భూసార పరీక్షలతో రైతులకు మేలు | - | Sakshi
Sakshi News home page

భూసార పరీక్షలతో రైతులకు మేలు

May 29 2025 9:47 AM | Updated on May 29 2025 9:47 AM

భూసార పరీక్షలతో రైతులకు మేలు

భూసార పరీక్షలతో రైతులకు మేలు

నర్సాపూర్‌ రూరల్‌: రైతులు నూతన సాంకేతిక పద్ధతులను అందిపుచ్చుకొని వ్యవసాయం చే యాలని ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు డాక్టర్‌ గీత, పద్మశ్రీ, గాయత్రి, శ్రీలత సూచించారు. బుధ వారం మండలంలోని నత్నయ్యపల్లి, అహ్మద్‌నగర్‌ గ్రామా ల్లో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో పాల్గొని సాగు పద్ధతులపై అవగాహన కల్పించారు. రైతులు పంటలు సాగు చేసే ము ందు తమ భూముల్లో భూసార పరీక్షలు చేయించుకొని రిపోర్టు ఆధారంగా అనువైన పంటలను సాగు చేసుకోవాలన్నారు. రసాయన ఎరువులకు దూ రంగా ఉండి సేంద్రియ ఎరువులతో పంటలు సాగు చేసుకోవాలని తెలిపారు. ప్రతి రైతు తమ వివరాలు అందించి ఐడీ కార్డు పొందాలన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారిని దీపిక, ఏఈఓలు చంద్రవేణి, తేజస్విని, రైతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement