
పోలీస్ క్రికెట్ టోర్నీ విజేత జిల్లా హెడ్ క్వార్టర్స్
ఒంగోలు టౌన్: జిల్లా పోలీసు శాఖ నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్లో జిల్లా హెడ్ క్వార్టర్స్ జట్టు విజేతగా నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన జిల్లా సబ్ డివిజన్ పోలీసు అధికారుల జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 94 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన జిల్లా హెడ్ క్వార్టర్స్ జట్టు 9 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మరో మ్యాచ్లో జిల్లా సబ్ డివిజన్ పోలీస్ జట్టు నిర్ణీత 9.5 ఓవర్లలో 53 పరుగులకు ఆలౌట్ అయింది. జిల్లా హెడ్ క్వార్టర్ జట్టు 6.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. విజేతగా నిలిచిన జట్టును ఎస్పీ అభినందించారు. నిత్యం విధులు, బందోబస్తులతో సతమతమవుతున్న పోలీసు అధికారులు, సిబ్బందికి మానసికోల్లాసం కలిగించడానికి క్రీడా పోటీ నిర్వహించినట్లు చెప్పారు. ఏఆర్ ఎస్పీ అశోక్ బాబు, అడిషనల్ ఎస్పీ(అడ్మిన్) కె.నాగేశ్వరరావు, డీఎస్పీలు రాయపాటి శ్రీనివాసరావు, లక్ష్మీ నారాయణ, నాగరాజు, సాయిఈశ్వర్ యశ్వంత్, శ్రీనివాసరావు, సీఐలు, ఆర్ఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.