
● కదిలిన యంత్రాంగం
ట్రాన్స్ఫార్మర్ పరిసరాలు శుభ్రం
తాడేపల్లిగూడెం (టీఓసీ): పట్టణంలోని పాతూరు 12వ వార్డు కనకదుర్గమ్మ గుడి వద్ద ట్రాన్స్ఫార్మర్ పరిసరాలను మంగళవారం శుభ్రం చేశారు. ట్రాన్స్ఫార్మర్ చుట్టూ పిచ్చిమొక్కలు పెరిగిపోవడంతోపాటు చెత్తాచెదారంతో అపరిశుభ్రంగా ఉండడంతో మే 20వ తేదీన సాక్షి కథనాన్ని ప్రచురించింది. దీనిపై ప్రభుత్వ యంత్రాంగం స్పందించింది. మునిసిపల్ సిబ్బంది, విద్యుత్ సిబ్బంది ఆధ్వర్యంలో మంగళవారం జేసీబీ సహాయంతో పిచ్చిమొక్కలను తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు. కాగా ట్రాన్స్ఫార్మర్ వద్ద రక్షణ కల్పించేలా పెన్సింగ్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
నరసాపురంలో రోడ్డుపై పేరుకుపోయిన చెత్తను పూర్తిగా తొలగించి రోడ్డు శుభ్రం చేశారు. చెత్త రోడ్డుపై పోరుకుపోయి పూర్తి అశుభ్రంగా ఉన్న ఆ ప్రాంతంలో స్థానికులు పడుతున్న ఇబ్బందులను సాక్షి వెలుగులోకి తెచ్చింది. నరసాపురంలో కానరాని స్వచ్ఛత శీర్షికన మగళవారం కథనం ప్రచురించింది. దీంతో స్పందించిన మున్సిపల్ సిబ్బంది చెత్తను తొలగించి, ఆ ప్రాంతంలో ముగ్గు చల్లారు. సమస్య పరిష్కారం కావడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. – నరసాపురం

● కదిలిన యంత్రాంగం

● కదిలిన యంత్రాంగం