
గ్యాస్ లీకై పెళ్లింట్లో ప్రమాదం
పెనుగొండ: పెళ్లింట్లో అకస్మాత్తుగా జరిగిన ఓ ప్రమాదంలో ఏడుగురు గాయాలపాలయ్యారు. వివరాల ప్రకారం చెరుకువాడ కొండపల్లి వారి వీధిలో ఇవ్వల నాగేశ్వరరావు కుమారుడు శ్రీనివాసరావు వివాహం బుధవారం జరగనుండడంతో బందువులు, స్నేహితులు అందరూ వచ్చారు. మంగళవారం ఇంటిలో గ్యాస్ వెలిగించి వంట చేస్తుండగా ప్రమాదవ శాత్తు గ్యాస్ లీకై ఆకస్మాతుగా మంటలు వ్యాపించాయి. దీంతో అప్రమత్తమై మంటలు అదుపులోకి తీసుకు రావడానికి ప్రయత్నించడంతో పెండ్లి కుమారుడు శ్రీనివాసరావుతో పాటు, బంధువులు అయినపర్తి లక్ష్మీ, కవిటం నాగమణి, సూర్య హనుమంతరావు, సత్యవతి, నరసింహమూర్తి , మాచవరపు వీరేంద్ర గాయాలపాలయ్యారు. వీరికి కాళ్లు చేతులు, పొట్ట, వీపు మీద గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన పెనుగొండలోని ప్రభుత్వాసుపత్రికి తరలించడంతో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పెళ్లింట్లో పెనుప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకొన్నారు.
పెండ్లి కుమారుడు సహా ఏడుగురికి గాయాలు