వర్షం ధాటికి కూలిన ఇంటి శ్లాబు | - | Sakshi
Sakshi News home page

వర్షం ధాటికి కూలిన ఇంటి శ్లాబు

May 5 2025 7:25 PM | Updated on May 5 2025 7:25 PM

వర్షం ధాటికి  కూలిన ఇంటి శ్లాబు

వర్షం ధాటికి కూలిన ఇంటి శ్లాబు

తణుకు అర్బన్‌: అకాల వర్షానికి ఇంటి శ్లాబు కూలిపోయిన ఘటన మండలంలోని వేల్పూ రులో చోటు చేసుకుంది. గ్రామంలోని చింతలదొడ్డిలో ఆదివారం ఉదయం వర్షం వస్తున్న సమయంలో అకస్మాత్తుగా రెండు పోర్షన్ల డా బా ముందు భాగం శ్లాబు కూలిపోవడంతో స న్‌సైడ్‌, మెట్ల ల్యాండింగ్‌ నేలకొరిగాయి. ఒక పోర్షన్‌లో నివసించే తాళ్ల స్వామి కుటుంబం ఊరు వెళ్లగా, మరో పోర్షన్‌లో ఉండే తాళ్ల కోటమ్మ పక్కింటికి వెళ్లింది. దీంతో ఎలాంటి ప్రా ణనష్టం వాటిల్లలేదు. శ్లాబుతో పాటు ముందు భాగం ఽపూర్తిగా ధ్వంసమైంది. రెవెన్యూ అధికారులు వచ్చి వివరాలు సేకరించారు. ఇంటిని సీపీఎం గ్రామ కార్యదర్శి బళ్ల చినవీరభద్రరా వు, శాఖ కార్యదర్శి వాసా వెంకటేశ్వరరావు, నాయకులు తాడిశెట్టి కోటివెంకటేశ్వరరావు, గణేష్‌, తిప్పా శివ పరిశీలించారు. బాధితులకు ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. బాధితులు రోజువారీ కూలీ చేసుకుని జీవించే పేదలని, వారికి న్యాయం చేయాలని కోరారు.

విద్యుత్‌ అధికారులకు పదోన్నతులు, బదిలీలు

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏపీఈపీడీసీఎల్‌ ఏలూరు ఆపరేషన్‌ సర్కిల్‌లో పలువురు అధికారులకు పదోన్నతులు, బదిలీలు చేస్తూ సంస్థ సీఎండీ పృధ్వీతేజ్‌ ఇమ్మడి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏలూరులో టెక్నికల్‌/ఎంఆర్‌టీ విభాగంలో ఏఈఈగా పనిచేస్తున్న ఎన్‌.ఉషారాణికి డిప్యూటీ ఈఈగా పదోన్నతి కల్పించి ఆమెను ఏలూరులోనే ఎల్‌టీఎం అండ్‌ ఎస్‌పీఎం విభాగానికి బదిలీ చేశారు. ఏలూరు ఎల్‌టీఎం అండ్‌ ఎస్‌పీఎం విభాగంలో డిప్యూ టీ ఈఈగా పనిచేస్తున్న కె.రమేష్‌ను జీలుగుమిల్లి ఆపరేషన్‌ డిప్యూటీ ఈఈగా బదిలీ చేశారు. జీలుగుమిల్లి ఆపరేషన్‌ డిప్యూటీ ఈఈ గా పనిచేస్తున్న ఎన్‌.పద్మినిని అనకాపల్లి ప్రొటెక్షన్‌ విభాగానికి బదిలీ చేశారు.

నేడు పీజీఆర్‌ఎస్‌

భీమవరం (ప్రకాశంచౌక్‌): భీమవరం కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమం యథావిధిగా జరుగుతుందని కలెక్టర్‌ సీహెచ్‌ నాగరాణి తెలిపారు. అలాగే డివిజన్‌, మండల స్థాయిల్లో కూడా కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.

పాఠ్య పుస్తకాల సరఫరా

తాడేపల్లిగూడెం (టీఓసీ): ఉమ్మడి పశ్చిమ గోదావరిలో ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి 48 మండల కేంద్రాలకుగాను 41 మండలాలకు ఫస్ట్‌ స్పెల్‌ పాఠ్యపుస్తకాల పంపిణీ జరిగినట్టు తాడేపల్లిగూడెం జిల్లా పాఠ్య పుస్తక విక్రయ కార్యాలయం మేనేజర్‌ భాస్కరరావు తెలిపారు. మొదటి సెమిస్టర్‌కు 12,44,861 పుస్తకాలు అవసరం కాగా 9,31,957 పుస్తకాలు వచ్చాయన్నారు. వీటిలో ఇప్పటివరకు 6,44,126 పుస్తకాలను ఆయా మండలాలకు తరలించామన్నారు. రెండో రోజుల్లో ఏలూరు, లింగపాలెం, కుక్కునూరు, ఏలూరుపాడు, ని డదవోలు, దెందులూరు, భీమడోలు మండలాలకు పుస్తకాలు సరఫరా చేస్తామన్నారు. 9, 10 తరగతుల హిందీ సిలబస్‌ మారడంతో కొత్త పుస్తకాలు వచ్చాయన్నారు. డీఈఓ నారాయణ ఆదివారం పాఠ్య పుస్తక విక్రయ కార్యాలయాన్ని పరిశీలించారు.

సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాల కట్టడి

ఆగిరిపల్లి : గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల నేరాలు, చోరీలను అరికట్టవచ్చని డీఎస్పీ కేఎన్‌వీ ప్రసాద్‌ అన్నారు. స్థాని క పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం వ్యాపారస్తులకు సీసీ కెమెరాల ఏర్పాటుపై అవగాహన కల్పించారు. డీఎస్పీ మాట్లాడుతూ జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమన్నారు. వ్యాపారులు తమ దుకాణాల ముందు తప్పకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. దుకాణాల ముందు వాహనాలను ఎక్కడపడితే అక్కడ నిలపకుండా, ట్రాఫిక్‌కు ఆటంకం కలగకుండా చూడాలన్నారు. ఎస్సై శుభశేఖర్‌, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement