
థింక్ ఇండియాతో నిట్ ఎంఓయూ
తాడేపల్లిగూడెం: బెంగళూరుకు చెందిన థింక్ ఇండియా సంస్థతో ఏపీ నిట్ శుక్రవారం ఎంఓయూ చేసుకుంది. ఇన్చార్జి డైరెక్టర్ ఎన్వీ రమణరావు మాట్లాడుతూ దేశంలోని ప్రముఖ విద్యాసంస్థలైన ఐఐఎస్సీ, ఐఐఎం, నింహన్స్, ఎన్ఎల్ఏఐయూ వంటి విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు 2006లో ఈ థింక్ ఇండియా సంస్థను స్థాపించారన్నారు. వారి సలహాలు, సూచనలు నిట్ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఇంటర్న్ షిప్ చేసుకొనే వెసులుబాటు కూడా ఉందన్నారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి సమగ్రమైన ప్రణాళికలు సిద్ధం చేయడం, పర్యావరణ, సాంస్కృతిక భద్రత అంశాల్లో చైతన్యం తీసుకురావడం, భారతీయ విలువల ప్రోత్సాహం, రాష్ట్ర ఐక్యత, సామాజిక సమతుల్యతను పెంచడం వంటి విషయాలను పంచుకోడానికి ఈఅవగాహన ఒప్పందం ఉపయోగపడుతుందన్నారు. నిట్ రిజిస్ట్రార్ దినేష్ రెడ్డి, ప్రొఫెసర్ రవికిరణ్ శాస్త్రి, అసోసియేట్ డీన్ రాజేశ్వరరెడ్డి, థింక్ ఇండియా రాష్ట్ర కో కన్వీనర్ ప్రణవ్ పాల్గొన్నారు.