
పచ్చిరొట్టతో నాణ్యమైన దిగుబడి
మెదక్ కలెక్టరేట్: పచ్చిరొట్ట ఎరువులు వాడటంతో భూసారం పెరిగి నాణ్యమైన దిగుబడులు వస్తాయని జిల్లా ఇన్చార్జి వ్యవసాయ అధికారి వినయ్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో ప్రస్తుతం జిల్లాలో 15,000 క్వింటాళ్ల జనుము, 30,000 క్వింటాళ్ల జీలుగా విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. వరి నాట్లు ఎక్కడైతే ముందు జరుగుతాయో ఆ మండలాల్లో ప్రాథమిక సహకార సంఘాలు, రైతు ఆగ్రోస్ కేంద్రాల వద్ద పచ్చిరొట్ట విత్తనాలు అందుబాటులో ఉన్నాయన్నారు. మిగితా మండలాలకు నా లుగు రోజుల్లో అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. నేలకు, పంటకు మేలు చేసే పచ్చిరొట్ట ఎరువును తయారు చేసేందుకు ప్రభుత్వం జీలుగ విత్తనాలను రైతులకు సబ్సిడీపై అందజేస్తుందన్నారు. పట్టాదారు పుస్తకం, ఆధార్ కార్డు ఉన్న రైతుకు మాత్రం 50 శాతం వరకు సబ్సిడీపై అందుతుందన్నారు. రైతులు రసాయన ఎరువులు వాడకాన్ని తగ్గించి, సేంద్రియ పద్ధతిలో భూసారం పెంచే దిశగా పచ్చిరొట్ట విత్తనాలు పంపిణీ చేస్తున్నట్లు వివరించారు.
అందుబాటులో
జనుము, జీలుగ విత్తనాలు
జిల్లా ఇన్చార్జి
వ్యవసాయ అధికారి వినయ్