అధైర్యపడొద్దు.. వచ్చేది మన ప్రభుత్వమే | - | Sakshi
Sakshi News home page

అధైర్యపడొద్దు.. వచ్చేది మన ప్రభుత్వమే

May 20 2025 7:35 AM | Updated on May 20 2025 7:35 AM

అధైర్యపడొద్దు.. వచ్చేది మన ప్రభుత్వమే

అధైర్యపడొద్దు.. వచ్చేది మన ప్రభుత్వమే

పాపన్నపేట(మెదక్‌): కార్యకర్తల సమస్యలు తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి సోమవారం చిట్‌చాట్‌ నిర్వహించారు. బాచారం వెళ్తూ వారు పాపన్నపేటలో ఆగిన విషయాన్ని తెలుసుకున్న పలువురు కార్యకర్తలు టీకొట్టు వద్దకు చేరుకున్నారు. ఈసందర్భంగా మండలంలోని రాజకీయ పరిస్థితులతో పాటు వారి సమస్యలు ఏ కరువు పెట్టారు. వచ్చే ఎన్నికల్లో అధికారం బీఆర్‌ఎస్‌దేనని, అప్పటివరకు ఓపిక పట్టాలని వారు సూచించారు. పాలకుల వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేకత ప్రతి పల్లెలో కనిపిస్తుందన్నారు. అనంతరం మండల పరిధిలోని బాచారంలో రేణుకా ఎల్లమ్మ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ జిల్లా రైతు నాయకులు సోములు, మాజీ ఎంపీపీ పవిత్ర, దుర్గయ్య, ఏడుపాయల మాజీ చైర్మన్‌ బాలాగౌడ్‌, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, గురుమూర్తిగౌడ్‌, లింగారెడ్డి, బాబాగౌడ్‌, వెంకటేశం, రాము, సాయిరెడ్డి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement