ధరలు తగ్గించాలని డిమాండ్‌ | - | Sakshi
Sakshi News home page

ధరలు తగ్గించాలని డిమాండ్‌

Apr 22 2025 12:46 AM | Updated on Apr 22 2025 12:46 AM

ధరలు తగ్గించాలని డిమాండ్‌

ధరలు తగ్గించాలని డిమాండ్‌

రాయచూరు రూరల్‌: పెంచిన డీజిల్‌, పెట్రోల్‌ ధరలు, పేదలు వినియోగించే వస్తువుల ధరలను తగ్గించాలని సీపీఐ(ఎం) డిమాండ్‌ చేసింది. సోమవారం తహసీల్దార్‌ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో రాష్ట్ర కార్యదర్శి వీరేష్‌ మాట్లాడారు. పంచ గ్యారెంటీల పేరుతో రాష్ట్ర ఖజానాను లూటీ చేసిందన్నారు. నేడు విద్యుత్‌, బస్‌ చార్జీలు, పాల ధరలు పెంచడం వల్ల సామాన్య ప్రజలు పలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ధరలను తగ్గించడానికి రాష్ట్ర సర్కార్‌కు ఆదేశాలు జారీ చేయాలని, వక్ఫ్‌ బిల్లును ఉపసంహరించుకోవాలని కోరుతూ తహసీల్దార్‌ ద్వారా గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో పద్మ, శరణ బసవ, నరంసింహ, లక్ష్మణ, గోకారమ్మ, ఇందిర, చంద్రకళ, భీమప్ప, విజయలక్ష్మి, హులిగప్ప, మల్లికార్జునలున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement