పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి

Apr 27 2025 1:33 AM | Updated on Apr 27 2025 1:39 AM

పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి

పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి

కనిగిరిరూరల్‌: పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్‌ సీపీ కనిగిరి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ దద్దాల నారాయణ యాదవ్‌ అన్నారు. స్థానిక టుబాకో బోర్డులో జరుగుతున్న వేలం కేంద్రాన్ని శనివారం వైఎస్సార్‌ సీపీ శ్రేణులతో కలిసి వెళ్లి ఆయన పరిశీలించారు. బయ్యర్లు, కంపెనీ ప్రతినిధులు, బోర్డు అధికారులతో పొగాకు రైతుల సమస్యలపై దద్దాల మాట్లాడారు. పొగాకుకు గిట్టుబాటు ధరలు లేక ఇబ్బందులు పడుతున్నామని, కనీసం పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు దద్దాల నారాయణ వద్ద వాపోయారు. గిట్టుబాటు ధర కోసం పదే పదే బేళ్లను పొగాకు బోర్డు వద్దకు తీసుకుని రావడం ఇబ్బందికరంగా ఉందన్నారు. అనంతరం దద్దాల నారాయణ యాదవ్‌ విలేకర్లతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైందన్నారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో రైతులకు అన్ని రకాల పంటలకు మంచి గిట్టుబాటు ధరలు ఇచ్చారని గుర్తు చేశారు. గతంలో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మార్క్‌ఫెడ్‌ అధికారులతో, టుబాకో బోర్డు ఉన్నతాధికారులతో మాట్లాడి పొగాకు రైతులకు లాభదాయక ధరలు కల్పించారని గుర్తు చేశారు. గత ప్రభుత్వం కేజీ పొగాకు ధర రూ.360 గరిష్టం, కనిష్టం కేజీ ధర రూ.230 పలికిందని వివరించారు. నేటి కూటమి సర్కార్‌లో గరిష్ట ధర కనీసం రూ.280, కనిష్ట ధర కేజీ రూ.220కు మించడం లేదన్నారు. వైఎస్సార్‌ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి సూచనల మేరకు పొగాకు రైతులకు న్యాయం జరిగేంత వరకు, గిట్టుబాటు ధర కల్పించేంత వరకు దశల వారీ ఆందోళనలు చేపడతామని నారాయణ యాదవ్‌ అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ అబ్దుల్‌ గఫార్‌, జెడ్పీటీసీ మడతల కస్తూరిరెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్‌ చింతంగుంట్ల సాల్మన్‌ రాజు, మాజీ ఎంపీపీ గాయం బలరాంరెడ్డి, పోలక సిద్దారెడ్డి, ఆవుల భాస్కర్‌రెడ్డి, కటికల వెంకటరత్నం, గాండ్లపర్తి ఆదినారాయణరెడ్డి, డాక్టర్‌ ఆవుల కృష్ణారెడ్డి, డాక్టర్‌ ఎస్‌కే నాయబ్‌ రసూల్‌, వైస్‌ చైర్మన్‌ ఆర్‌ మాణిక్యరావు, ఎస్‌కే రహీం, జీ బొర్రారెడ్డి, గజ్జల వెంకటరెడ్డి, పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు తమ్మినేని సుజాత, అయిమోల్లా నాగమణి, వాకుమళ్ల రాజశేఖరరెడ్డి, కాస్తాల బాలాజీ, పోతిరెడ్డి రాజశేఖరరెడ్డి, తూము వెంకట కృష్ణారెడ్డి, నాగేంద్రారెడ్డి, ఆవుల తిరుపతిరెడ్డి, యర్రబల్లి దేవరాజ్‌, ఖాశింసా, గూడూరి అనీల్‌ కుమార్‌, షంషీర్‌, పరిమి వెంకట్రావ్‌, ప్రసాద్‌రెడ్డి, ఉమా శంకర్‌రెడ్డి, పలుకూరి భాస్కర్‌, చింతంగుంట్ల కిషోర్‌, ఎస్‌ వెంకటేశ్వర్లు చౌదరి, షకీలా, భారతీ తదితరులు పాల్గొన్నారు.

రైతులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి దద్దాల నారాయణ యాదవ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement