'జ్ఞాపకశక్తి క్షీణించిందని కొడుక్కి పగ్గాలు..' | Vijaya Sai Reddy Fires On Chandrababu In Twitter | Sakshi
Sakshi News home page

‘జ్ఞాపకశక్తి క్షీణించిందని కొడుక్కి పగ్గాలు ఇస్తారంట’

Aug 19 2020 12:38 PM | Updated on Aug 19 2020 1:04 PM

Vijaya Sai Reddy Fires On Chandrababu In Twitter - Sakshi

సాక్షి, అమరావతి : వైఎస్సార్‌సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్‌ వేదికగా చంద్రబాబుపై బుధవారం వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 'పార్టీ వ్యవహారాలను కొడుకుకు అప్పగించాలని బాబు గారు అనుకుంటున్నారా? వయసు పెరగడం, జ్ఞాపకశక్తి క్షీణించడంతో కుమారుడికి పగ్గాలు ఇస్తారంట. కరోనా ఉధృతి తగ్గగానే లోకేశ్ నాయుడును కాబోయే సీఎం'గా  ఎలివేట్ చేసేలా సైకిల్ యాత్ర చేయించాలని ఎల్లో మీడియా ముఖ్యులు రూట్ మ్యాప్ ఇచ్చారంట. అంటూ ఎద్దేవా చేశారు. (రగులుతున్న ‘మాలి')

కాగా మరో ట్వీట్‌లో..' బాబు నాయుడు... ప్రధానిని, ఆయన కుటుంబాన్ని తిట్టిన నోటితోనే ఆయన నాయకత్వాన్ని పొగిడారు. సీబీఐ, ఈడీ, ఐటీ, ఎన్ఐఏ ఏపీలోకి రావటానికి వీల్లేదన్న నోటితోనే కేంద్ర ప్రభుత్వ విచారణ కావాలంటున్నారు. ఇంకా ఇలాంటి చిత్ర విచిత్రాలు, విడ్డూరాలు ఎన్ని చూడాలో మరి..!' అంటూ విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement