
రెచ్చిపోయిన చింతమనేని
ఈవీల చోరీ ముఠా అరెస్టు
ఎలక్ట్రిక్ స్కూటర్లు చోరీ చేస్తున్న ముగ్గురిని అరెస్టు చేసి వారి నుంచి విజయవాడ పోలీసులు 22 ఎలక్ట్రిక్ స్కూటర్లు స్వాధీనం చేసుకున్నారు. 8లో u
ఏలూరు టౌన్: ఏలూరు ఎన్ఆర్ పేటలోని సాక్షి జిల్లా కార్యాలయం వద్ద చింతమనేని ప్రభాకర్ తో పాటు అతని అనుచరులు మంగళవారం మధ్యాహ్నం హల్చల్ చేస్తూ గందరగోళం సృష్టిం చారు. వంద మందికిపైగా టీడీపీ నేతలు, కార్య కర్తలతో హంగామా చేశారు. సాక్షి కార్యాలయంలో కంప్యూటర్లు, ఫర్నీచర్ను ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో ఎస్పీ కొమ్మి ప్రతాప శివ కిషోర్ ఆదేశాల మేరకు డీఎస్పీ డీ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో సీఐలు కోటేశ్వరరావు, అశోక్ కుమార్, సత్యనారాయణ, వెంకటేశ్వరరావు, పలువురు ఎస్సైలు, ఏఆర్ పోలీస్ సిబ్బంది సాక్షి కార్యాలయం వద్దకు చేరుకున్నారు. పోలీస్ సిబ్బంది రోప్ తీసుకువస్తుండగా ఎందుకు తీసుకువస్తున్నారని టీడీపీ కార్యకర్త ఒకరు ప్రశ్నించాడు. నీకెందుకని స్పెషల్ పార్టీ సిబ్బంది చెప్పి పక్కకు నెట్టడంతో టీడీపీ కార్యకర్త స్పెషల్ పార్టీ సిబ్బందిపై దాడికి పాల్పడ్డాడు.
వాస్తవం జీర్ణించుకోలేకే దాడి: బాలరాజు
బుట్టాయగూడెం: ఏలూరు సాక్షి జిల్లా కార్యాలయంపై దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, తన అనుచరులు దాడిని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు తీవ్రంగా ఖండించారు. వాస్తవాలు రాసే పత్రికలపై అక్కసుతోనే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అటు వైఎస్సార్సీపీ నాయకులపైన, వాస్తవాలు రాసే పత్రికలపైన కూటమి నాయకుల దౌర్జన్యాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయన్నారు.

రెచ్చిపోయిన చింతమనేని