
ఫిర్యాదులపై పూర్తిస్థాయి విచారణ
భీమవరం: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన ఫిర్యాదులపై పూర్తిస్థాయి విచారణ జరిపి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి అన్నారు. సోమ వారం భీమవరంలోని జిల్లా పోలీస్ కార్యాల యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా ఆయన ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడారు. మొత్తం 8 ఫిర్యాదులు అందాయి. అదనపు ఎస్పీ వి.భీమారావు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ వి.పుల్లారావు, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ దేశింశెట్టి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
పోడూరులో అత్యధిక వర్షపాతం
భీమవరం: జిల్లాలో ఆదివారం పోడూరులో అత్యధికంగా 80.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా అత్యల్పంగా పాలకోడేరులో 9.6 మి.మీ వర్షం కురిసింది. సోమవారం జిల్లా సమా చార శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. మండ లాల వారీగా.. పాలకొల్లులో 73.4, తాడేపల్లి గూడెంలో 33.6, పెంటపాడులో 35, తణుకులో 16.6, అత్తిలిలో 31.6, గణపవరంలో 51.4, ఆకివీడులో 37.6, ఉండిలో 21.6, పెనుమంట్రలో 28.4 వర్షం పడింది. ఇరగవరంలో 34.8, పెను గొండలో 26.8, ఆచంటలో 44 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వీరవాసరంలో 24.2, భీమవరంలో 31.4, కాళ్లలో 23.8, మొగల్తూరు లో 33.8, నరసాపురంలో 30.2, యలమంచిలిలో 20.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
పెన్షన్ బిల్లుతో ఇబ్బందులు
నూజివీడు: కేంద్ర ప్రభుత్వం మార్చిలో తీసుకువచ్చిన పెన్షన్ బిల్లు వల్ల పెన్షనర్లు ఆర్థికంగా ఇబ్బంది పడతారని రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు వంగల గోవింద రావు అన్నారు. సోమవారం స్థానిక సంఘ కా ర్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని గోవిందరావు డిమాండ్ చేశారు. సంఘ వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టి ఆమోదించారు. ఉపాధ్యక్షుడు ఈమని శేషయ్య, కార్యదర్శి సోమయాజులు, ఆర్గనైజింగ్ కార్యదర్శి అబ్దుల్ ఖాదర్, కోశాధికారి కేఎస్ఎస్ఆర్కే ప్రసాదరావు పాల్గొన్నారు.
కనీస వేతనాల కోసం ధర్నా
ఏలూరు (టూటౌన్): కార్మికులకు కనీస వేతన సలహా బోర్డును వెంటనే నియమించాలని కనీస వేతనం నెలకు రూ.35 వేలుగా నిర్ణయించి అమలు చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చలసాని రామారావు డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ దేశవ్యాప్త పిలుపులో భాగంగా ఏలూరు కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాస్ డాంగే అధ్యక్షతన జరిగిన ధర్నాలో రామారావు మాట్లాడారు. కార్మిక శాఖ ఎన్ఫోర్స్మెంట్ యంత్రాంగాన్ని పటిష్టం చేసి కనీస వేతన చట్టాల అమలుకు భరోసా కల్పించా లని డిమాండ్ చేశారు. జిల్లా కార్యదర్శి కె.బుచ్చిబాబు, జిల్లా గౌరవ అధ్యక్షుడు కె.కృష్ణమాచార్యులు, జిల్లా నాయకులు పి.కిశోర్ మాట్లాడారు.
అట్రాసిటీ చట్టాన్ని పరిరక్షించాలి
ఏలూరు (టూటౌన్): రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు బలహీన వర్గాలకు సాగు పట్టాలను మంజూరు చేయాలని, అట్రాసిటీ చట్టా న్ని పరిరక్షించాలని, అర్హులైన చర్మకారులకు పెన్షన్లు మంజూరు చేయాలని కోరుతూ దళిత సేన ఆధ్వర్యంలో సోమవారం ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కలెక్టర్ వెట్రిసెల్వికి వినతిపత్రం అందజేశారు. దళిత సేన వ్యవస్థాపక అధ్యక్షుడు రవిప్రకాష్ మాట్లాడారు. ముందుగా ఏలూరు ఓవర్బ్రిడ్జి పక్కనున్న బాబూ జగ్జీవన్రామ్ విగ్రహం వద్ద ధర్నా చేశారు. దళిత సేన నాయకులు కాకర్ల మూడి వెంకటరావు, స్టాలిన్, చీలి మోహన రా వు, మాణిక్యాలరావు, దిరుసు పాముల పుష్ప, బేతాళ జయసుధ పాల్గొన్నారు.

ఫిర్యాదులపై పూర్తిస్థాయి విచారణ