
పగిలిన పైపులు.. నీటికి తిప్పలు
రాయచూరు రూరల్: నగరంలో తాగునీటి కోసం ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. వేసవి కాలంలో తాగునీటి సమస్య నివారణకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని పాలకులు చెబుతుండగా మరో వైపు నీటి ఎద్దడి అధికమైంది. అధికారులు మౌనం వహిసున్నారు. జలనిర్మల పథకం కింద రూ.100 కోట్లు కేటాయించారు. అయినా పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య అధిక మైంది. నగరసభ తాగునీటి ఎద్దడి సమస్య నివారణ విషయంలో తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తోంది. గురువారం తాలూకాలోని వడ్లూరు పారిశ్రామిక కేంద్రం వద్ద నీటి పైపులు పగిలి 20 అడుగుల మేర నీరు ఎగసి పడి వృథా అయ్యాయి. ప్రజలు మాత్రం నీటిని ట్యాంకర్ల ద్వారా పొందాల్సి వస్తోంది. గత రెండు రోజుల నుంచి నీరు రాక విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. నీటిని సరఫరా చేసే పైపులు పగిలి పోవడంతో మరమ్మతు పనుల చేపట్టడంలో నగరసభ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇప్పటికై నా నగరసభ అధికారులు తగిన చర్యలు చేపట్టి తాగునీటి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
వారం రోజులుగా సరఫరా కాని
తాగునీరు
వడ్లూరు వద్ద పగిలిన నీటి పైపు లైన్
మరో రెండు రోజులు నీటి సరఫరా లేదు

పగిలిన పైపులు.. నీటికి తిప్పలు