
పోషకాహారం అందించాలి
భీమవరం అర్బన్: అంగన్వాడీ కేంద్రాల్లో ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలని, చిన్నారులకు నాణ్యమైన పోషకాహారం అందించాలని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమం, దివ్యాంగులు, వృద్ధుల శాఖ సెక్రటరీ, జిల్లా ప్రత్యేకాధికారి ఎ.సూర్య కుమారి అన్నారు. మండలంలోని చినఅమిరం–3 అంగన్వాడీ కేంద్రాన్ని గురువారం ఆమె సందర్శించారు. కేంద్రాన్ని పరిశీలించి పిల్లలతో ముచ్చటించారు. పిల్లలందరినీ తప్పనిసరిగా అంగన్వాడీ కేంద్రానికి పంపేలా తల్లులను ప్రోత్స హించాలన్నారు. కేంద్రం ఆవరణలోని ఖాళీ స్థలంలో ఆకుకూరలు పండించి పిల్లలకు వండి పెట్టాలని సూచించారు. సీడీపీఓ టీకేవీ సూర్య కాంతం, సూపర్వైజర్ డి.అనిల్కుమార్ ఉన్నారు.
ఆక్వా చెరువు తవ్వకం ఆపాలి
కాళ్ల: ఏలూరుపాడులో మంచినీటి చెరువుకు సమీపంలో ఆక్వా చెరువు తవ్వకాన్ని వెంటనే నిలుపుదల చేయాలంటూ గురువారం గ్రామ స్తులు ఆందోళన చేశారు. పంచాయతీ కార్యాలయానికి పెద్ద ఎత్తున చేరుకుని నిరసన తెలిపారు. అనంతరం సర్పంచ్ భూపతిరాజు వెంకట జగ్గరాజు ఇంటికి వెళ్లి చెరువు తవ్వకంపై గళమెత్తారు. తమ ఆరోగ్యాలు కాపాడాలంటూ నినదించారు. చెరువు తవ్వకానికి సిద్ధమవుతున్న రైతుతో సర్పంచ్ జగ్గరాజు ఫోన్లో మాట్లాడారు. రెండురోజుల పాటు తవ్వకం పనులు నిలిపివేయాలని సూచించారు.
మహిళలు స్వశక్తితో ఎదగాలి
అత్తిలి: స్వయం సహాయక సంఘాల మహిళలు స్వశక్తితో ఎదిగేందుకు యూనిట్ల స్థాపనకు ముందుకు రావాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి అన్నారు. గురువారం మండలంలోని అత్తిలి, మంచిలి గ్రామాల్లో మహిళా సమాఖ్య సభ్యులు నిర్వహిస్తున్న ఉపాధి యూనిట్లను ఆమె పరిశీలించారు. మంచిలిలో పూతరేకుల యూనిట్లను నిర్వహిస్తున్న మహిళలతో ఆమె మాట్లాడారు. మహిళలు ఆర్థికంగా నిలిచేందుకు ప్రభుత్వం రుణాలు అందిస్తోందన్నారు. అనంతరం అత్తిలిలో శరవణ గ్రాండ్ ఫ్యామిలీ రెస్టారెంట్, పేపర్ ప్లేట్స్, స్వీట్స్ బాక్స్ తయారీ యూనిట్లను ఆమె సందర్శించారు. కామధేను త్రెడ్స్ (దారపు బంతుల తయారీ యూనిట్), అనూష బొటిక్ అండ్ మగ్గం వర్క్స్, టైలరింగ్ యూనిట్ను పరిశీలించి మహిళలకు సూచనలు ఇచ్చారు. డీఆర్డీఏ పీడీ ఎంఎస్ఎన్ వేణుగోపాల్, లైవ్లీ హుడ్స్ డీపీఎం ఎస్ కుసుమ కుమారి, మండల సమాఖ్య అధ్యక్షురాలు పి.సుభద్ర, ఎంపీడీఓ పి.శామ్యూల్ ఉన్నారు.
ఏలూరు జిల్లా ప్రజా రవాణా అధికారిగా సుధాకర్
ఏలూరు (ఆర్ఆర్పేట): ఏలూరు జిల్లాల్లా ప్రజా రవాణా (ఆర్టీసీ) అధికారిగా ఎ.జాన్ సుధాకర్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఈ స్థానంలో అదన పు బాధ్యతలతో పనిచేస్తున్న పశ్చిమ గోదావరి జిల్లా ప్రజా రవాణా అధికారి ఎన్వీఆర్ వరప్రసాద్ను రిలీవ్ చేశారు. జాన్ ప్రభాకర్ ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా ఆర్టీసీ డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్గా పనిచేస్తున్నారు. రెండు, మూడు రో జుల్లో బాధ్యతలు స్వీకరించనున్నట్టు తెలిసింది.
పింఛన్లను సద్వినియోగం చేసుకోవాలి
అత్తిలి: సామాజిక పింఛన్లను లబ్ధిదారులు స ద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి సూచించారు. అత్తిలి యానాదుల పుంతలో గురువారం నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ఎ.రాధాకృష్ణతో కలిసి ఆమె పాల్గొన్నారు. మే నెలకు సంబంధించి జిల్లాలో 2,25,231 మంది లబ్ధిదారులకు రూ.96.66 కోట్లు విడుదల చేసినట్టు కలెక్టర్ చెప్పారు. ఈ సందర్భంగా కాలనీ వా సులకు ప్లాస్టిక్ వినియోగంపై అనర్థాలను తెలియజేస్తూ జ్యూట్ బ్యాగులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ ఎంఎస్ఎస్ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.