దేశంలో అత్యున్నతమైన ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక కావడమంటే మాటలు కాదు. ఏళ్ల తరబడి కఠోర సాధన, ప్రతిభ కలిస్తేనే విజయం వరిస్తుంది. అదే కోవలో కన్నడనాడు నుంచి పలువురు ప్రతిభావంతులు యూపీఎస్‌సీ ఫలితాల్లో మంచి ర్యాంకులు సాధించి పోస్టులకు అర్హత సాధించారు. | - | Sakshi
Sakshi News home page

దేశంలో అత్యున్నతమైన ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక కావడమంటే మాటలు కాదు. ఏళ్ల తరబడి కఠోర సాధన, ప్రతిభ కలిస్తేనే విజయం వరిస్తుంది. అదే కోవలో కన్నడనాడు నుంచి పలువురు ప్రతిభావంతులు యూపీఎస్‌సీ ఫలితాల్లో మంచి ర్యాంకులు సాధించి పోస్టులకు అర్హత సాధించారు.

Apr 23 2025 8:05 AM | Updated on Apr 23 2025 9:05 AM

దేశంల

దేశంలో అత్యున్నతమైన ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక కావడమంటే

సాక్షి, బళ్లారి: ఢిల్లీలో మంగళవారం విడుదలైన యూపీఎస్‌సీ సివిల్స్‌ ఫలితాలలో కన్నడ యువతీ యువకులు ర్యాంకులు సంపాదించారు. హావేరి జిల్లా రాణిబెన్నూరు తాలూకా హొసపేట గ్రామానికి చెందిన సచిన్‌ బసవరాజు 41వ ర్యాంక్‌ సాధించారు. ఎంబీబీఎస్‌ పూర్తి చేసి వైద్యునిగా పని చేస్తూ యూపీఎస్‌ఈ పరీక్షలు రాశారు. ఒకటి, రెండు, మూడుసార్లు పరీక్షలు రాసినా విజయం వరించలేదు. అయినా నిరాశ చెందక నాలుగోసారి జయకేతనం ఎగురవేశారు. జాతీయస్థాయిలో 41వ ర్యాంక్‌ సాధించిన సచిన్‌తో పాటు కుటుంబ సభ్యుల్లో ఆనందోత్సవం వెల్లువిరిసింది. కలెక్టర్‌ కావాలన్నదే తన కల అని చెప్పారు.

మరో 10 మంది ర్యాంకర్లు

బొమ్మనహళ్లి: కర్ణాటక నుంచి ఇద్దరు వైద్యులు టాప్‌– 50 ర్యాంకులు సాధించడం గమనార్హం. డాక్టర్‌.రంగమంజు 24వ ర్యాంకు పొందారు. మరొకరు హావేరి వాసి డా.సచిన్‌. రాష్ట్రం నుంచి ర్యాంకులు సాధించిన మిగతావారి వివరాలు.. ● అనుప్రియా సఖ్య–120వ ర్యాంకు ● బీ.ఎం.మేఘనా – 425 ● భరత్‌ సీ.యార– 567, ● డాక్టర్‌. భాను ప్రకాశ్‌– 523 ● నిఖిల్‌ ఎం.ఆర్‌– 724, ● టీ.విజయ్‌కుమార్‌– 894 ● హనుమంతప్ప నంది– 910 ● విశాకదకం– 962, ● సందీప్‌ సింగ్‌– 981, ● మోహన్‌ పాటిల్‌ 984 ర్యాంకు.

కోలారులో మధు, మాధవి...

శివమొగ్గలో వికాస్‌..

యూపీఎస్‌సీ ఫలితాల్లో

కన్నడిగుల ప్రతిభ

పలువురికి ఉత్తమ ర్యాంకులు

కోలారు: సివిల్స్‌లో కోలారు జిల్లా యువతీ యువకులు సత్తా చాటుకున్నారు. జిల్లాలోని శ్రీనివాసపురం తాలూకా ఉపాధ్యాయ దంపతులు రవికుమార్‌, నందినిల కుమార్తె మాధవి 446వ ర్యాంకును సాధించారు. ఎంబిబిఎస్‌ చేసిన మాధవి మూడవ ప్రయత్నంలో ఉత్తీర్ణురాలు అయింది.

కోలారు తాలూకా ఇరగసంద్ర గ్రామానికి చెందిన రైతు ఆనంద్‌, సుశీలమ్మ కుమారుడు ఎ.మధు 544వ ర్యాంకు సాధించారు. అగ్రి బీఎస్సీ చదివిన మధు యూపీఎస్సీ పరీక్షలను ఎంచుకుని విజయం సాధించాడు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో మరికొందరు ఉత్తమ ర్యాంకులను సాధించారు.

శివమొగ్గ: శివమొగ్గ జిల్లాలోని సాగరకు చెందిన వికాస్‌ 228వ ర్యాంకును సాధించారు. అదే ఊరిలో పాఠశాల, ఇంటర్‌ను పూర్తిచేశారు. శివమొగ్గలో లెక్చరర్‌ అయిన విజయేంద్ర పాటిల్‌ , టీచర్‌ మహాలక్ష్మి దంపతుల కుమారుడు వికాస్‌. ఢిల్లీలో ఉంటూ సివిల్స్‌కు సన్నద్ధమయ్యాడు. మంచి ర్యాంకు సాధించడంతో బంధుమిత్రుల్లో సంతోషం నెలకొంది.

దేశంలో అత్యున్నతమైన ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక కావడమంటే 1
1/5

దేశంలో అత్యున్నతమైన ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక కావడమంటే

దేశంలో అత్యున్నతమైన ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక కావడమంటే 2
2/5

దేశంలో అత్యున్నతమైన ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక కావడమంటే

దేశంలో అత్యున్నతమైన ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక కావడమంటే 3
3/5

దేశంలో అత్యున్నతమైన ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక కావడమంటే

దేశంలో అత్యున్నతమైన ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక కావడమంటే 4
4/5

దేశంలో అత్యున్నతమైన ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక కావడమంటే

దేశంలో అత్యున్నతమైన ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక కావడమంటే 5
5/5

దేశంలో అత్యున్నతమైన ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక కావడమంటే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement