
నేత్రపర్వం.. మూల మహోత్సవం
వర్గల్(గజ్వేల్): సుప్రసిద్ధమైన వర్గల్ విద్యాసరస్వతి క్షేత్రం శుక్రవారం మూల మహోత్సవ వైభవంతో అలరారింది. చదువుల తల్లికి భక్తజన సామూహిక లక్షపుష్పార్చన నేత్రపర్వం చేసింది. ఆలయ వ్యవస్థాపక చైర్మన్ చంద్రశేఖర సిద్ధాంతి నేతృత్వంలో వేదపండితులు తెల్లవారుజామున అమ్మవారి మూలవిరాట్టుకు విశేష పంచామృతాభిషేకం నిర్వహించారు. పట్టువస్త్రాలు, పూలమాలికలు, ఆభరణాలతో అలంకరించారు. సామూహిక లక్షపుష్పార్చన చేశారు. చండీ హోమం నిర్వహించారు. పలువురు చిన్నారులు అమ్మవారి సన్నిధిలో అక్షరాభ్యాసాలు చేశారు. భక్తులు వేడుకలు తిలకించి తరించారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.