
జంధ్యం తొలగింపుపై ధర్నా
మండ్య: జంధ్యం ధరించిన బ్రాహ్మణ విద్యార్థులకు సీఈటీ పరీక్ష రాసేందుకు అవకాశం ఇవ్వకుండా వారి భవిష్యత్తును నాశనం చేసిన అధికారులపై చట్టప్రకారం చర్యలు చేపట్టాలని జిల్లా బ్రాహ్మణ సభ నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు మంగళవారం నగరంలో ధర్నా చేపట్టారు. పరీక్ష రాయకుండా వంచితులైన విద్యార్థులకు ప్రభుత్వ కళాశాలల్లో ఉచిత సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లా బ్రాహ్మణ సభ అధ్యక్షుడు ప్రొఫెసర్ హెచ్ఎస్ నరసింహమూర్తి, కార్యదర్శి గోపాలకృష్ణ శైణె, పదాధికారులు ఎస్.శంకరనారాయణ శాస్త్రి, అనంత్కుమార్, ఎస్.శ్రీధర్, సీపీ విద్యాశంకర్ పాల్గొన్నారు.