచిన సెంటర్లకు ఏడు సంస్థలను బీసీ స్టడీ సర్కిల్ ఎంపిక చేసింది. ఇందులో ఒక సంస్థకు ఏకంగా 20 సెంటర్ల బాధ్యతలు అప్పగించగా... మిగతా 30 సెంటర్ల నిర్వహణను మిగిలిన ఆరు సంస్థలకు అప్పగించినట్లు సమాచారం. సాధారణంగా ఒక సంస్థను ఎంపిక చేసేటప్పుడు ఆ సంస్థ నేపథ్యం, అనుభవం, సామర్ధ్యం తదితర అంశాలను ప్రామాణికంగా తీసుకోవాలి. కానీ బీసీ స్టడీ సెంటర్ల నిర్వహణ అంశంలో నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా కేటాయింపు జరిగినట్లు ఆరోపణలున్నాయి. అడ్డగోలుగా అభ్యర్థుల పెంపు... ఒక్కో బీసీ స్టడీ సెంటర్లో గ్రూప్–3, గ్రూప్–4 శిక్షణ తరగతుల కోసం వంద మంది అభ్యర్థులకు అవకాశం కల్పించాలని బీసీ స్టడీ సర్కిల్ నిర్ణయించింది. మొత్తంగా 5వేల మందికి శిక్షణ ఇచ్చేలా లక్ష్యాన్ని నిర్దేశించుకుని సెప్టెంబర్ 15 నాటికి తరగతులు ప్రారంభించి డిసెంబర్ 15కల్లా ముగించేలా కార్యాచరణ రూపొందించింది. కానీ చాలా కేంద్రాల్లో నిర్దేశించిన అభ్యర్థుల సంఖ్య కంటే సగం, అంతకంటే తక్కువ సంఖ్యలో అభ్యర్థులు నమోదయ్యారు. దీంతో గిట్టుబాటు కాదనుకున్న ప్రైవేటు సంస్థలు అధికారులపై ఒత్తిడి తెచ్చి అభ్యర్థుల సంఖ్య పెంపునకు అవకాశం కోరగా... తరగతులు ప్రారంభమైన నెలరోజుల తర్వాత అవకాశం కల్పిస్తూ బీసీ స్టడీ సర్కిల్ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. బీసీ స్టడీ సెంటర్లుగా ఎంపిక చేసిన భవనాలన్నీ ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కాలేజీలు, గురుకుల విద్యా సంస్థలే కావడంతో... ఏకంగా డిగ్రీ ఫైనలియర్ చదువుతున్న అభ్యర్థులను సైతం చేర్చుకునే వెసులుబాటు కల్పించారు. వాస్తవానికి గ్రూప్–3, గ్రూప్–4 ఉద్యోగ ప్రకటన విడుదలయ్యే నాటికి డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం గ్రూప్–4 నోటిఫికేషన్ విడుదల కాగా, గ్రూప్–3 ప్రకటన అతి త్వరలో వెలువడనుంది. ఈ క్రమంలో డిగ్రీ ఫైనలియర్ అభ్యర్థులకు శిక్షణ ఇవ్వడం ప్రయోజనకరం కాకున్నా అవకాశం కల్పించడం వివాదాలకు తావిస్తోంది. సెంటర్ల నిర్వహణపై ఫిర్యాదుల వెల్లువ... బీసీ స్టడీ సెంటర్ల నిర్వహణపై పలుచోట్ల అభ్యర్థుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. అడ్డగోలు నిర్వహణతో విలువైన సమయాన్ని వృథా చేశారంటూ అభ్యర్థులు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. కామారెడ్డి, నారాయణపేట్, వికారాబాద్ జిల్లాల్లోని బీసీ స్టడీ సెంటర్ల నిర్వహణపై అభ్యర్థులు ఏకంగా జిల్లా కలెక్టర్లను కలిసి ఫిర్యాదు చేశారు. వీటితో పాటు మరికొన్ని జిల్లాల్లోని కూడా స్థానిక అధికారులకు ఫిర్యాదులు చేశారు. సంబంధిత జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారులకు తనిఖీ బాధ్యతలు అప్పగించినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేదు. ఇరవై రోజుల్లో మూసేశారు... బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ఉచిత శిక్షణ అంటే మరో ఆలోచన లేకుండా అడ్మిషన్ తీసుకున్నాను. కానీ కేవలం ఇరవై రోజుల్లో స్టడీ సెంటర్ను మూసేశారు. 25 శాతం సిలబస్ కూడా పూర్తి చేయలేదు. మరోవైపు గ్రూప్–4 నోటిఫికేషన్ రాగా, గ్రూప్–3 ప్రకటన అతి త్వరలో వస్తుందని సమాచారం. ఇంతటి కీలక సమయంలో సెంటర్ మూసివేయడంతో మరో చోట కోచింగ్కు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. కనీసం స్టడీ మెటీరియల్ కూడా ఇవ్వకపోవడంతో ఎలా సన్నద్ధం కావాలో అర్థం కావడం లేదు. వెంటనే స్టడీ సెంటర్ను తెరిచి శిక్షణ తరగతులు నిర్వహించాలి. – ప్రసాద్, వికారాబాద్ బీసీ స్టడీ సర్కిల్ అభ్యర్థి నిరుద్యోగుల జీవితాలతో ఆటలా... ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ అనడంతో ఎంతో నమ్మకంతో వేలాది మంది నిరుద్యోగులు బీసీ స్టడీ సెంటర్లలో శిక్షణ తరగతులకు హాజరయ్యారు. కానీ ఎలాంటి ప్రమాణాలను పాటించకుండా ప్రైవేటు సంస్థలకు శిక్షణ బాధ్యతలు అప్పగించడం... పూర్తిస్థాయిలో తరగతులు నిర్వహించకుండా మధ్యలోనే చేతులెత్తేయడంతో నిరుద్యోగ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారు. ఇందుకు బాధ్యులను గుర్తించి కఠినచర్యలు తీసుకోవాలి. – ముత్తినేని వీరయ్య, చైర్మన్, టీపీసీసీ వికలాంగుల విభాగం నిబంధనల ప్రకారమే కాంట్రాక్టు బాధ్యతలు నిబంధనల ప్రకారమే శిక్షణ సంస్థలకు బాధ్యతలు అప్పగించాం. స్టడీ సెంటర్ నిర్వహణ, వసతులన్నీ బీసీ సంక్షేమ శాఖ ద్వారా చేపట్టగా... ఫ్యాకల్టీ, మాక్ టెస్టులు మాత్రం ప్రైవేటు కేంద్రానికి అప్పగించాం. తక్కువ కాల వ్యవధి శిక్షణ కోసం ప్రత్యేకంగా ఫ్యాకల్టీని ఎంపిక చేసి వారికి వేతనాలు ఇవ్వడం పెద్ద ప్రక్రియ. అలా కాకుండా ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారమే ప్రైవేటు సంస్థలను ఎంపిక చేసి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాం. – అలోక్ కుమార్, డైరెక్టర్, బీసీ స్టడీ సర్కిల్ -
గేమ్ఛేంజర్.. ‘ఇప్పుడే పెళ్లి వద్దు, అబ్బాయి గురించి తెలుసుకోవాలి’
‘ఒక్క బాల్తో జీవితం అంటే ఏమిటో తెలుసుకున్నాను’ అంటాడు ఒక ప్రసిద్ధ ఫుట్బాల్ ఆటగాడు. ‘ఫుట్బాల్ అనేది జీవితాన్ని కూడా అర్థం చేయిస్తుందా?’ అనే ప్రశ్నకు ‘అవును’ అని జవాబు చెప్పడానికి రాజస్థాన్లోని ఎన్నో గ్రామాలు సిద్ధంగా ఉన్నాయి. ఇల్లు దాటి బయటికి రాని అమ్మాయిలు, ఫుట్బాల్ వల్ల గ్రౌండ్లోకి రాగలిగారు. ఆటలో ప్రతిభ చూపి రాష్ట్ర స్థాయికి ఎదగడమే కాదు అనేక కోణాల్లో జీవితాన్ని అర్థం చేసుకున్నారు. బాల్య వివాహాలను బహిష్కరించే చైతన్యం పొందారు... రాజస్థాన్లోని అజ్మీర్కు సమీపంలో చబియావాస్, హిసియావాస్లాంటి ఎన్నో గ్రామాలలో బాల్యవివాహాలు అనేవి సర్వసాధారణం. హిసియావాస్ గ్రామానికి చెందిన నిషా గుజ్జార్, కిరణ్లకు పెద్దలు పెళ్లి నిశ్చయించారు. అప్పుడు నిషా వయసు పది సంవత్సరాలు. కిరణ్ వయసు పన్నెండు సంవత్సరాలు. కొంతకాలం తరువాత... నిషా ఊళ్లోని ఫుట్బాల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్లో పేరు నమోదు చేసుకుంది. రోజూ రెండు గంటల పాటు ఆట నేర్చుకునేది. చబియావాస్ గ్రామానికి చెందిన పదమూడు సంవత్సరాల మమతకు గత సంవత్సరం నిశ్చితార్థం అయింది. అయితే ఆ వయసులో పెళ్లి చేసుకోవడం తనకు ఎంత మాత్రం ఇష్టం లేదు. అలా అని అని ఇంట్లో ఎదురు చెప్పే ధైర్యమూ లేదు. మరో గ్రామానికి చెందిన నీరజకు చిన్న వయసులోనే పెళ్లి అయింది. అత్తారింటికి వెళితే పనే లోకం అవుతుంది. తనకు చదువుకోవడం అంటే చాలా ఇష్టం. నిషాలాగే మమతా, నీరజ ఇంకా ఎంతోమంది అమ్మాయిలు శిక్షణా కేంద్రంలో పేరు నమోదు చేసుకొని ఫుట్బాల్ ఆడడం మొదలుపెట్టారు. ఇప్పుడు... ‘పద్దెనిమిది సంవత్సరాలు దాటితేగానీ పెళ్లి చేసుకోను’ అని పెద్దలకు ధైర్యంగా చెప్పేసింది నిషా. వాళ్లు ఒప్పుకున్నారు. ‘ఇప్పుడే పెళ్లి వద్దు, అబ్బాయి కుటుంబ నేపథ్యం గురించి నేను తెలుసుకోవాలి. నా చదువు పూర్తి కావాలి’ అని ధైర్యంగా చెప్పింది మమత. వాళ్లు కూడా ఒప్పుకున్నారు. ‘పెళ్లి ఇప్పుడే వద్దు. నాకు చదువుకోవాలని ఉంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలనేది నా కల’ అని ఇంట్లో వాళ్లకు చెప్పింది నీరజ. ఇంత మార్పు ఎలా వచ్చింది? నీరజ మాటల్లో చెప్పాలంటే... ‘ఫుట్బాల్ ఆడడం వల్ల ఎంతో ఆత్మవిశ్వాసం, నా మనసులోని మాటను బయటికి చెప్పే శక్తి వచ్చింది’ ఫుట్బాల్ ఆడడంతోపాటు అమ్మాయిలందరూ ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకునేవారు. అందులో ఎక్కువమంది చిన్న వయసులోనే పెళ్లి, నిశ్చితార్థం అయిన వారు ఉన్నారు. మాటల్లో చిన్న వయసులోనే పెళ్లి ప్రస్తావన వచ్చేది. ‘ఎవరో కాదు మనమే అడ్డుకుందాం. మన జీవితాన్ని మనమే తీర్చిదిద్దుకుందాం’ అనే చైతన్యం వారిలోకి వచ్చి చేరింది. ‘ఒకప్పుడు సంప్రదాయ దుస్తులు తప్ప వేరే దుస్తులు ధరించే అవకాశం లేదు. స్కూలుకు పంపడమే గొప్ప అన్నట్లుగా ఉండేది. ఇప్పుడు స్పోర్ట్స్వేర్లో నన్ను నేను చూసుకుంటే గర్వంగా ఉంది. ఒకప్పుడు ఆటలు అంటే మగపిల్లలకు మాత్రమే అన్నట్లుగా ఉండేది. ఇప్పుడు మాత్రం పెద్దల ఆలోచనా ధోరణిలో మార్పు వచ్చింది’ అంటుంది స్వప్న. ‘మహిళా జన్ అధికార్’ అనే స్వచ్ఛందసంస్థ రాజస్థాన్లో బాల్యవివాహాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలలో ఆడపిల్లలకు ఫుట్బాల్లో ఉచిత శిక్షణ కార్యక్రమాలను మొదలుపెట్టింది. అయితే ఈ ఫుట్బాల్ శిక్షణా కేంద్రాలు కాస్తా చైతన్య కేంద్రాలుగా మారాయి. ‘వ్యూహాత్మకంగానే గ్రామాల్లో ఫుట్బాల్ శిక్షణాకేంద్రాలు ప్రారంభించాం. దీనివల్ల అమ్మాయిలు ఈ ఆటలో ప్రతిభ చూపి రాష్ట్ర స్థాయిలో ఆడడం ఒక కోణం అయితే, సామాజిక చైతన్యం అనేది మరో కోణం. ఆట గురించి మాత్రమే కాకుండా మహిళల భద్రత, మహిళల హక్కులు, లింగ సమానత్వం... మొదలైన ఎన్నో అంశాల గురించి బోధిస్తున్నాం’ అంటోంది ‘మహిళా జన్ అధికార్’ బాధ్యురాలు ఇందిరా పంచోలి. -
Sheroes Hangout: ఆత్మబలమే అసలైన అందం... ఆనందం
ఆ కేఫ్ వేడివేడి చాయ్లకు మాత్రమే ఫేమస్ కాదు. వేడి, వేడి చర్చలకు కూడా. ఎక్కడో ఏదో దిగులుగా ఉందా? అంతా శూన్యం అనిపిస్తుందా? అయితే అటు పదండి. దేశవ్యాప్తంగా ఎంతోమంది యాసిడ్ బాధిత మహిళలకు అంతులేని ధైర్యాన్ని ఇచ్చిన శ్రేయాస్ హ్యాంగవుట్ కేఫ్ ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసింది... ఉత్తర్ప్రదేశ్ రాజధాని లక్నోలోని ‘శ్రేయాస్ హ్యాంగవుట్’ కేవలం రుచుల కేఫ్ మాత్రమే కాదు. ఆత్మవిశ్వాసం లేనివారికి అంతులేని ఆత్మస్థైర్యాన్ని, విశ్వాసాన్ని ఇచ్చే వేదిక. అభాగ్యుల కన్నీటిని తుడిచే చల్లని హస్తం. ఆపదలో ఉన్నవారికి చేయూత ఇచ్చి ముందడుగు వేయించే ఆత్మీయ మిత్రురాలు. యాసిడ్ ఎటాక్ సర్వైవర్స్ ఈ కేఫ్ను నడుపుతున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది యాసిడ్ బాధిత మహిళలకు స్ఫూర్తి ఇచ్చిన ‘శ్రేయాస్ హ్యాంగవుట్’ తాజాగా మరో అడుగు ముందుకు వేసింది. ప్రముఖ బ్యూటీ చైన్ సెలూన్ ‘నెచురల్స్’తో కలిసి యాసిడ్ బాధిత మహిళలకు ప్రొఫెషనల్ బ్యూటీ కోర్సులలో ఉచిత శిక్షణ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సాధారణంగా ఈ కోర్స్ చేయడానికి డెబ్బై వేల నుంచి లక్ష రూపాయల వరకు ఖర్చవుతుంది. శిక్షణ ఇవ్వడం మాత్రమే కాదు, వారు సొంతంగా బ్యూటీపార్లర్ ప్రారంభించడానికి అవసరమైన సహాయాన్ని కూడా అందిస్తారు. ఇప్పటి వరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన అయిదు మంది మహిళలు శిక్షణ తీసుకున్నారు. వారిలో ఒకరు ఫరాఖాన్. ఒకప్పుడు ఆమెకు మేకప్ వేసుకోవడం అంటే ఎంతో ఇష్టం. అయితే భర్త యాసిడ్ దాడి చేసిన తరువాత అద్దంలోకి చూడాలంటేనే భయపడే పరిస్థితికి వచ్చింది. ‘అందరు మహిళలలాగే నాకు కూడా అలంకరణ అంటే చాలా ఇష్టం. శుభకార్యాలకు వెళ్లడానికి ముందు ఎంతో హడావిడి చేసేదాన్ని. నా భర్త చేసిన దుర్మార్గం వల్ల మేకప్ అనే మాట వినబడగానే కన్నీళ్లు ధారలు కట్టేవి. అద్దం చూడడానికి భయమేసేది. ఇలాంటి నా మానసిక ధోరణిలో పూర్తిగా మార్పు తీసుకువచ్చి నన్ను బలమైన మహిళగా నిలబెట్టింది శ్రేయాస్. పూర్వంలాగే ఇప్పుడు నేను మేకప్ విషయంలో శ్రద్ధ చూపుతున్నాను. ఏ తప్పు చేశానని భయపడాలి? ఎవరికి భయపడాలి!’ అంటుంది ఫరాఖాన్. 28 సంవత్సరాల కుంతి సోని డిమాండ్ ఉన్న నెయిల్ ఆర్ట్లో శిక్షణ తీసుకుంది. ఒక సినిమా కోసం బాలీవుడ్ కథానాయిక దీపికా పదుకొణెతో కలిసి పనిచేసింది. ‘యాసిడ్ బాధితులకు ఉపాధి దొరకడం ఒక ఎల్తైతే, అందమైన ఆనంద జీవితం మరో ఎత్తు. యాసిడ్ బాధితురాలైన నేను మేకప్ వేసుకుంటే నలుగురు చులకనగా మాట్లాడతారేమో...అనే భావనతో చాలామంది అలంకరణ అనే అందమైన సంతోషాన్ని తమ ప్రపంచం నుంచి దూరం చేసుకుంటున్నారు. అలాంటి వారికి శ్రేయాస్ కొత్త ధైర్యాన్ని ఇచ్చింది’ అంటుంది సోని. ఘాజిపూర్కు చెందిన రూపాలి విశ్వకర్మ సినిమా రంగంలో మేకప్–ఆర్టిస్ట్ కావాలని బలంగా అనుకుంటుంది. కొన్ని ప్రాంతీయ చిత్రాలలో చిన్న చిన్న పాత్రలు వేసిన రుపాలి ఆర్టిస్ట్గా నిలదొక్కుకోకముందే ఆమెపై గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ఆమె ఒక కన్ను పూర్తిగా దెబ్బతింది. ఆమె రంగుల కల నల్లగా మసక బారింది. ఒకప్పుడు కళ్లముందు సుందర భవిష్యత్ చిత్రపటం తప్ప మరేది కనిపించేది కాదు. దాడి తరువాత ఎటుచూసినా దుఃఖసముద్రమే! ‘బయటి వాళ్ల నుంచి మాత్రమే కాదు ఇంటివాళ్ల నుంచి కూడా నన్ను పట్టించుకోని నిర్లక్ష్య ధోరణి ఎదురైంది. ఒక మూలన కూర్చొని జీవితాన్ని వెళ్లదీయి అన్నట్లుగా ఉండేవి వారి మాటలు. అయితే శ్రేయాస్తో పరిచయం అయిన తరువాత నాలో ధైర్యం పెరిగింది. మరుగున పడిన కలలు మళ్లీ ఊపిరి పోసుకున్నాయి. నేను మేకప్–ఆర్టిస్ట్గా రాణించడం మాత్రమే కాదు, ధైర్యం లోపించి దారి కనిపించని యువతులకు ధైర్యం ఇవ్వాలనుకుంటున్నాను’ అంటుంది రుపాలి. శ్రేయాస్ సరికొత్త ముందడుగు ద్వారా ‘అలంకరణ, అందం అనేవి మనకు సంబంధించిన మాటలు కావు’ అనే దుఃఖపూరిత నిరాశానిస్పృహలకు కాలం చెల్లుతుంది. ‘ఆత్మబలమే అసలైన అందం, ఆనందం’ అనుకునే కొత్త కాలం ఒకటి వస్తుంది. -
త్వరలోనే పోలీసు ఉద్యోగ ఉచిత శిక్షణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో త్వరలో పోలీసు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నిరుద్యోగ యువతకు రాచ కొండ పోలీస్ కమిషనరేట్ తరుఫున ప్రీ రిక్రూట్మెంట్ ఉచిత శిక్షణను ప్రారంభించ నున్నట్లు రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పోలీసు ఉద్యోగం సాధించాలన్నారు. గురువారం ఆయన అంబర్పేటలోని సీఏఆర్ హెడ్ క్వార్టర్స్లో డాగ్స్ కెన్నెల్, మెటార్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసులను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. లా అండ్ ఆర్డర్ పోలీసులకు సహకరిస్తూ సమాజంలో శాంతి భద్రతలను కాపాడటంలో సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ (ఏఆర్) పోలీసుల పాత్ర కీలకమైనదని, వారి సంక్షేమమే తొలి ప్రాధాన్యమన్నారు. పీఎస్ఓ డ్యూటీలు, బందోబస్త్, వీఐపీ సెక్యూరిటీ తదితర అంతర్గత భద్రతలో వీరి పాత్ర కీలకమని పేర్కొన్నారు. విధుల పట్ల నిబద్ధతతతో ఉంటూ శారీరక, మానసిక ధృడత్వాన్ని పెంచుకోవాలని సూచించారు. ఏఆర్ విభాగంలో ఎక్కువ సంఖ్యలో మహిళలు చేరడం అభినందనీయమన్నారు. వివిధ విభాగాల్లో మహిళా సిబ్బంది తమ సామర్థ్యాలను ప్రదర్శించేందుకు తగిన సహకారాన్ని అందిస్తామని, త్వరలోనే మహిళా పెట్రోలింగ్ బృందాలను ప్రవేశపెట్టనున్నామని ఈ సందర్భంగా సీపీ వెల్లడించారు. అనంతరం 15 రోజులుగా కొనసాగతున్న వార్షిక డీ–మొబిలైజేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ సీపీ సుధీర్ బాబు, డీసీపీ క్రైమ్స్ యాదగిరి, డీసీపీలు సన్ప్రీత్ సింగ్, రక్షిత కే మూర్తి, సలీమా, అడిషనల్ డీసీపీలు ఎం శ్రీనివాస్, షమీర్ తదితర పోలీసు అధికారులు పాల్గొన్నారు. -
మేకింగ్ ఆఫ్ ఎ క్వీన్.. పచ్చళ్ల మహారాణి
నాలుగేళ్ల వయసులో తల్లి చనిపోయింది. చెల్లిని తీసుకుని అమ్మమ్మ వాళ్ల ఇంటికి వెళ్లిపోయింది డుజోమ్. అక్కాచెల్లెళ్లు టీనేజ్ లోకి వస్తుండగా అమ్మమ్మ కూడా చనిపోయింది. మారుతల్లి ఉన్నా తల్లి కాలేకపోయింది. ఆమె దగ్గర కనాకష్టంగా బతికి ఇంటర్మీడియెట్ అవగానే రాజధాని ఇటానగర్ వెళ్లిపోయింది. అదే ఆమె జీవితానికి మలుపయింది. ఇప్పుడామె ‘పికిల్ క్వీన్’! పచ్చళ్ల సామ్రాజ్ఞి. బాగా డబ్బు సంపాదిస్తున్న వ్యాపారులు ఇంకొకర్ని తమ దారి లోకి రానివ్వరు. కానీ డుజోమ్.. నిరుపేద గృహిణుల స్వయం సమృద్ధి కోసం వారికి పచ్చళ్ల మేకింగ్లో, మార్కెటింగ్లో ఉచితంగా శిక్షణ ఇస్తోంది. యదే డుజోమ్ ఎనిమిదవ తరగతి చదువుతుండగా అమ్మమ్మ చనిపోవడంతో డుజోమ్, ఆమె చెల్లెలు మళ్లీ తండ్రి చెంతకే వారు చేరవలసి వచ్చింది. తండ్రి ఒక్కడే లేడు ఆ ఇంట్లో! ఇంకో ‘అమ్మ’ కూడా ఉంది. తనను, చెల్లిని ఆమె ఎంత హింసపెట్టిందో డుజోమ్ కొన్నిసార్లు గుర్తు చేసుకుంటూ ఉంటుంది. డుజోమ్ ఇప్పుడు పచ్చళ్ల వ్యాపార సామ్రాజ్యానికి మహారాణి. ‘అరుణాచల్ పికిల్ హౌస్’ అంటే ఇప్పుడు ఆ రాష్ట్ర రాజధాని ఇటానగర్లో పెద్ద పేరు. అయితే పికిల్ హౌస్ ప్రారంభం రోజు ఒక్కరంటే ఒక్కరు కూడా అటువైపే రాలేదు! ‘పికిల్ క్వీన్’గా ప్రసిద్ధి చెందిన డుజోమ్ తన వ్యాపారం గురించి మాత్రమే చూసుకోవడం లేదు. ఆర్థికంగా అసహాయులైన గృహిణులనూ చూసుకుంటోంది. వారిని చేరదీసి పచ్చళ్ల తయారీలో శిక్షణ ఇస్తోంది. పచ్చళ్ల మార్కెటింగ్ గురించి టిప్స్ ఇస్తోంది. అలా ఇటానగర్లోని ఎందరో గృహిణులను గ్రూపులుగా చేసి, ఉపాధి నైపుణ్యాలను నేర్పిస్తోంది. అసలు ఇదంతా ఆమెకు ఎలా చేతనైనట్లు?! ‘‘జీవితంలో కష్టాలు తప్పవు. ఆ కష్టాల్లోనే పరిష్కారం దొరుకుతుంది. ఎప్పటికీ నిరాశ చెందకూడదు’’ అంటుంది డుజోమ్. డుజోమ్కు ఇప్పుడు 29 ఏళ్లు. ఈ ఏడాది ఫిబ్రవరి 14న ‘అరుణాచల్ పికిల్ హౌస్’ను ప్రారంభించింది. ఈ నాలుగు నెలల్లో పికిల్ క్వీన్ అయింది! ∙∙ పినతల్లి ఇంట్లోంచి వెళ్లిపోయిన ఈ పన్నెండేళ్లలో నెలకింతని డబ్బును దాచిపెట్టగలిగింది డుజోమ్. ఫుడ్ ప్రాసెసింగ్లో శిక్షణ తీసుకుంది. లేబుల్ మేకింగ్ నేర్చుకుంది. పదార్థాలను ఎలా నిల్వ ఉంచాలో తెలుసుకుంది. పచ్చళ్ల తయారీ మెళకువలను మణిపుర్ వెళ్లిప్పుడు అక్కడ కొంతమంది మహిళల నుంచి శ్రద్ధగా గ్రహించింది. అరుణాచల్ప్రదేశ్ తిరిగొచ్చాక పచ్చళ్ల తయారీ పద్ధతులలో శాస్త్రీయంగా శిక్షణ పొందింది. ఆ క్రమంలో పికిల్ హౌస్ అంకురార్పణ జరిగింది. ప్రస్తుతం ఎనిమిది మంది సిబ్బంది ఆమెకు చేదోడుగా ఉన్నారు. వారంతా గృహిణులు. లేమిలో, కుటుంబ సమస్యల కుంగుబాటులో ఉన్నవారు. వారిని పెట్టుబడి లేని భాగస్వాములుగా చేర్చుకుంది. అమ్మకాల వల్ల వస్తున్న లాభాలను వారికి పంచుతోంది. వ్యాపారాన్ని మరింతగా పెంచాలన్న ఆలోచనలో ఉంది. డుజోమ్ తనకు తానుగా వెజ్, నాన్వెజ్ పచ్చళ్లను రుచికరంగా తయారు చేయడంలో నిపుణురాలు. ప్రత్యేకించి ఆమె పెట్టే.. చేపలు, పోర్క్, చికెన్, అల్లం, వంకాయ, కాప్సికమ్, బంగాళదుంప, పనస, ముల్లంగి నిల్వ పచ్చళ్లు ప్రత్యేక గుర్తింపు పొందాయి. అలాగే డిమాండ్ కూడా. చెల్లెలు కూడా ఇప్పుడు ఆమెతోనే ఉంటోంది. ఇటానగర్ ఆమె అమ్మ తరఫు వారు ఉండే పట్టణం. అందుకనే డుజోమ్ అక్కడ స్థిరపడింది. -
ఆర్మీ, పారా మిలిటరీ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
సాక్షి, ఖమ్మం: బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని మున్సిపాలిటీల్లో అర్హులైన బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఆర్మీ, పారా మిలిటరీ(సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బీ, సీఐఎస్ఎఫ్, ఎన్ఐఏ, ఎస్ఎస్ఎఫ్)ఉద్యోగాల్లో చేరేందుకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీలత ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి చదివిన యువకులు 18 నుంచి 27 సంవత్సరాలు వయసు కలిగి ఉండి 167 సెం.మీ. ఎత్తు, 77 సెం.మీ. చాతి ఉన్న యువకులకు కైరోస్ కాంపోజిట్ సర్వీసెస్ ట్రైనింగ్ అకాడమీ ద్వారా హైదరాబాద్లో 45 రోజుల పాటు హాస్టల్ వసతితో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. అర్హులైన ఉండి ఆసక్తి గల వారు ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డుతో ఈ నెల 24వ తేదీ లోపు బీసీ స్టడీసర్కిల్ నందు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి సమాచారం కోసం 08742–227427, 9573859598 నంబర్లను సంప్రదించాలన్నారు. -
మార్చి 1–3 తేదీల్లో హైదరాబాద్లో సేంద్రియ ఉత్పత్తుల మేళా
సేంద్రియ రైతులతో నేరుగా సంబంధాలు కలిగిన ఏకలవ్య ఫౌండేషన్, గ్రామభారతి, గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం, రైతునేస్తం ఫౌండేషన్, భారతీయ కిసాన్ సంఘ్ కలిసి గో ఆధారిత రైతుమిత్ర సంఘం ఆధ్వర్యంలో తొలిసారిగా హైదరాబాద్లో మార్చి 1, 2, 3 తేదీల్లో సేంద్రియ ఉత్పత్తుల మేళాను నిర్వహిస్తుండటం విశేషం. హైటెక్ సిటీలోని శిల్పారామం నైట్ బజార్లో జరగనున్న ఈ మేళాకు కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఎన్.ఐ.పి.హెచ్.ఎం, సి.ఎఫ్.టి.ఆర్.ఐ., ఎన్.ఐ.ఎన్. సంస్థలు కూడా ఈ మేళాలో పాలుపంచుకుంటున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సేంద్రియ రైతులు, దుకాణదారులు తమ సేంద్రియ ఉత్పత్తులను అమ్మకానికి పెడతారు. సేంద్రియ ఆహారోత్పత్తులతోపాటు 200 రకాల ఔషధ మొక్కలు, హెర్బల్ ఉత్పత్తులు, బయో ఫర్టిలైజర్స్, బయో పెస్టిసైడ్స్ కూడా అందుబాటులో ఉంటాయని గో ఆధారిత రైతు మిత్ర సంఘం తెలంగాణ ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం రాజు తెలిపారు. మార్చి 1న ఉ. 10 గంటలకు మహా రైతు సమ్మేళనం ప్రారంభమవుతుంది. మ. 3 గం. కు కోత అనంతరం విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై సి.ఎఫ్.టి.ఆర్.ఐ. నిపుణులతో సదస్సు, సేంద్రియ వ్యవసాయంపై ఇష్టాగోష్టి ఉంటాయి. 2న సా. 3 గం.కు సేంద్రియ వ్యవసాయంపై సదస్సు, జాతీయ పోషకాహార సంస్థ నిపుణుల ఆధ్వర్యంలో ఆహార సదస్సు ఉంటుంది. 3న సా. 3 గం.కు జరిగే పర్యావరణ అనుకూల సేంద్రియ వ్యవసాయంపై సదస్సు ఉంటుంది. 4 గం.కు సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యంపై స్వతంత్ర శాస్త్రవేత్త డా. ఖాదర్ వలి ప్రసంగం, చర్చాగోష్టి ఉంటాయి. ముందుగా పేర్లు నమోదు చేసుకున్న సేంద్రియ, ప్రకృతి వ్యవసాయదారులు ఉచితంగా టేబుల్ స్పేస్ పొందే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు. వివరాలకు.. 76598 55588, 91001 02229, 92465 33243, 98666 47534. 3న బసంపల్లిలో గో ఆధారిత వ్యవసాయంపై శిక్షణ అనంతపురం జిల్లా చెన్నే కొత్తపల్లి మండలం బసంపల్లి గ్రామంలోని ఆలయ ప్రాంగణంలో మార్చి 3(ప్రతి నెలా మొదటి ఆదివారం)న ఉ. 9 గం. నుంచి సా. 4 గం. వరకు గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ పద్ధతిపై సీనియర్ రైతు నాగరాజు శిక్షణ ఇస్తారు. పాల్గొనదలచిన రైతులు ముందుగా తమపేర్లు నమోదు చేయించుకోవాలి. రుసుము రూ. 100 (భోజనం సహా). వివరాలకు.. 94407 46074, 96636 67934 3న కొర్నెపాడులో బొప్పాయి, కూరగాయల సాగుపై శిక్షణ రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కొర్నెపాడులోని రైతు శిక్షణా కేంద్రంలో ప్రకృతి వ్యవసాయవిధానంలో బొప్పాయి, కూరగాయల సాగుపై మార్చి 3(ఆదివారం)న సీనియర్ రైతులు శరత్బాబు (ప్రకాశం జిల్లా), శివనాగమల్లేశ్వరరావు (గుంటూరుజిల్లా) రైతులకు శిక్షణ ఇస్తారు. వివరాలకు.. 97053 83666, 0863–2286255. 1న డ్రయ్యర్తో మామిడి ఆమ్చుర్, తాండ్ర తయారీపై ఉచిత శిక్షణ మామిడి కాయలతో ఒరుగులు (స్లైసెస్), మామిడి కాయల పొడి (ఆమ్చూర్), మామిడి తాండ్రలను తక్కువ ఖర్చుతో త్వరగా ఎండబెట్టే డ్రయ్యర్ సాంకేతికత–నిర్వహణపై మార్చి 1 (శుక్రవారం)న ఉ. 10 గం.ల నుంచి గుంటూరు జిల్లా పెదవడ్లపూడిలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు నిర్వాహకుడు ఎల్. శ్రీనివాసరావు తెలిపారు. ఒక హెచ్.పి. విద్యుత్తు లేదా వంట చెరకుతో ఈ డ్రయ్యర్ నడుస్తుంది. వివరాలకు.. 99123 47711. -
‘యువతకు రైల్వే పోస్టుల ఉచిత శిక్షణ ఇవ్వాలి’
సాక్షి, హైదరాబాద్: భారతీ య రైల్వేలో వివిధ పోస్టుల కోసం త్వరలో రాత పరీక్షలు జరగనున్న నేపథ్యంలో తెలంగాణ యువతకు ఉచిత శిక్షణ ఇవ్వాలని ఎంపీ వినోద్కుమార్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన సీఎం కేసీఆర్కు లేఖ రాశా రు. దేశవ్యాప్తంగా రైల్వేశాఖలో త్వరలో రెండున్నర లక్షల పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఇటీవల రైల్వే శాఖ ప్రకటించిన సంగతి తెలి సిందే. త్వరలోనే రైల్వేలో పనిచేస్తున్న వేలాది మంది సిబ్బంది పదవీ విరమణ చేయనున్నారు. దీంతో మరిన్ని ఖాళీలు ఏర్పడనున్నాయి. బిహార్, తమిళనాడుల్లో ఉచిత కోచింగ్ ఇస్తుండటంతో అక్కడి నిరుద్యోగులకు ఎక్కువగా రైల్వే లో ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైల్వే ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న రాష్ట్ర యువతకు వంద రోజుల పాటు ఉచి తంగా కోచింగ్ ఇవ్వాలని సీఎంతో పాటు గురుకుల పాఠశాలల సమితి కార్యదర్శి ఆర్.ఎస్ ప్రవీణ్కుమార్కు ఎంపీ వినోద్ లేఖలు రాశారు. హైదరాబాద్, కాజీపేట, కరీంనగర్, మహబూబ్నగర్లతో పాటు అన్ని పాత జిల్లా కేంద్రాల్లో రైల్వే పోటీ పరీక్షలకు ఉచితంగా కోచింగ్ ఇచ్చేం దుకు ఏర్పాట్లు చేయాలని వినోద్ సూచించారు. -
నీట్, జేఈఈలకు ఉచిత శిక్షణ ఇస్తాం
న్యూఢిల్లీ: నీట్, జేఈఈ, నెట్ వంటి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు 2019, మే నుంచి ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు కేంద్ర మానవవనరుల శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. దేశవ్యాప్తంగా విద్యార్థుల కోసం ఏర్పాటు చేస్తున్న 2,697 స్టడీ సెంటర్లను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శిక్షణ కేంద్రాలుగా మారుస్తుందని వెల్లడించారు. ఈ స్టడీ సెంటర్లు వచ్చే నెల 8 నుంచి ప్రారంభమవుతాయి. ఈ కేంద్రాలు విద్యార్థుల నుంచి ఎలాంటి ఫీజును వసూలు చేయబోవు. చదువుకోవాలన్న తపన ఉన్నప్పటికీ ఆర్థిక కారణాలతో వెనుకంజ వేస్తున్న విద్యార్థుల కోసమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ఎన్టీఏ తొలుత జేఈఈ మెయిన్స్ విద్యార్థులకు 2019, జనవరిలో మాక్ టెస్టులు నిర్వహిస్తారు. మొబైల్ యాప్ లేదా వెబ్సైట్ లో విద్యార్థులు మాక్ టెస్టుల కోసం సెప్టెంబర్ 1 నుంచి రిజిస్టర్ కావొచ్చని వెల్లడించారు. ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశ పరీక్షల నిర్వహణ కోసం కేంద్రం ఎన్టీఏను స్థాపించిన సంగతి తెలిసిందే. -
‘డెంటల్ అసిస్టెంట్ కోర్సులో ఉచిత శిక్షణ’
సాక్షి, హైదరాబాద్: డెంటల్ అసిస్టెంట్ కోర్సులో 3 నెలల ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు రాష్ట్ర సహకార సంఘాల సమాఖ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఆసక్తి గలవారు ఈ నెల 25లోగా మాసబ్ట్యాంక్లోని కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించింది. శిక్షణలో చేరాలంటే అభ్యర్థుల వయసు 21–45 ఏళ్లలోపు ఉండి ఇంటర్ ఉత్తీర్ణత సాధించాలని, హైదరాబాద్ జిల్లా వాసి అయి ఉండాలని వెల్లడించింది. వివరాలకు 040–23319313ను సంప్రదించాలని సూచించింది. -
ఫిల్మ్ మేకింగ్లో ఉచిత శిక్షణ
విజయనగరం పూల్బాగ్ : కాపు, బలిజ. తెల గ, ఒంటరి కులాల నిరుద్యోగులకు ఫినిషింగ్ స్కూల్ సర్టిఫికెట్ ఇన్మల్టీ మీడియా, ఫిల్మ్ మేకింగ్ రంగంలో ఆంధ్రప్రదేశ్ కాపు సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ వారు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు బీసీ కార్పొరేషన్ ఈడీ ఆర్వీ నాగరాణి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపా రు. ఈ శిక్షణా శిబిరాన్ని కాపు కార్పొరేషన్, ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ కంప్యూటర్ గ్రాఫిక్స్, దిల్సుఖ్నగర్, హైదరాబాద్ వారు సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు పే ర్కొన్నారు. అభ్యర్థులకు భోజన వసతి కల్పి స్తామని పేర్కొన్నారు. స్త్రీలు, పురుషులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. వసతులను ఉపయోగించుకోని వారికి నెలకు రూ.5వేలు స్టయిఫండ్ ఇస్తాని తెలిపారు. అభ్యర్థులు ఇంటర్మీడియట్, ఐటీఐ డిప్లమో, పాలిటెక్నిక్ డిప్లమా ఉత్తీర్ణులై ఉండాలని పేర్కొన్నారు. శిక్షణలో ఉత్తీర్ణులైనవారికి నెలకు రూ.12 వేల నుంచి రూ.15వేల వరకు జీతంతో ఉద్యోగావకాశాలు ఉంటాయని వివరించారు. ఆసక్తిగలవారు ఈనెల 20న ఉదయం 10 గంటలకు విజయవాడలోని కాపు కార్పొరేషన్ కార్యాయానికి హాజరుకావాలని సూచించారుర. మరిన్ని వివరాలకు 7674826174, 733117 2074, 7331172075, 73331172076 నంబర్లను సంప్రదించాలని కోరారు. -
పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ
జనగామ అర్బన్ : పోలీస్ కానిస్టేబుల్, వీఆర్వో, గ్రూపు–4 పోటీ పరీక్షల కోసం అర్హులైన వారికి 60 రోజుల ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు డీసీపీ మల్లారెడ్డి, డీఆర్డీఓ మేకల జయచంద్రారెడ్డి అన్నారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డీఆర్డీఏ, పోలీస్శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ‘వారధి’ సంస్థ కరీంనగర్ సహకారంతో సుమారు 400 మందికి ఉచిత శిక్షణ ఇవ్వడానికి ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందుకు సంబంధించిన ఖర్చులను సదరు సంస్థ భరిస్తుందని తెలిపారు. శిక్షణార్థులకు హైదరాబాద్కు చెందిన ప్రముఖ శిక్షణ సంస్థల ప్రతినిధులు తరగతులు బోధిస్తారని పేర్కొన్నారు. కానిస్టేబుల్ పరీక్ష రాసే అభ్యర్థులు ఈనెల 18 నుంచి 22 వరకు ఆయా మండలాల్లోని పోలీస్ స్టేషన్న్లలో ఒరిజినల్, జిరాక్స్ సర్టిఫికెట్లతోపాటు రెండు పాస్పోర్ట్ సైజు ఫొటోలు తీసుకుని తమ పేర్లను నమోదు చేసుకుని, వెంటనే అర్హత పరీక్షకు సంబంధించిన హాల్టికెట్ పొందవచ్చునని తెలిపారు. అదేవిధంగా వీఆర్వో, గ్రూపు–4 పరీక్షకు హజరయ్యే అభ్యర్థులు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థలోని చాకలి అయిలమ్మ జిల్లా సమాఖ్యలో ఈనెల 22 సాయంత్రం 5 గంటలలోగా దరఖాస్తులు సమర్పించాలని డీఆర్డీఓ మేకల జయచంద్రారెడ్డి కోరారు. ఈనెల 24న యశ్వాంతాపూర్ గ్రామ శివారులోని క్రీస్తుజ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం కానిస్టేబుల్స్ అభ్యర్థులకు, మధ్యాహ్నం వీఆర్వో, గ్రూపు–4 అభ్యర్థులకు అర్హత పరీక్షను నిర్వహిస్తామని తెలిపారు. అభ్యర్థులు కూడా ఉచిత శిక్షణ అని అనుకోవద్దని, ప్రమాణాలు పాటించి నిష్ణాతులైన వారిచే బోధించనున్న తరగతులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నిరుద్యోగులకు శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందన్న ఆశాభావాన్ని వారు వ్యక్తం చేశారు. పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసుకునే పీహెచ్సీ (వికలాంగ) అభ్యర్థులకు వసతి కల్పించే విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సమావేశంలో డీఆర్వో మాలతి, ఏసీపీ బాపురెడ్డి, డీఆర్డీఓ కార్యాలయ అధికారి రాజేంద్రప్రసాద్, ఈజీఎస్ ప్రతినిధులు, ఆయా మండలాల పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు. -
అవకాశాలను అందిపుచ్చుకోవాలి
