కడలూరు సత్యజ్ఞాన సభకు శింబు | - | Sakshi
Sakshi News home page

కడలూరు సత్యజ్ఞాన సభకు శింబు

Oct 8 2025 6:39 AM | Updated on Oct 8 2025 6:39 AM

కడలూరు సత్యజ్ఞాన సభకు శింబు

కడలూరు సత్యజ్ఞాన సభకు శింబు

తమిళసినిమా: నటుడు శింబు ప్రస్తుతం తన 49వ చిత్రంలో నటిస్తున్నారు. వెట్రిమారన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కలైపులి ఎస్‌ థాను నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్ర టైటిల్‌ను మంగళవారం ప్రకటించారు. దీనికి అరసన్‌ అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఈ సందర్భంగా నటుడు శింబు మంగళవారం ఉదయం కడలూరు జిల్లా, వడలూర్‌లోని సత్యజ్ఞాన సభకు వెళ్లారు. వళ్లవర్‌ నెలకొల్పిన జ్ఞానసభ ఇది. ప్రతి ఏడాది తైపూస జ్యోతి దర్శనం ఉత్సవాలను ఈయన విరివిగా నిర్వహిస్తుంటారు. భక్తులు భారీ ఎత్తున్న ఈ ఉత్సవానికి తరలి వస్తుంటారు. కాగా శింబు ఈ సత్యజ్ఞాన సభను సందర్శించారు. అనంతరం వళ్లవర్‌ను దర్శించుకున్నారు. అక్కడ గంటకుపైగా ధ్యానం చేశారు. ఈ సందర్భంగా శింబు మీడియాతో మాట్లాడుతూ వళ్లవర్‌ నిరుపేదలకు, అనాథలకు మూడు పూటలా అన్నదానం చేస్తుంటారని చెప్పారు. అదేవిధంగా తాను చిన్నారులకు అన్నదానం చేయాలని వేడుకున్నట్లు చెప్పారు. అందుకే వళ్లవర్‌ పిలిచిన వెంటనే సత్యజ్ఞాన సభకు వచ్చి ఆయన్ని దర్శించుకున్నట్లు శింబు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement