
అద్దె కార్ల పేరుతో అక్రమాలు
అడిషనల్ డీఆర్డీఓ విధి నిర్వహణకు ఓ అద్దె కారును తీసుకొని జిల్లా వ్యాప్తంగా పర్యవేక్షణ చేసేందుకు ప్రభుత్వం నెలకు రూ.33 వేలు చెల్లిస్తోంది. కాగా సదరు అధికారి మాత్రం జిల్లాలోని డీపీఎంల కారుల్లో తిరుగుతూ.. కరీంనగర్కు చెందిన ఓ వ్యక్తి కారు పేరిట నెలకు రూ. 33 వేలు బిల్లులు డ్రా చేస్తున్నట్లు సమాచారం. అయితే గతేడాది నుంచి వాహనం బిల్లు చెల్లించాలని ఉన్నతాధికారులకు కోరగా ఇటీవల ఏడాదికి సంబంధించిన బిల్లు చెక్ రేడీ అయినట్లు తెలుస్తోంది. అడిషనల్ పీడీపై ఫిర్యాదు రావడంతో ఆ బిల్లు సైతం ఆగినట్లు సమాచారం.