
ఆత్మ రక్షణకు కరాటే ఉపయోగకరం
● ఏఆర్ అదనపు ఎస్పీ అశోక్బాబు
ఒంగోలు: ఆత్మరక్షణకు కరాటే ఎంతో ఉపయోగకరమని ఏఆర్ అదనపు ఎస్పీ అశోక్బాబు అన్నారు. స్థానిక హైదరీ క్లబ్ ఆవరణలో మంగళవారం కరాటే బెల్టు గ్రేడింగ్ పరీక్షలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమ్మర్ కోచింగ్ క్యాంపును సద్వినియోగం చేసుకున్న ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు. జిల్లా ఽఅధ్యక్షుడు గుండవరపు రాఘవ, ఉపాధ్యక్షుడు మారెళ్ల సుబ్బారావు, అసిస్ట్ డిప్యూటీ డైరెక్టర్ వడ్డెంపూడి సుజాతారావు, ప్రకాశం జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షులు కుర్రా భాస్కరరావు తదితరులు బెల్టులు అందించారు. కార్యక్రమంలో కోచ్ నల్లూరి మోహనరావు, సిద్దార్థ కరాటే అసోసియేషన్ అధ్యక్షుడు మండవ మురళీకృష్ణ, అట్లూరి శ్రీధర్, వల్లపు వెంకటేశ్వర్లు, పీవీ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.
ప్రమాదాలు జరగకుండా చర్యలు
● డీటీసీ సుశీల
కొమరోలు: రోడ్డు ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని డీటీసీ సుశీల తెలిపారు. మండలంలోని తాటిచెర్లమోటులో 10 రోజులక్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా మంగళవారం డీటీసీ సుశీల, నేషనల్ హైవే ప్రాజెక్టు డైరెక్టర్ పార్వతీశం, డీఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. డీటీసీ సుశీల సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించి ప్రమాదం ఏ విధంగా జరిగిందో వివరించారు. ఈ సందర్భంగా డీటీసీ సుశీల మాట్లాడుతూ వాహనాలు వేగంగా నడుపడం వల్లే ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయన్నారు. వాహనదారులు అతివేగంతో వాహనాలు నడపకుండా జాగ్రత్తగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మార్కాపురం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మల్లికార్జునరావు, గిద్దలూరు రూరల్ సీఐ రామకోటయ్య, కొమరోలు ఎస్సై నాగరాజు పాల్గొన్నారు.
రైలు కింద పడి వృద్ధుడు ఆత్మహత్య
తర్లుపాడు: రైలు కింద పడి వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన తర్లుపాడు మండల పరిధిలోని కేతగుడిపి వద్ద మంగళవారం చోటుచేసుకుంది. మార్కాపురం రైల్వే హెడ్ కానిస్టేబుల్ హరికృష్ణారెడ్డి కథనం ప్రకారం.. మార్కాపురం పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో నివాసముండే చిలకా నాగయ్య(60) తోపుడు బండిపై పండ్లు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం రాత్రి కుటుంబ సభ్యులతో గొడవపడి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. మంగళవారం ఉదయం రైల్వే పోలీసులు కేతగుడిపి సమీపంలో ఓ వ్యక్తి రైలు పట్టాలపై మృతి చెంది ఉండటాన్ని గుర్తించారు. స్థానికంగా సోషల్ మీడియాలో ఫొటోలు పెట్టడంతో మృతుడిని కుటుంబ సభ్యులు గుర్తించారు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తెలు ఉన్నారు. కుమారుడు వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ తెలిపారు.

ఆత్మ రక్షణకు కరాటే ఉపయోగకరం

ఆత్మ రక్షణకు కరాటే ఉపయోగకరం

ఆత్మ రక్షణకు కరాటే ఉపయోగకరం