గజ్వేల్/గజ్వేల్రూరల్: అందివచ్చిన ప్రతి అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి సూచించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని దొంతుల ప్రసాద్ గార్డెన్స్లో సోమవారం నిర్వహించిన కానిస్టేబుల్ ఉచిత శిక్షణ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇంత భారీ స్థాయిలో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. అనంతరం కలెక్టర్ వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. గజ్వేల్లో శిక్షణ పొందుతున్న 750 మంది అభ్యర్థుల్లో 400 మందికి పైగా ఉద్యోగం సాధిస్తారన్న నమ్మకం ఉందన్నారు. రోజుకు 18 గంటల పాటు కష్టపడి చదివి సివిల్స్ స్టేట్ ర్యాంకు సాధించానని గుర్తుచేశారు. జిల్లాలో 1906 మంది శిక్షణ పొందుతుండగా వారిలో 1200 మంది ఉద్యోగం సాధిస్తారని ఆశిస్తున్నామన్నారు. ముంపు గ్రామాల విద్యార్థులకు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు హామీ మేరకు ఎంట్రెన్స్ పరీక్ష లేకుండా ఈ శిక్షణకు ఎంపిక చేశామన్నారు. శిక్షణ పొందే వారికి అన్ని వసతులతో పాటు భోజనం అందిస్తున్నామని చెప్పారు. శిక్షణ పూర్తయిన తర్వాత ఉన్నత చదువులు అభ్యసించిన వారికి హైదరాబాద్లో మరో 45 రోజుల పాటు శిక్షణ అందిస్తామన్నారు. అనంతరం పోలీస్ కమీషనర్ జోయల్ డేవిస్ మాట్లాడుతూ.. 21 వేల పోస్టులకు నోటిఫికేషన్లు వెలువడ్డాయన్నారు. ఇక్కడ 70 రోజుల పాటు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 వరకు 750 మందికి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. రెండో వారం నుంచి పరీక్షలు నిర్వహిస్తామని, 15 రోజులకోసారి అధికారులచే మోటివేషన్ తరగతులు కొనసాగుతాయన్నారు. రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మడుపు భూంరెడ్డి మాట్లాడుతూ.. ముందు గ్రామాల విద్యార్థులు ఉద్యోగాలు పొంది రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. గడా ప్రత్యేకాధికారి హన్మంతరావు మాట్లాడుతూ.. శిక్షణ పొందే అభ్యర్థులకు బాలుర, బాలికల ఎడ్యుకేషన్ హబ్లలోని వసతి గృహాల్లో వసతి ఏర్పాటుచేస్తామన్నారు. అనంతరం విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఆర్డీసీ చైర్మన్ తూంకుంట నర్సారెడ్డి, అదనపు డీసీపీ నర్సింహారెడ్డి, ఇన్చార్జి ఏసీపీ మహేందర్, శిక్షకులు భాగ్యకిరణ్, గజ్వేల్ ఆర్డీఓ విజయేందర్రెడ్డి, గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, వైస్చైర్మన్ దుంబాల అరుణ తదితరులు పాల్గొన్నారు. ఏనాడైనా రైతుల గురించి ఆలోచించారా? గజ్వేల్: ‘రైతుబంధు’ పథకంపై కాంగ్రెస్ నేతల విమర్శలు సిగ్గుచేటని ఎంపీ ప్రభాకర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ములుగులోని అటవీశాఖ అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుల గురించి ఏనాడూ పట్టించుకోని కాంగ్రెస్ నేతలు ఓట్ల కోసమే ఇలా మాట్లాడడం ఎంతవరకు సమంజసమని మండిపడ్డారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో తెలంగాణ ప్రభుత్వం ముందంజలో ఉందన్నారు. సమావేశంలో రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ మడుపు భూంరెడ్డి, గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ తదితరులున్నారు. -
నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ
కరీంనగర్ సిటీ: ఇండియన్ ఆర్మీలో ఉపాధి కోసం మేలో వరంగల్లో జరిగే ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో కరీంనగర్ జిల్లా నుంచి ఎక్కువమంది ఎంపికయ్యేందుకు నిరుద్యోగ యువతకు వారధి, ఎన్సీసీ బెటాలియన్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాలల ప్రిన్సిపాల్స్తో సమావేశం నిర్వహించారు. రన్నింగ్ అంబేద్కర్ స్టేడియంలో, క్యూటీ ఎస్సారార్ కళాశాలలో శిక్షణ ఇస్తారని తెలిపారు. ప్రతి కళాశాలలో ర్యాలీపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఎంపికైనవారికి ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు. 8వతరగతి నుంచి ఇంటర్, బీఎస్సీ నర్సింగ్, ఎల్ఎల్బీ ఇంజినీరింగ్ విద్యాభ్యాసం చేసినవారు వివిధ విభాగాల్లో ఆర్మీలో చేరొచ్చని అన్నారు. వారధి సొసైటీ సెక్రటరీ ఆంజనేయులు, కళాశాలల ప్రిన్సిపాళ్లు, లెఫ్ట్నెంట్ కల్నల్ ఉమాశంకర్ పాల్గొన్నారు. -
ఉచిత శిక్షణకు మంచి స్పందన
వికారాబాద్ అర్బన్: పోలీసు ఉద్యోగాల కోసం ఇచ్చే ఉచిత శిక్షణకు మంచి స్పందన వస్తోందని వికారాబాద్ డీఎస్పీ శిరీష తెలిపారు. సోమవారం వికారాబాద్ పోలీస్స్టేషన్లో నిర్వహించిన అభ్యర్థుల ఎంపికను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. కలెక్టర్ సయ్యద్ ఉమర్ జలీల్ సహకారంతో ఎస్పీ అన్నపూర్ణ ఆదేశంతో పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. సోమవారం అన్ని ఠాణాల్లో శిక్షణ తీసుకునే అభ్యర్థుల పేర్లు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. తాము ఆశించిన దానికంటే ఎక్కువ స్పందన అభ్యర్థుల నుంచి వస్తోందని చెప్పారు. సోమవారం వికారాబాద్ పీఎస్ పరిధిలో 295మంది యువకులు, 51మంది యువతులు పేర్లు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. 7వ తేదీ వరకు అవకాశం ఉండటంతో దరఖా స్తు సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. అభ్యర్థులకు అప్పటికప్పుడు ఎత్తు, సర్టిఫికెట్లను పరిశీలన చేశామని పేర్కొన్నారు. ఉన్నతాధికారుల సూచన మేరకు ఎంపికైన అభ్యర్థులు 8న తమ తల్లిదండ్రులతో కలిసి ఎస్పీ కార్యాలయానికి రావాలని చెప్పారు. బషీరాబాద్(తాండూరు): కానిస్టేబుల్ కోచింగ్ తీసుకోవడానికి నిరుద్యోగ యువకులు బారులు తీరారు. సోమవారం జిల్లాలోని ఆయా పోలీస్స్టేషన్ల పరిధిలో యువకులు దరఖాస్తు చేసుకున్నారు. మొదటి రోజు బషీరాబాద్ మండలంలో 30 మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వీరికి మొదటగా పోలీసులు శరీర కొలతలు తీసుకున్నారు. అర్హులైన యువకుల పేర్లను ఎస్పీ కార్యాలయానికి పంపిస్తున్నట్లు ఎస్ఐ లక్ష్మయ్య తెలిపారు. కార్యక్రమంలో సిబ్బంది రాంచందర్, శ్రీనివాస్, మహిపాల్ తదితరులు పాల్గొన్నారు. పరిగి పీఎస్లో 110 దరఖాస్తులు పరిగి: జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న కానిస్టేబుల్ అభ్యర్థుల ఉచిత శిక్షణ కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోంది. ఇందులో భాగంగా పరిగి పోలీస్ స్టేషన్లో మొదటిరోజు సోమవారం 110 మంది యువకులు శిక్షణ కోసం దరఖాస్తు చేసుకున్నారు. పోలీసులు ముందస్తుగా ఛాతీ, ఎత్తు కొలతలు పరిశీలించిన తర్వాతే దరఖాస్తులు తీసుకున్నారు. ఎస్ఐ కృష్ణ ఆధ్వర్యంలో దరఖాస్తుల ప్రక్రియ రోజంతా కొనసాగింది. శిక్షణ అవకాశాన్ని యువకులు సద్వినియోగం చేసుకోవాలని ఎస్ఐ తెలిపారు. శిక్షణ ఇచ్చిన తర్వాత శారీరక కొలతలు సరిపోకపోతో అభ్యర్థులు నిరుత్సాహానికి గురయ్యే అవకాశం ఉండటంతో పాటు సమయం వృథా అవుతుందని, అందుకే ముందస్తుగానే కొలతలు పరిశీలించి దరఖాస్తులు తీసుకుంటున్నామని చెప్పారు. -
పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ
కశింకోట (అనకాపల్లి): ఏపీ బాలయోగి గురుకుల కళాశాలల్లో ఇంటర్మీ డియట్ పూర్తిచేసిన విద్యార్థుల్లో ఆసక్తి గల వారికి పబ్లిక్ పరీక్షల అనంతరం ఎంసెట్, నీట్, బిట్స్ వంటి పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు గురుకులాల జిల్లా సమన్వయకర్త ఆర్.డి.వి.చంద్రశేఖర్ వెల్ల ్లడించారు. తాళ్లపాలెం ఏపీ బాలయోగి బాలికల గురుకుల కళాశాలలో బుధవారం సాయంత్రం మాట్లాడారు. పరీక్షల అనంతరం స్వల్ప కాలికంగా 40 రోజులపాటు ఆయా పోటీ పరీక్షలకు శిక్షణ ఇవ్వనున్నామని, ఇందుకు జిల్లాలో రెండు కేంద్రాలను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నామన్నారు. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ప్రభుత్వమే ఫీజును భరిస్తుందన్నారు. గురుకులంలో చదివిన విద్యార్థులు ఉపాధి, ఉద్యోగావకాశాలు పొందడానికి కేరీర్ గైడెన్స్ ఇస్తున్నామన్నారు. జిల్లాలోని 11 బాల బాలికల గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో డిజిటల్ తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. వచ్చే విద్యా సంవత్సరానికి వర్చువల్ తరగతులను కూడా అన్ని పాఠశాలలు, కళాశాలల్లో ప్రారంభిస్తామన్నారు. దీనివల్ల ఆన్లైన్ ద్వారా విద్యార్థులు ఇతర ప్రాంతాల నుంచి పాఠాలు నేర్చుకోవడానికి, అనుమానాలు నివృత్తి చేసుకోవడానికి అవకాశం కలుగుతుందన్నారు. అలాగే వచ్చే విద్యా సంవత్సరం నుంచి 8,9,10 తరగతులకు వృత్తి విద్యా కోర్సులను కూడా ప్రవేశ పెట్టాలని యోచిస్తున్నట్లు చెప్పారు. తాళ్లపాలెంతోపాటు రెండు గురుకులాల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్లున్నాయని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి మరో మూడు గురుకులాల్లో ఏర్పాటు చేయడానికి భవనాలు సమకూర్చి వీటిని ఏర్పాటు చేస్తామన్నారు. దీనివల్ల చదువుతోపాటు సాంకేతిక పరిజ్ఞానం పొందడానికి అవకాశం కలుగుతుందన్నారు. టెన్త్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించడానికి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ముగిసిన రోబోటిక్ శిక్షణ కశింకోట మండలంలోని ఏపీ బాలయోగి గురుకులంలో మూడు రోజులపాటు జిల్లాలోని విద్యార్థులకు నిర్వహించిన రోబోటిక్ శిక్షణ తరగతులు బుధవారం ముగిశాయి. తరగతుల్లో పాల్గొన్న విద్యార్థులకు చంద్రశేఖరరావు ప్రతిభా ధ్రువపత్రాలను అందజేశారు. -
ప్రకృతి సేద్యం – విత్తనోత్పత్తిపై రైతులకు నెల రోజుల ఉచిత శిక్షణ
ప్రకృతి వ్యవసాయం, విత్తనోత్పత్తిపై రైతులకు బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంతర్జాతీయ ఆశ్రమంలో నెల రోజులపాటు ఉచిత శిక్షణ ఇవ్వాలని శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ ట్రస్టు నిర్ణయించింది. 240 గంటల పాటు (నెలకు పైగా) శిక్షణ ఉంటుంది. వసతి, భోజనం ఉచితం. శిక్షణకు రానుపోను ప్రయాణ ఖర్చులు అభ్యర్థులే భరించాల్సి ఉంటుంది. శిక్షణ ఆంగ్లంలో ఉంటుంది. ఇతర వివరాలకు.. 080– 28432965 నంబరులో లేదా training.ssiast@gmail.com ద్వారా సంప్రదించవచ్చు. -
15న అడవినెక్కలంలో ప్రకృతి సేద్యంపై ఉచిత శిక్షణ
సేంద్రియ వ్యవసాయ పద్ధతులపై నేచురల్ ఫార్మర్స్ అసోసియేషన్ (నోఫా) ప్రతి నెలా మూడో శనివారం రైతులకు ఉచిత శిక్షణ ఇస్తోంది. సంస్థ కోశాధికారి సీహెచ్ రామకృష్ణప్రసాద్ ఈ నెల15న కృష్ణాజిల్లా అడవినెక్కలంలోని చుక్కపల్లి ఐటీఐ వ్యవసాయ క్షేత్రంలో రైతులకు శిక్షణ ఇస్తారు. వివరాలకు 98496 24311 నంబరులో సంప్రదించవచ్చు. 16న పండ్ల తోటలు, పాలీహౌస్లలో కూరగాయల ప్రకృతి సేద్యంపై శిక్షణ -
‘కౌశల్య వికాస్యోజన’ కింద వివిధ కోర్సుల్లో శిక్షణ
ఎస్కేయూ : ప్రధానమంత్రి కౌశల్య వికాస్ యోజన పథకం కింద వివిధ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఎస్కేయూ సమీపంలోని ఆది ఫౌండేషన్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఎం.ఆంజనేయులు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. కోర్సు అనంతరం ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. శిక్షణతోపాటు మధ్యాహ్న భోజన సదుపాయం కల్పించనున్నట్లు తెలిపారు. జూన్ 1 నుంచి శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయన్నారు. అర్హులైన నిరుద్యోగ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. పూర్తివివరాలకు ఫోన్ : 08554–255433, 78423 26156, 91604 25798లో సంప్రదించాలన్నారు. రంగం కోర్సుల వివరాలు అర్హత ఐటీ/ఐటీఈఎస్ డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ పది ఉత్తీర్ణత జూనియర్ సాప్ట్వేర్ డెవలపర్ బీఎస్సీ కంప్యూటర్స్, బీకాం కంప్యూటర్స్, బీటెక్, ఎంసీఏ ఎలక్ట్రానిక్స్ ఫీల్డ్ టెక్నీషీయన్ కంప్యూటింగ్ అండ్ ఇంటర్ ఫెరిఫరల్స్ ఫీల్డ్ టెక్నీషియన్ – నెట్వర్కింగ్ అండ్ స్టోరేజ్ డిప్లమో సీసీటీవీ ఇన్సలేషన్ టెక్నీషియన్ ఐటీఐ డీటీహెచ్ సెట్ఆఫ్ బాక్స్ ఇన్స్టలార్ అండ్ సర్వీస్ టెక్నీషియన్ పది ఉత్తీర్ణత రిటైల్ సేల్స్ అసోసియేట్ పది ఉత్తీర్ణత బ్యాంకింగ్ అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్స్– అకౌంట్స్ పేయబుల్ అండ్ రిసీవబుల్ బీకాం బిజినెస్ కరస్పాండెంట్ పది ఉత్తీర్ణత -
నిరుద్యోగ యువతకు ఉపాధి శిక్షణ
కర్నూలు (వైఎస్ఆర్ సర్కిల్): నిరుద్యోగ యువతీ, యువకులకు వివిధ రంగాలో్ల ఉపాధి కల్పన పై ఉచిత శిక్షణను ఇస్తున్నట్లు స్టీప్ కేరీర్ బిల్డర్స్ సంస్థ నిర్వాహకుడు కనకప్రసాద్ సోమవారం ప్రకటనలో తెలిపారు. దీన్దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌసల్యయోజన పథకం కింద ఈ శిక్షణనిస్తున్నట్లు ఆయన తెలిపారు. రిటైల్ రంగంలో ట్రైనీ అసోసియేట్స్గా, టెలికాంరంగంలో కాల్సెంటర్ రిలేషన్ షిప్ కోర్సుల పై . మూడు నెలల పాటు శిక్షణ, ఉచిత భోజన వసతి కలిస్తామన్నారు. కోర్సుకు సంబంధించిన దుస్తులు, మెటీరియల్ కోర్సు ఉచితంగా అందజేస్తామని తెలియజేశారు. 18–30 సంవత్సరాలలోపు వయస్సు ఉన్న వారు దరఖాస్తులు చేసుకోవాలని ఆయన సూచించారు. నగరంలోని నంద్యాల రోడ్డు సమీపంలో గురుశంకర్ కాంప్లెక్స్లో ఉన్న తమ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలన్నారు. వివరాలకు 9908974815 నంబర్కు డయల్ చేయాలని సూచించారు. -
ఎస్సీ ఎస్టీలకు డ్రైవింగ్పై ఉచిత శిక్షణ
అనంతపురం రూరల్: ఏపీ రాష్ట్రా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ యువతకు డ్రైవింగ్పై ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు అసిస్టెంట్ మేనేజర్ విన్సెంట్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. లైట్ మోటర్ వెహికల్కు 19సంవత్సరాలు నిండి 8వ తరగతి పాసై ఉండాలి. హెవి మోటర్ వెహికల్కు 10వ తరగతి పాసై ఉండి.. 20 సంవత్సరాలు నిండిన అభ్యర్థులు డ్రైవింగ్ శిక్షణకు అర్హులన్నారు. ఆసక్తి గల అభ్యర్థులుWWW.jobsmela.apssdc.in లో నమోదు చేసుకోవాలని సూచించారు. -
పోలీసు అభ్యర్థులకు ఉచిత శిక్షణ
కాపు కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు విశాఖపట్నం: ఏపీ రాష్ట్ర కాపు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యాన పోలీసు కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన కాపు నిరుద్యోగులకు శిక్షణ ఇవ్వనున్నారు. పేరున్న శిక్షణ సంస్థల్లో ఉచిత శిక్షణ ఇచ్చేందుకు విద్యోన్నతి పథకం కింద ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఎంపికైన అభ్యర్థులకు ఉచిత శిక్షణతోపాటు, ఇతర ఖర్చుల నిమిత్తం రూ.8 వేల ఆర్థిక సహాయం అందిస్తారు. ఇవీ అర్హతలు.. కానిస్టేబుల్, ఎస్సై పోస్టులకు నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగా అర్హతలు కలిగి ఉండాలి. ఆంధ్రప్రదేశ్లో నివాసమున్న కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాల అభ్యర్థులు మాత్రమే అర్హులు. తూర్పు కాపు, గాజుల కాపు కులాలకు చెందినవారు అనర్హులు. అభ్యర్థి కుటుంబ ఆదాయం రూ.6 లక్షల లోపు ఉండాలి. తెల్లరేషన్ కార్డు ఉన్నవారు అర్హులే. ప్రభుత్వం నుంచి ఏ ఇతర పథకంలోనూ లబ్ధిదారు కాదని నిర్ధారిస్తూ సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. దరఖాస్తులు ఇలా.. www.kapucorp.ap.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. మరింత సమాచారం కోసం 76619 96966, 73311 74448 సెల్ నంబర్లలో సంప్రదించవచ్చు. అప్లోడ్ చేయాల్సిన ధ్రువపత్రాలివీ.. సంబంధిత అధికారి ఇచ్చిన ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు దరఖాస్తుదారుని ఆధార్ కార్డు. వయస్సు ధ్రువీకరణ పత్రం (ఎస్ఎస్సీ సర్టిఫికెట్ లేదా పంచాయతీ / మున్సిపాలిటీ / కార్పొరేషన్ నుంచి పొందిన జనన ధ్రువీకరణ పత్రం. విద్యార్హతల ధ్రువీకరణ పత్రాలు అభ్యర్థి పేరిట ఉన్న ఏదైన జాతీయ బ్యాంకు పాస్బుక్ ఖాతా వివరాలు. పాస్పోర్టు సైజు ఫొటో ఆర్థిక సహాయం ఇలా.. ఎంపికైన అభ్యర్థి శిక్షణ సంస్థకు చెల్లించాల్సిన ఫీజు మొత్తం కార్పొరేషనే భరిస్తుంది. శిక్షణకు ఎంపికైన అభ్యర్థికి పుస్తకాలు, స్టేషనరీ, వసతి, భోజన సౌకర్యం నిమిత్తం రూ.8 వేలు ఇస్తారు. శిక్షణ పూర్తయిన తరువాత అభ్యర్థి బ్యాంకు ఖాతాలో ఈ మొత్తాన్ని జమ చేస్తారు. అయితే అభ్యర్థి 90 శాతం హాజరు తప్పనిసరిగా కలిగి ఉండాలి. దీనికోసం ఆయా శిక్షణ సంస్థల్లో బయోమెట్రిక్ హాజరు విధానం అమలు చేస్తారు. ఎంపిక ఇలా.. ముందుగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ప్రాధాన్యమిస్తారు. ఎస్సై పోస్టులకు 800 మందికి, కానిస్టేబుల్ పోస్టులకు 2,500 మందికి కాపు కార్పొరేషన్ ప్యానల్లోని శిక్షణ సంస్థల్లో ఉచిత శిక్షణ ఇస్తారు. కార్పొరేషన్ ప్యానల్లో ఉన్న శిక్షణ సంస్థల జాబితా నుంచి అభ్యర్థి తనకు నచ్చిన సంస్థను ప్రాధాన్య క్రమంలో ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. ఆన్లైన్లో సమర్పించిన ధ్రువీకరణ పత్రాలను కార్పొరేషన్ ముందుగా పరిశీ లిస్తుంది. -
కానిస్టేబుల్ అభ్యర్థులకు ఉచిత శిక్షణ
వరంగల్ : పోలీస్ కానిస్టేబుల్ మెయి¯Œ్స పరీక్షలకు హాజరయ్యే బీసీ అభ్యర్థులకు రెండు వారాల పాటు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు బీసీ స్టడీ సర్కిల్–శిక్షణ కేంద్రం డైరెక్టర్ జి.హృషికేశ్రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షణ పొందగోరు అభ్యర్థులు తమ దరఖాస్తులను హన్మకొండలోని బీసీ స్టడీ సర్కిల్లో ఈనెల 17 వరకు అందించాలని సూచించారు. దేహదారుఢ్య పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారే అర్హులని పేర్కొన్నారు. ప్రిలిమనరీ పరీక్షల్లో సాధించిన మార్కుల అధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తామన్నారు. అభ్యర్థులు గ్రామీణ ప్రాంతం వారు రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల వారు రూ.2 లక్షల వార్షిక ఆదాయం మించకూడదని తెలిపారు. వివరాలకు 0870–2571192 నంబర్లో సంప్రదించాలని సూచించారు. -
కానిస్టేబుల్ ఉద్యోగాల ఎంపికకు శిక్షణ
జేసీ–2 రాజ్కుమార్ నెల్లూరు(పొగతోట): పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల ఎంపికకు సంబంధించి ఎస్టీ అభ్యర్థులకు నెల రోజులు ఉచిత శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నామని జేసీ–2 రాజ్కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం తన చాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానిస్టేబుల్స్, జైలు వార్డెన్ల నియామకాలకు ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. అర్హులైన ఎస్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వాలని కలెక్టర్ ఆర్. ముత్యాలరాజు నిర్ణయించినట్లు తెలిపారు. 18 నుంచి 27 ఏళ్ల వయసు ఉండి 10వ తరగతి ఉత్తీర్ణులైన ఎస్టీ అభ్యర్థులు కానిస్టేబుల్ ఉద్యోగాలకు అర్హులన్నారు. 18 నుంచి 35 సంవత్సరాల వయసు ఉండి 10వ తరగతి ఉత్తీర్ణులైన ఎస్టీ అభ్యర్థులు జైల్ వార్డెన్ పోస్టులకు అర్హులన్నారు. అభ్యర్థుల ఎత్తు 167.6 సెంటిమీటర్లు, ఛాతీ గాలి పీల్చిన తరువాత 86.3 సెంటీమీటర్లు ఉండాలన్నారు. పై అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ నెల 14వ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వచ్చే నెల 10వ తేదీన 200 మార్కులకు రాతపరీక్ష రాయాల్సి ఉంటుందన్నారు. ఈ నెల 11 నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు నెల రోజుల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. శిక్షణ సమయంలో ఉచిత భోజన, వసతి సౌకర్యం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. అర్హత కలిగినవారు ఈ నెల 6, 7 తేదీల్లో స్థానిక ఏసీసూబ్బారెడ్డి స్టేడియంలో ఉదయం 8 గంటలకు ధ్రువపత్రాలతో హాజరుకావాలన్నారు. వివరాలకు 98499 13074, 98499 09074లో సంప్రదించాలని తెలిపారు. సెట్నెల్ సీఈఓ సుబ్రమణ్యం పాల్గొన్నారు. -
రేపు జాబ్మేళా
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లాలోని నిరుద్యోగ యువతకు ప్రైవేట్రంగంలో ఉద్యోగాల కల్పన కోసం ఈ నెల 31వ తేదీన కలెక్టరేట్లోని ఈజీఎంఎం కౌన్సెలింగ్ సెంటర్లో జాబ్మేళా నిర్వహించనున్నట్లు డీఆర్డీఏ పీడీ మ«ధుసుదన్నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. వినూత్న ఫర్టిలైజర్ కంపెనీలో సేల్స్ రిప్రజెంటేటీవ్ ఉద్యోగాల కోసం జాబ్మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇతర వివరాల కోసం సెల్ నెం : 9618766866 ను సంప్రదించాలని కోరారు. -
టైలరింగ్, బ్యూటీషన్ కోర్సుల్లో ఉచిత శిక్షణ
మహబూబ్నగర్ న్యూటౌన్ : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ, కేంద్ర గ్రామీణాభివద్ధి మంత్రిత్వ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లాలోని గ్రామీణ నిరుపేద మహిళలకు టైలరింగ్, బ్యూటీషన్ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ జి.లక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. 30 రోజులపాటు ఉచిత భోజనం, వసతి, వ్యక్తిత్వ వికాసం, వ్యాపార నిర్వహణలపై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. శిక్షణ అనంతరం ధ్రువపత్రాలు అందజేయనున్నట్లు వివరించారు. 18 నుంచి 35 సంవత్సరాల లోపు వయసు కలిగిన వారు ఆధార్, రేషన్ కార్డు, జిరాక్స్లతో పాటు 5 పాస్పోర్టు సైజు ఫొటోలతో సెప్టెంబర్ 1వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఇతర వివరాలకు 08542–270395, 9963369361 నెంబర్లను సంప్రదించాలని కోరారు. -
ఫ్యాషన్ డిజైనింగ్లో ఉచిత శిక్షణ
సంగారెడ్డి మున్సిపాలిటీ: గ్రామీణ స్వయం ఉపాధి కల్పనా కేంద్రంలో మహిళలకు నెలరోజుల పాటు ఫ్యాషన్ డిజైనింగ్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్ శ్రీనాథ్ ఓ ప్రకటనలో తెలిపారు. గ్రామీణ ప్రాంత యువతులు ఉచిత శిక్షణ పొందేందుకు అర్హులని, శిక్షణా సమయంలో భోజనం, వసతి సౌకర్యాలతో పాటు రవాణా చార్జీలు చెల్లిస్తారన్నారు. ఆసక్తి గల యువతులు ఈనెల 24లోగా తమ దరఖాస్తులను నేరుగా సంగారెడ్డిలోని పాత డీఆర్డీఏ కార్యాలయ ఆవరణలోని గ్రామీణ స్వయం ఉపాధి కల్పనా కేంద్రంలో తెల్లరేషన్కార్డు, , ఆధార్కార్డు జిరాక్స్ కాపీతో బుధవారం లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపికైన వారికి ఈనెల 24 నుంచి వచ్చే నెల 22 వరకు ఉచిత శిక్షణ ఇస్తామన్నారు. -
యోగాలో ఏకాగ్రత అవసరం
ఆరిలోవ: యోగా చేస్తున్నవారిలో తప్పనిసరిగా ఏకాగ్రత అవసరమని ఏయూ సైకాలజీ విభాగం అధిపతి ప్రొఫెసర్ ఎం.వి.ఆర్ రాజు తెలిపారు. ఆరిలోవ పారతం చినగదిలి నార్త్ షిరిడి సాయిబాబాల ఆలయంలో 14 రోజుల పాటు జరుగుతున్న ఉచిత యోగా శిక్షణ శిబిరంలో మంగళవారం ఆయన పాల్గొన్నారు. ఇక్కడ శిక్షణ పొందుతున్నవారిని ఉద్దేశించి మాట్లాడారు. యోగా శరీరానికి అవసరమన్నారు. దానివల్ల ఆరోగ్యం కుదుటపడుతుందన్నారు. ప్రతి ఒక్కరిలోను పోజిటివ్ ఆలోచన ఉండాలన్నారు. -
పట్టుదలతో చదివితే ఉద్యోగాలు
ఖిలావరంగల్ : నిరుద్యోగులు పట్టుదలతో చదివితే తప్పకుండా ఉద్యోగాలు సాధిస్తారని టీఎస్ఎస్పీ ఇన్చార్జి కమాండెంట్ శ్రీనివాస్కుమార్ సూచించారు. నగర శివారులోని మామునూరు టీఎస్ఎస్పీ నాలుగో బెటాలియన్ లో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ పొందిన అభ్యర్థులతో శనివారం సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా ఇన్చార్జి కమాండెంట్ శ్రీనివాస్కుమార్ మాట్లాడుతూ బెటాలియన్లో సుమారు 300 మం ది అభ్యర్థులకు ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం శిక్ష ణ ఇచ్చినట్లు చెప్పారు. ఇందులో 60 మంది బాలికలు, 90 మంది బాలురు దేహదారుఢ్య పరీక్షల్లో రాణించినట్లు తెలిపారు. రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించేందుకు అభ్యర్థులు తగిన రీతిలో సిద్ధం కావాలని సూచించారు. సమావేశంలో అసిస్టెంట్ కమాండెంట్ అంజయ్య, శిక్షణ ఇన్ స్పెక్టర్లు భాస్కర్, ఘని, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
కానిస్టేబుల్ పరీక్షలకు ఉచిత శిక్షణ
అనంతపురం న్యూటౌన్ : శారదా సపారె చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఈనెల 8 నుంచి పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు సంస్థ ప్రతినిధి రాజశేఖర్ ఓ ప్రకటనలో తెలిపారు. శిక్షణలో భాగంగా స్పోకెన్ ఇంగ్లిషు కూడా నేర్పిస్తామన్నారు. ప్రతిరోజూ సాయంత్రం 6 గంటల నుంచి 7.30 గంటల వరకు లిటిల్ ఫ్లవర్ స్కూల్లో సాగే శిక్షణను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 9440221254 నంబర్లో సంప్రదించాలన్నారు. టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో.. అదేవిధంగా జిల్లా ప్రైవేటు టీచర్ల సంఘం ఆధ్వర్యంలో కానిస్టేబుల్ పరీక్షల ఉచిత శిక్షణ గడువును ఈనెల 8 వరకు పొడిగిస్తున్నట్టు సంస్థ అధ్యక్షులు కాశన్న ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల 9490008729 నంబర్లో సంప్రదించాలన్నారు. -
నేటి నుంచి బీసీ స్టడీ సర్కిల్లో శిక్షణ
సిద్దిపేట జోన్: ఎస్ఐ అర్హత సాధించిన యువతకు మెయిన్స్ కోసం శుక్రవారం నుంచి సిద్దిపేటలోని బీసీ స్టడీ సర్కిల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు ఆ స్టడీ సర్కిల్ కోఆర్డినేటర్ కె.రాములు తెలిపారు. ఎస్ఐ ప్రిలిమినరీ పాసై, ఈవెంట్స్లో అర్హత సాధించిన బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 45 రోజుల పాటు ఉచితంగా శిక్షణ అందిస్తామన్నారు. సంబంధిత విద్యార్థులు ఒర్జినల్ సర్టిఫికెట్లతో శుక్రవారం ఉదయం 9 గంటలకు మున్సిపల్ టౌన్ హాల్నందు హాజరుకావాలని సూచించారు. అనుభవం కలిగిన నిపుణులచే శిక్షణ ఇప్పించి ఎస్ఐలుగా ఎంపికయ్యేందుకు స్టడీ సర్కిల్ దోహదపడుతుందన్నారు. ఉచిత శిక్షణతోపాటు భోజన వసతి, ఉచిత స్టడీ మెటీరియల్ను కూడా అందిస్తామన్నారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 80080 09970 నంబరులో సంప్రదించాలని సూచించారు. -
సిపెట్ ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోండి
అనంతపురం అర్బన్ : సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (సీఐపీఈటీ) పర్యవేక్షణలో శిక్షణ అనంతరం ఉపాధి కల్పించే పథకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ వి.కిరణ్కుమార్ తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మహిళలు, సమాజంలో ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన అభ్యర్థులు ఈ పథకం కింద అర్హులన్నారు. మెషిన్ ఆపరేటరు విభాగంలో లేత్, మిల్లింగ్ శిక్షణ ఇస్తారన్నారు. పదో తరగతి ఆపై విద్యార్హత కలిగిన వారు అర్హులన్నారు. మెషిన్ ఆపరేటర్ ఇంజెక్షన్ మోల్డింగ్, మెషిన్ ఆపరేటర్ ప్లాస్టిక్స్ ఎక్రిట్రూజేషన్లో శిక్షణ కోసం ఎనిమిదో తరగతి ఆపై విద్యార్హతలు లేదా ఐటీఐ పూర్తి చేసిన వారు అర్హులన్నారు. ఇందుకు 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య వయసు వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు సడలింపు ఉంటుందన్నారు. ఆరు నెలల పాటు శి„ý ణ ఉంటుందని, ఎంపికైన అభ్యర్థులకు ఉచిత భోజన, హాస్టల్ వసతి కల్పిస్తారని తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 8వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. నగర పరిధిలోని గుల్జార్పేటలో ఉన్న మధురిమ బిల్డింగ్ మేడపైన 4వ గదిలో దరఖాస్తులు పొందవచ్చని, లేదా ఈ–మెయిల్ ఛిజీp్ఛ్టజిyఛీట్టఛిఃజఝ్చజీl.ఛిౌఝ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. వివరాలకు సీనియర్ అధికారి గోవిందు 9959333415, 9959333427ను సంప్రదించాలన్నారు. -
ఎస్సీఎస్టీ విద్యార్థులకు ఎంసెట్-3 పరీక్షకు ఉచిత శిక్షణ
ఎంసెట్-3 పరీక్ష కోసం ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు సాంఘీక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యంగా ఒక నెల రోజులపాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు శేరిలింగంపల్లి నియోజకవర్గం గౌలిదొడ్డిలోని సాంఘీక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల భవనంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రధానంగా ఏసీ క్లాసు రూమ్స్లో నిష్టాతులైన అధ్యాపకులతో ప్రత్యేక శిక్షణ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఎంసెట్-3 పరీక్ష వ్రాసే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు. ఇతర వివరాలకు ఫోన్ నెంబర్ 99123 48111, 96661 22333లలో సంప్రదించవచ్చు. -
ఎస్ఐ మెయిన్స అభ్యర్థులకు ఉచిత శిక్షణ
సంగారెడ్డి జోన్: తెలంగాణ రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సంగారెడ్డిలోని బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ఎస్ఐ మెయిన్స పరీక్షకు అర్హులైన బీసీ, ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందించనున్నట్లు స్కడీ సర్కిల్ డైరక్టర్ ఆశన్న ఓ ప్రకటనలో తెలిపారు. వివరాల కోసం ఫోన్ నం.08455–277015లో సంప్రదించాలన్నారు. -
పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ప్రారంభం
సత్యనారాయణపురం : స్థానిక చిత్తరంజన్ శాఖ గ్రంథాలయంలో వివిధ పోటీ పరీక్షలకు హాజయ్యే అభ్యర్థులకు ఉచిత శిక్షణ తరగతులు సోమవారం ప్రారంభించారు. ఈ తరగతులను ప్రారంభించిన గ్రంథాలయాధికారిణి కె.పద్మావతి మాట్లాడుతూ కృష్ణా జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఆదేశాల మేరకు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. తొలి రోజు అధ్యాపకులు చంద్రశేఖర్రావు, మాధవి ఇంగ్లిష్, అర్థశాస్త్రం పాఠాలు బోధించారు. సుమారు 40 మంది విద్యార్థులు హాజరయ్యారు. -
నేటినుంచి ఈడబ్ల్యూఆర్సీలో ఉచిత శిక్షణ
- 20వ తేదీ వరకుదరఖాస్తుకు అవకాశం సంగారెడ్డి జోన్: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ మార్కెటింగ్ మిషన్ ఆధ్వర్యంలో శనివారం నుంచి ఇంగ్లిష్ వర్క్ రీడ్నెస్ అండ్ కంప్యూటర్స్ (ఈడబ్ల్యూఆర్సీ) కోర్సులో మూడు నెలల ఉచిత శిక్షణ ప్రారంభిస్తున్న డీఆర్డీఏ పీడీ సత్యనారాయణ రెడ్డి తెలిపారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ పాస్ లేదా ఫె యిల్ అయిన 19 నుంచి 26 ఏళ్ల వయసు కలిగిన గ్రామీణ యువకులు శిక్షణకు అర్హులన్నారు. మూడు నెలల ఈ శిక్షణ కాలంలో ఉచిత భో జనం, వసతి సౌకర్యాలతోపాటు బేసిక్ కంప్యూటర్స్, స్పోకెన్ ఇంగ్లిష్, లైఫ్ స్కిల్స్, ఇంటర్వ్యూ స్కిల్స్తోపాటు శిక్షణ అనంతరం ఉద్యోగావకాశాలను కల్పించడం జరుగుతుందన్నారు. ఆసక్తి గలవారు శనివారం నుంచి ఈనెల 20 తేదీ వరకు గజ్వేల్లోని ఎస్టీ హాస్టల్ పక్కన గల ఈడబ్ల్యూఆర్సీ శిక్షణ కేంద్రంలో ప్రవేశాలను పొందవచ్చన్నారు. వివరాల కోసం 94925 61363, 96528 82296 నంబర్లను సంప్రదించాలని సూచించారు. -
టూ వీలర్, మొబైల్ సర్వీసింగ్లో ఉచిత శిక్షణ
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): భారతీయ స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని నిరుద్యోగ యువతకు టూవీలర్, మొబైల్ సర్వీసింగ్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఎస్బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డెరైక్టర్ లక్ష్మి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షణ సమయంలో ఉచిత వసతి, భోజనం, వ్యక్తిగత వికాస తరగతులు, స్పోకెన్ ఇంగ్లిష్లో శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు స్థానిక వెంకటేశ్వరకాలనీలోని తమ సంస్థ కార్యాలయాన్ని, 08542-270395, 9985529381 నంబర్లను సంప్రదించాలని కోరారు. -
ఉపాధికూలీలకు ‘ఉచిత’ శిక్షణ
పాలకోడేరు రూరల్ : ఉపాధిహామీ పథకం కూలీల కుటుంబాల కోసం పూర్తి కాల జీవన ఉపాధి పథకం అందుబాటులోకి వచ్చింది. దీనిని ఆంధ్రాభ్యాంకు స్వయం ఉపాధి శిక్షణ సంస్థ రూపొందించింది. వివిధ కోర్సుల్లో, వృత్తుల్లో ఉపాధికూలీలకు, లేదా వారి కుటుంబ సభ్యులకు శిక్షణ ఇచ్చేందుకు శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమ వివరాలను ఉపాధిహామీ పథకం భీమవరం క్లస్టర్ అసిస్టెంట్ ప్రాజెక్టు అధికారి దుండి రాంబాబు తెలిపారు. ఉపాధి హామీ కూలీలకు ప్రభుత్వం ప్రస్తుతం వందరోజుల పని కల్పిస్తోంది. వారికి 365 రోజులూ ఉపాధి లభించేలా చూడాలనే సదాశయంతో ఆంధ్రాబ్యాంకు స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ముందుకొచ్చింది. అర్హులను ఎంపిక చేసి శిక్షణకు పంపిచే బాధ్యతను అధికారులకు అప్పగించింది. అర్హతలు * ఉపాధి హామీ పనుల్లో వంద రోజులు పనిచేసిన కుటంబానికి చెందిన వారు గానీ లేదా వంద రోజులు పనిచేసిన వారు గానీ అయి ఉండాలి. * వయస్సు 18 నుంచి 35 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ మహిళలు అయితే 18 నుంచి 45 ఏళ్ల వయస్సు ఉండాలి. * కంప్యూటర్, డ్రైవింగ్ కోర్సులకు అయితే పదో తరగతి పాస్ అయి ఉండాలి. * ఉపాధిహామీ పథకం జాబ్ కార్డు కలిగి ఉండాలి. * ఆయా కోర్సులు చేయగలిగితే వికలాంగులు కూడా అర్హులు. * 2014-2015 ఏడాదిలో వంద రోజులు పని చేసిన వారు అయి ఉండాలి(ప్రస్తుతానికి) శిక్షణ కాలం శిక్షణార్థులు ఎంచుకున్న కోర్సును బట్టి ఆరు రోజుల నుంచి 45 రోజులపాటు శిక్షణ ఉంటుంది. శిక్షణ అంతా ఏలూరులోని అశోక్ నగర్ ఆంధ్రాబ్యాంకు స్వయం ఉపాధి శిక్షణ సంస్థలోనే జరుగుతుంది. ఏడాదికి 1700 మందికే సంస్థ శిక్షణ ఇస్తుంది. శిక్షణా కాలంలో ఉచిత భోజనం, వసతి ఏర్పాటు చేస్తారు. ప్రయోజనం శిక్షణ పూర్తి చేసుకున్న వారికి కోర్సు పూర్తి చేసినట్లు సర్టిఫికెట్ను ఆంధ్రాబ్యాంకు శిక్షణ సంస్థ జారీచేస్తోంది. అలాగే శిక్షణార్థులు స్వయం ఉపాధి పొందడం కోసం బ్యాంకు రుణాలు మంజూరు చేయించేందుకు కృషి చేస్తోంది. శిక్షణ ఇచ్చే కోర్సులు ఏలూరులోని అశోక్నగర్లో ఆంధ్రాబ్యాంకు స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఉంది. దీనిలో ఉపాధి కూలీలు, వారి కుటుంబ సభ్యులకు శిక్షణ ఇచ్చే కోర్సులివే.. ⇒ కంప్యూటర్ (డీటీపీ,ఎంఎస్ ఆఫీస్) ⇒ కంప్యూటర్ హార్డ్వేర్ ⇒ డ్రైవింగ్ ⇒ సెల్ఫోన్ రిపేరింగ్ ⇒ ఇటుకల తయారీ ⇒ సిమెంట్ వరల తయారీ ⇒ బ్యాగుల తయారీ ⇒ టైలరింగ్ ⇒ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ⇒ స్క్రీన్ ప్రింటింగ్ ⇒ కుట్లు, అల్లికలు ⇒ గోర్రెల పెంపకం దరఖాస్తు విధానం స్వయం ఉపాధి శిక్షణలో చేరడం కోసం అభ్యర్థులు నేరుగా ఏలూరు అశోక్ నగర్లోని ఆంధ్రాబ్యాంకు స్వయం ఉపాధి శిక్ష కేంద్రానికి వెళ్లి అక్కడ దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా ఉపాధిహామీ పథకం మండల టీఏ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి బ్యాచ్ల వారీగా శిక్షణ ఉంటుంది. -
ఐఏఎస్కు ఉచిత శిక్షణ
సాక్షి, హైదరాబాద్: కేంద్ర హజ్ కమిటీ ఆధ్వర్యంలో ఐఏఎస్ పరీక్ష ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రాష్ట్ర హజ్ కమిటీ స్పెషల్ ఆఫీసర్ ఎస్ఏ షుకూర్ తెలిపారు. ముస్లిం వర్గానికి చెందిన డిగ్రీ, పీజీ విద్యార్థులు ఆన్లైన్ ద్వారా మే 10 లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. హైదరాబాద్తో పాటు దేశంలోని మరో ఆరు కేంద్రాల్లో మే 28న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు జూలై 16, 17 తేదీల్లో ముంబైలోని కేంద్ర హజ్ కమిటీ మౌఖిక పరీక్ష నిర్వహిస్తుందన్నారు. ఎంపికైన అభ్యర్థులకు సెప్టెంబర్ 5 నుంచి శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయన్నారు. -
ఏడాదిలోగా లక్ష ఉద్యోగాలు: హరీశ్
సిద్దిపేట జోన్: ఈ ఏడాదిలోగా లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్రావు వెల్లడించారు. ఆదివారం మెదక్ జిల్లా సిద్దిపేటలో గ్రూప్-2 ఉచిత శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ 6 నెలల నుంచి ఏడాదిలోగా లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. ప్రభుత్వం నిర్వహించే నియామక ప్రక్రియల్లో యువత ధృఢ సంకల్పం, ఆత్మవిశ్వాసంతో పాల్గొని ఉద్యోగాలను సాధిం చాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీజేఆర్ శిక్షణ సంస్థ డైరెక్టర్ జగదీశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబును ఇరకాటంలో పెట్టిన కోడలు
* తెలంగాణ గ్రూప్స్ అభ్యర్థులకు ఉచిత శిక్షణ అంటూ బ్రహ్మణి ప్రకటన * దీంతో ఏపీలో ఉద్యోగ ప్రకటనలు లేవని చెప్పినట్లయిందని బాబు మథనం హైదరాబాద్: తన కోడలు బ్రహ్మణి చేసిన ప్రకటనతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇరకాటంలో పడ్డారని తెలిసింది. ఎలా ప్రతిస్పందించాలో తెలియక ఇబ్బంది పడుతున్నారట కూడా. ఇంతలా చంద్రబాబును ఇబ్బందుల్లో పడేసే విధంగా ఆయన కోడలు బ్రహ్మణి చేసిన ప్రకటన ఏంటంటే...? తెలంగాణలో గ్రూప్ 1, 2 వంటి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల్లో 60 మందికి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా శిక్షణ ఇస్తామని ఈ మధ్యనే విలేకరుల సమావేశంలో ప్రకటించారు. శిక్షణ పొందాలనుకున్న వారు ట్రస్ట్కు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. బ్రహ్మణి ప్రకటనతో చంద్రబాబు సంకట పరిస్థితుల్లో పడ్డారు. ఎందుకంటే విభజన అనంతరం తాను ముఖ్యమంత్రిగా ఉన్న ఆంధ్రప్రదేశ్లోని వివిధ శాఖల్లో ప్రస్తుతం 1.42 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయాలని నిరుద్యోగుల నుంచి పెద్దఎత్తున డిమాండ్ వస్తున్నప్పటికీ ఆయనపట్టించుకోవడం లేదు. పైగా అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తామని, నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. అధికారం చేపట్టి ఏడాదిన్నర కావొస్తున్నా ఇప్పటివరకు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. మరోపక్క కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టారు. రాష్ట్రానికి కనీసం ప్రత్యేక హోదా దక్కినా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆశించిన నిరుద్యోగులకు నిరాశే ఎదురైంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా శిక్షణ ఇస్తామన్న బ్రహ్మణి ప్రకటనతో అటు తెలంగాణలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టినట్లు.. మరోవైపు ఏపీలో ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేకపోతున్నట్లు ప్రజలకు తామే చెప్పినట్లయిందని చంద్రబాబు మథనపడ్డారట. బ్రహ్మణి ప్రకటనతో ఏపీ ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేయడం లేదన్న విషయాన్ని ఎత్తిచూపినట్టయిందని టీడీపీ నేతలే చర్చించుకుంటున్నారు. -
టీఎస్పీఎస్సీ పరీక్షలకు ఉచిత శిక్షణ
దరఖాస్తులకు బీసీ స్టడీ సర్కిళ్ల ఆహ్వానం 20వ తేదీ నుంచి 30 వరకు రిజిస్ట్రేషన్లు ఆన్లైన్ పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ నిర్వహిస్తున్న గ్రూప్-1 ప్రిలిమ్స్, గ్రూప్-2 (అబ్జెక్టివ్టైప్), గ్రూప్-3, గ్రూప్-4 పరీక్షలకు బీసీ స్టడీసర్కిళ్ల ద్వారా ఉచిత శిక్షణ ఇచ్చేందుకు అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల నుంచి బీసీ సంక్షేమ శాఖ దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ నెల 20 నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్లను ప్రారంభించి, 30 వరకు స్వీకరించనున్నట్లు ఆ శాఖ డైరెక్టర్ కె.ఆలోక్కుమార్ తెలిపారు. వచ్చేనెల 4న ఆన్లైన్స్క్రీనింగ్ టెస్ట్. 6న ఫలితాలను వెల్లడించాక, 13వ తేదీ నుంచి రాష్ర్టంలోని పది స్టడీ సర్కిళ్ల ద్వారా శిక్షణా తరగతులను మొదలుపెడతామని తెలిపారు. ఈ పరీక్షలకు 90 రోజుల పాటు లేదా పరీక్ష తేదీ వరకు ఏది తక్కువైతే అప్పటివరకు తరగతులు ఉంటాయన్నారు. బీసీలకు 66 శాతం, ఎస్సీలకు 20 శాతం, ఎస్టీలకు 14 శాతం సీట్లను కేటాయించనున్నారు. వికలాంగులకు 3 శాతం, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తారు. ఇదివరకే ఎస్సీ, ఎస్టీ, బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా ఏదైనా శిక్షణ పొందిన అభ్యర్థులు ప్రస్తుత శిక్షణ పొందేందుకు అనర్హులని పేర్కొన్నారు. పూర్తి వివరాలను http://tsbcstudycircles.cgg.gov.in వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. అర్హతలివీ... అభ్యర్థుల కుటుంబ ఆదాయం గరిష్టంగా ఏడాదికి రూ.లక్షకు మించరాదు. డిగ్రీ పూర్తి చేసిన వారే దర ఖాస్తు చేసుకోవాలి. టీఎస్పీఎస్సీ నిర్దేశించిన అర్హతలను కలిగి ఉండాలి. రెగ్యులర్ స్టూడెంట్గా ఉన్న వారు, ఎక్కడైనా ఏదైనా పోస్టులో పనిచేస్తున్న వారు అనర్హులు. ఎంపికైన అభ్యర్థులు తమ ఒరిజనల్ టీసీని తప్పనిసరిగా డిపాజిట్ చేయాలి. రాష్ట్రంలోని ఏ కేంద్రం నుంచైనా ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ రాయొచ్చు. అయితే అభ్యర్థికి సొంత జిల్లాలోనే శిక్షణ ఇస్తారు. ఎంపికైన అభ ్యర్థులకు గ్రూప్-1, గ్రూప్-2లకు కలిపి శిక్షణ నిస్తారు -
టెన్త్ ఫెయిలైన విద్యార్థులకు ఉచిత శిక్షణ
రంగారెడ్డి(శంషాబాద్): పదవ తరగతి ఫెయిలైన విద్యార్థులకు మండల కేంద్రంలోని శ్రీ విజ్ఞాన్ కళాశాల ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ఓ ప్రకటనలో వెల్లడించారు. జూన్ 3 తేదీ నుంచి గణితం, భౌతికశాస్త్రం సబ్జెక్టులకు సంబంధించి రాబోయే సప్లిమెంటరీ పరీక్షలకు శిక్షణ ఇవ్వనున్నట్లు కరస్పాండెంట్ సతీష్ వివరించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఆసక్తిగల విద్యార్థులు ఫోన్: 9989021453 నంబర్లో సంప్రదించాలన్నారు. -
హోటల్ మేనేజ్మెంట్లో ఉచిత శిక్షణ
హయత్నగర్: నిథం-ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కిల్స్ ఆధ్వర్యంలో హోటల్ మేనేజ్మెంట్లో ఉచిత శిక్షణను ఇస్తున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. 10వ తరగతి పాసై, 18-30 సంవత్సరాల వయసుగల వారు దరఖాస్తులు చేసుకోవాలని వారు తెలిపారు. వివరాలకు 9959173183, 9989313278 నెంబర్లకు ఫోన్ చేయవచ్చు. -
ఉద్యోగానికి పరుగు
పాడేరు రూరల్: కేంద్ర పోలీసు బలగాల ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న యువతకు ఐటీడీఏ, పోలీసుశాఖ సంయుక్తంగా ఉచిత శిక్షణ ఇస్తున్నాయి. శిక్షణ ఎంపికకు మండలంలోని లగిసపల్లి కస్తూర్బాగాంధీ పా ఠశాల సమీపంలోని మైదానంలో సోమవారం పరుగు పోటీ నిర్వహించారు. తొలి రోజు పాడేరు, హుకుంపేట మండలాలకు చెందిన 500 మంది హాజరయ్యారు. తొలుత మహిళలకు 800 మీటర్లు, పురుషులకు 1600 మీటర్ల పరుగుపోటీ నిర్వహించారు. దీనిని ఏఎస్పీ బాబూజీ ప్రారంభించారు. ఈ ఉద్యోగాల కోసం ఏజేన్సీ 11 మండలాల నుంచి 1500 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 28వ తేదీ వరకు దరఖాస్తుకు గడువు ఉంది. అభ్యర్థులు నేరుగా పాడేరు ఏఎస్పీ కార్యాలయంలో ఉచితంగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నారు. యువత సంఘ విద్రోహక శక్తులకు దూరంగా ఉండాలన్నారు. పరుగు పోటీలు మూడు రోజుల పాటు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ కిశోర్, డీఎస్పీ జగన్మోహన్, పాడేరు, జి. మాడుగుల సీఐలు నల్లి సాయి, శ్రీనివాసరావు, ఎస్ఐ భరత్కుమార్ పాల్గొన్నారు. -
జ్యోత్స్న ఫణిజ పాడితే సంగీతం పరవళ్లు
మిణుగురులు సమాజానికి దివిటీలు జ్యోత్స్న ఫణిజ పాడితే సంగీతం పరవళ్లు తొక్కుతుంది. కలం కదిపితే అక్షరాలు తరంగాలై మనసును తట్టిలేపుతాయి. అంతేనా, కంప్యూటర్ ప్రోగ్రామింగ్లనూ వేగంగా చేస్తారు జ్యోత్స్న. పేద విద్యార్థులకు ఆంగ్ల భాషలో, కంప్యూటర్ అప్లికేషన్లలో ఉచిత శిక్షణ ఇస్తూ, ఆంగ్లసాహిత్యంలో నేడో రేపో డాక్టరేట్ పట్టా అందుకోవడానికి సిద్ధంగా ఉన్నారామె.ఇవన్నీ ప్రతిభ గలవారందరూ అవలీలగా చేసేవేగా... జ్యోత్స్న ప్రత్యేకత ఏమిటి.. అంటే ఆమెకు చూపు లేదు! అలా అని ఆమె ఏనాడూ దిగులు చెందలేదు. తన జీవితాన్ని చక్కదిద్దుకుంటూ పదిమందికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. ఆమె విజయగాథే ఈ వారం ‘మిణుగురులు’ - నిర్మలారెడ్డి కృష్ణా జిల్లా కైకలూరులో పాతికేళ్ల క్రితం... అభిమన్యకుమార్, సత్యవతిలకు అబ్బాయి తర్వాత రెండోసంతానంగా జన్మించింది జోత్స్న. మూడు నెలల వరకు వారు ఆ ఆనందంలోనే ఉన్నారు. తర్వాత ఓ రోజు ఆమె చూపులో ఏదో తేడాను గమనించారు. వైద్యులకు చూపిస్తే పుట్టుకతోనే అంధురాలు అని తేల్చారు! ‘‘అప్పుడు మా అమ్మ చాలా ఏడ్చిందట. నాన్నగారు చాలా బాధపడ్డారట. కానీ, అంత బాధలోనూ వారో నిర్ణయం తీసుకున్నారు. నా భవిష్యత్తును చక్కగా మలచాలని. అన్నయ్యతో పాటు నన్నూ స్కూల్లో చేర్పించారు. ఇంటర్మీడియెట్కి వచ్చాక చూపులేనివారికి సీట్ ఇవ్వలేమని కాలేజీ యాజమాన్యం చెప్పింది. నేనే కాలేజీ ప్రిన్సిపల్తో ‘మిగతా అందరికన్నా మంచి మార్కులు సాధించి చూపిస్తాను’ అని వాదించి, ఒప్పించాను. ఇంటర్మీడియెట్ వరకు ఉన్న ఊర్లోనే చదువుకున్న నేను డిగ్రీకి హైదరాబాద్కు వచ్చాను’’ అని చెప్పారు జ్యోత్స్న. అన్నింటా మేటి..! హైదరాబాద్లో ఓ అంధుల పాఠశాలలో చేరారు జ్యోత్స్న. ఇంటర్మీడియట్ వరకు తెలుగు మాధ్యమంగా చదివినప్పటికీ డిగ్రీలో ఇంగ్లిష్ లిటరేచర్ని ఎంచుకున్నారు. యూనివర్శిటీ స్థాయిలో మొదటిస్థానంలో నిలిచి బంగారు పతకాన్ని గెలుచుకున్నారు. ఆ తర్వాత మెరిట్ స్కాలర్షిప్లు వరించి ఆమె తండ్రి కష్టాన్ని సగానికి తగ్గించాయి. కాలేజీ స్థాయిలో ఫెయిర్ అండ్ లవ్లీ వారి మెరిట్స్కాలర్షిప్తో జ్యోత్స్నకు జాతీయస్థాయి గుర్తింపు లభించింది. మూడు లక్షల మంది విద్యార్థినులతో పోటీపడి ఆ విజయాన్ని అందుకోగలిగారు. మరోవైపు ఎమ్.ఎ చేసి యు.సి.జి నెట్ క్వాలిఫై అయ్యారు. కువైట్, కెనడియన్ దేశాలలో మహిళల అభ్యున్నతికోసం ప్రసంగాలు ఇచ్చే అవకాశాలనూ వినియోగించుకున్నారు.. ఎక్కడకు వెళ్లినా ఒంటరిగానే వెళ్లడం అలవాటు చేసుకున్నారు. ఇందుకు అమ్మానాన్నలే జ్యోత్స్నను ప్రోత్సహించారు. ప్రస్తుతం ఆమె ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్శిటీలో పీహెచ్డీ చేస్తున్నారు. కంప్యూటర్ పరిజ్ఞానం ముంబయ్లో అడ్వాన్స్డ్ కంప్యూటర్ కోర్స్ చేశారు జ్యోత్స్న. కంప్యూటర్ అప్లికేషన్స్లో టీ.సి.ఎస్ సంస్థ పెట్టిన పరీక్షలో మెరిట్ సాధించడంతో ఆ అవకాశం లభించింది. అంధులైన యువతీ యువకులకు మార్గదర్శకం చేసే కేంద్రాన్ని నెలకొల్పాలన్నది తన ఆశయం అని తెలిపారు జ్యోత్స్న. ఆధారపడటం తను ఇష్టపడదు జ్యోత్స్న నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. మాకు దూరపు బంధుత్వం కూడా ఉంది. తన వ్యక్తిత్వం, ఎవరిమీదా ఆధారపడని తత్త్వం నన్ను ఎప్పుడూ అబ్బురపరిచేవి. పట్టుదల, ఇతరులకు సాయపడాలనే ఆలోచన కలిగిన ఆమెకు వెన్నుదన్నుగా నిలవాలనుకుని, తన చేయందుకున్నాను. నేను ఎం.బి.ఎ చేస్తున్నాను. నా సబ్జెక్ట్ల్లో వచ్చే సందేహాలనే కాదు జీవితంలో వచ్చే సవాళ్లనూ ఎలా ఎదుర్కోవాలో చెబుతుంది. - రాధాకృష్ణ (జ్యోత్స్న భర్త) -
బీసీ స్టడీ సర్కిల్లో ప్రిలిమ్స్ శిక్షణ
హైదరాబాద్: సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష-2015 ఉచిత శిక్షణకు అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు బీసీ స్టడీసర్కిల్ సంచాలకులు మల్లిఖార్జున్ తెలిపారు. HTPP://TSBCSTUDYCIRCLES.CGG.GOV.IN అనే వెబ్సైట్లో నోటిఫికేషన్ ఉందని, ఆన్లైన్ ద్వారా నవంబర్ 5లోగా రిజిస్టర్ చేసుకోవాలని కోరారు. నవంబర్ 16న జరిగే ప్రవేశపరీక్ష ఆధారంగా ఎంపిక జరుగుతుందన్నారు. ఎంపికైనవారికి హైదరాబాద్, వరంగల్, కరీంనగ ర్లోగల బీసీ స్టడీసర్కిల్లో ఉచిత శిక్షణ ఇస్తామన్నారు. వివరాలకు 040-24611408, 18004250039 నంబర్లలో సంప్రదించవచ్చు. -
ఉచిత శిక్షణ
సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖలుసివిల్ సర్వీసెస్ పరీక్షలకు ఉచిత శిక్షణ అందించడానికి ఆయా రాష్ట్రాల్లో అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతున్నాయి. అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. కుటుంబ వార్షికాదాయం లక్ష రూపాయలకు మించకూడదు. ఏదైనా ఉద్యోగం లేదా కోర్సు చేస్తున్న అభ్యర్థులు అర్హులు కాదు. ఎంపిక: స్క్రీనింగ్ టెస్టు ద్వారా. ఆన్లైన్ రిజిస్ట్రేషన్కు చివరితేది: నవంబరు 5 స్క్రీనింగ్ టెస్టు తేది: నవంబరు 16 వెబ్సైట్లు: తెలంగాణ అభ్యర్థులకు: http://tsbcstudycircles.cgg.gov.in ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు: http://apbcwelfare.cgg.gov.in -
వీఆర్వో, వీఆర్ఏ అభ్యర్థులకు ఉచిత శిక్షణ
ఏలూరు (ఫైర్స్టేషన్ సెంటర్), న్యూస్లైన్ : వీఆర్వో, వీఆర్ఏ పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు బీసీ స్టడీసర్కిల్ సెంటర్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు ఆ సర్కిల్ డెరైక్టర్ ఆర్.మల్లికార్జునరావు ఓ ప్రకటనలో తెలిపారు. కుటుంబ వార్షిక ఆదాయం రూ. లక్ష లోపు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు శిక్షణకు అర్హులని పేర్కొన్నారు. శిక్షణతోపాటు స్టడీ మెటీరియల్, స్టయిపెండ్ అందిస్తామని తెలిపారు. వివరాలకు ఏలూరు సెయింట్ ఆన్స్ కళాశాల సమీపంలోని ఆంధ్రాబ్యాంక్ ఎదుట ఉన్న బీసీ స్టడీ సెంటర్లో గాని, 08812 232477 నంబర్లోగాని సంప్రదించాలని మల్లికార్జునరావు సూచించారు. -
నిరుద్యోగులకు ఉచిత శిక్షణ
కడప అర్బన్, న్యూస్లైన్ ః సిండికేట్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ (సిండ్ ఆర్సెటి) ఆధ్వర్యంలో ఎంబ్రాయడరీ- ప్యాబ్రిక్పెయింటింగ్, ఎలక్ట్రికల్ మోటార్ రివైండింగ్ -పంపుసెట్ నిర్వహణ, సెల్ఫోన్ మరమ్మతులు, మహిళా దుస్తుల తయారీ అనే అంశాలపై శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు డైరక్టర్ రాంప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. 10వ తరగతి ఫెయిల్ లేదా పాస్అయిన వారు ఈ శిక్షణకు అర్హులన్నారు. 18 నుంచి 45 సంవత్సరాలలోపు ఉండాలన్నారు. విద్యార్హతకు సంబంధించిన టీసీ, మార్కులిస్టు రెండు సెట్ల జిరాక్స్ కాపీలు, నాలుగు కలర్ పాస్పోర్టు సైజు ఫొటోలతో పాటు తెల్లరేషన్కార్డు జిరాక్స్తో డెరైక్టర్, సిండ్ ఆర్సెటీ, ఆర్టీసీ వర్క్ షాపు దగ్గర, గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ పక్కన కడప అనే చిరునామాకు ఈ నెల 21వ తేదీలోగా దరఖాస్తులు పంపాలన్నారు. శిక్షణా కాలంలో ఎంపికైన అభ్యర్థులకు ఉచిత భోజనంతో పాటు వసతి సౌకర్యం ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు 08562 200193, 9440905478 అనే ఫోన్ నంబర్లలో సంప్రదించాలన్నారు. -
దరఖాస్తుల ఆహ్వానం
హైదరాబాద్, న్యూస్లైన్: నిరుద్యోగ యువతకు మెడికల్, రిటైల్, ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్, ఫ్రంట్ ఆఫీసు ఎగ్జిక్యూటీవ్స్ అంశాల్లో 30-90 రోజులపాటు ఉచితంగా శిక్షణ ఇస్తున్నట్లు నెస్ట్ స్కిల్స్ ప్రొఫైలింగ్ సంస్థ పేర్కొంది. ఆసక్తిగలవారు ఈనెల 20లోగా దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు మెహిదీపట్నం పిల్లర్ నెం.15 సమీపంలోని సంస్థ కార్యాలయంలో గానీ, 7799210123, 040-66816120లను సంప్రదించొచ్చు. -
సివిల్ సర్వీసెస్ పరీక్షలకు ఉచిత శిక్షణ
కడప కార్పొరేషన్, న్యూస్లైన్ : యూపీఎస్సీ, సివిల్ సర్వీసెస్, ఏపీపీఎస్సీ గ్రూప్-1,2, బ్యాంక్ పీఓ మొదలైన పరీక్షలకు బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు జిల్లా వెనుకబడిన అధ్యయన కేంద్రం సంచాలకులు వై.వెంకటయ్య ఒక ప్రకటనలో తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు తమ దరఖాస్తులను బీసీ వెల్ఫేర్ వెబ్సైట్లో ఈనెల 8వ తేదిలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 10వ తేది ఆయా జిల్లాల్లోని బీసీ స్టడీ సర్కిల్లలో స్క్రీనింగ్పరీక్ష నిర్వహించి అభ్యర్థులు పొందిన ర్యాంకు, ఎంచుకున్న కోర్సు ఆధారంగా ఎంపిక చేస్తామన్నారు. ఎంపికైన అభ్యర్థులకు 18వ తేది హైదరాబాద్, విశాఖపట్నం, అనంతపురం కేంద్రాల్లో ప్రిలిమ్స్ కోచిం గ్ ప్రారంభమవుతుందన్నారు. వివరాలకు 08562-242526, 98499 04501 నంబర్లలో సంప్రదించాలన్నారు.