స్పాట్‌ సెల్లింగ్‌ | - | Sakshi
Sakshi News home page

స్పాట్‌ సెల్లింగ్‌

Oct 6 2025 2:38 AM | Updated on Oct 6 2025 2:38 AM

స్పాట

స్పాట్‌ సెల్లింగ్‌

స్లాట్‌ బుకింగ్‌.. స్పాట్‌ సెల్లింగ్‌

పత్తి విక్రయానికి ఇక ఇబ్బందులుండవ్‌

స్లాట్‌ బుకింగ్‌..

హన్మకొండ: పంట అమ్ముకునే సమయంలో ఎదురవుతున్న ఇబ్బందుల నుంచి పత్తి రైతులకు ఇక విముక్తి లభించనుంది. కనీస మద్దతు ధర అందించడంతోపాటు దళారుల ప్రమేయం లేకుండా రైతులు నేరుగా పత్తి అమ్ముకునేందుకు, క్రయవిక్రయాలు పారదర్శకంగా జరిగేందుకు కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ) ‘కా పాస్‌ కిసాన్‌’ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో ఇక నుంచి రైతులు ఈ యాప్‌ ద్వారా స్లాట్‌ బుక్‌ చేసుకుని పంటను అమ్ముకోవాలి. ఈ నేపథ్యంలో వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులకు ఈ యాప్‌పై ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. శిక్షణ పొందిన అధికారులు రైతుల మొబైల్‌ ఫోన్‌లో యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయించి పత్తి బుక్‌ చేసుకునే విధానంపై అవగాహన కల్పిస్తారు. తద్వారా పత్తి క్రయవిక్రయాలు పూర్తిగా యాప్‌ ద్వారానే సాగనున్నాయి. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పత్తి దాదాపు 5,23,848 ఎకరాల్లో సాగు చేశారు.

ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలి..

‘కా పాస్‌ కిసాన్‌’ యాప్‌ను స్మార్ట్‌ఫోన్లలో గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నాక ముందుగా రైతు పేరు, జండర్‌, పుట్టిన తేదీ, కులం. చిరునామా, ఆధార్‌, ఫోన్‌ నంబర్‌, కౌలురైతు/సొంతమా అనే వివరాలు నమోదు చేయాలి. పట్టాదారు పాస్‌ పుస్తకం నంబర్‌, సర్వే నంబర్‌, రైతుకు ఉన్న మొత్తం భూమి, ఇందులో పత్తి సాగు విస్తీర్ణం, పంట రకం వివరాలు యాప్‌లో నిక్షిప్తం చేయాలి. రైతుకు సంబంధించిన ఆధార్‌ కార్డు, పాస్‌బుక్‌, రైతు ఫొటోను యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలి.

స్లాట్‌ బుక్‌ చేసుకుంటేనే అమ్మకం..

రైతులు ‘కా పాస్‌ కిసాన్‌’ యాప్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకుంటేనే పత్తి అమ్ముకోగలుగుతారు. రైతులు ఏ మిల్లులో అమ్ముకుంటారో తెలుపుతూ స్లాట్‌ బుక్‌ చేయగానే తేదీ, సమయాన్ని అధికారులు యాప్‌ ద్వారా సమాచారం అందిస్తారు. అదే నిర్ణీత రోజు, నిర్ణీత సమయానికి రైతు పత్తిని తీసుకెళ్లి విక్రయించుకోవచ్చు. స్లాట్‌ బుక్‌ చేసుకోకపోతే పత్తిని అమ్ముకోలేరు. రైతులు మూడుసార్లు స్లాట్‌ బుక్‌ చేసుకుని, స్లాట్‌ను రద్దు చేసుకోకుండా పత్తిని కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లి విక్రయించకపోతే ఆ రైతు పేరు బ్లాక్‌లిస్టులోకి వెళ్తుంది. బ్లాక్‌ లిస్టులో నుంచి పేరు తొలగించి, తిరిగి పత్తి అమ్ముకోలాంటే సీసీఐ అధికారులతో ప్రత్యేక అనుమతి తీసుకోవాలి.

ప్రత్యేక యాప్‌ను రూపొందించిన సీసీఐ

‘కా పాస్‌ కిసాన్‌’ యాప్‌ ద్వారా బుకింగ్‌

యాప్‌పై వ్యవసాయ అధికారులు,

విస్తరణాధికారులకు శిక్షణ

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 5,23,848 ఎకరాల్లో పత్తి సాగు

జిల్లా విస్తీర్ణం (ఎకరాలు)

వరంగల్‌ 1,18,547

హనుమకొండ 74,849

మహబూబాబాద్‌ 85,480

ములుగు 20,593

భూపాలపల్లి 98,260

జనగామ 1,26,119

పత్తి క్వింటాకు రూ.8,110 మద్దతు ధర..

కేంద్ర ప్రభుత్వం పత్తి క్వింటాలుకు రూ.8,110 మద్దతు ధర ప్రకటించింది. ‘కా పాస్‌ కిసాన్‌’ యాప్‌ ద్వారా మద్దతు ధర పొందే అవకాశాన్ని కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా కల్పించింది. స్మార్ట్‌ ఫోన్‌లేని రైతులు ఇతరుల స్మార్ట్‌ ఫోన్‌ నుంచి కూడా స్లాట్‌ బుక్‌ చేసుకోవచ్చు. రైతు పాస్‌బుక్‌ నంబర్‌ ఎంటర్‌ చేయడం ద్వారా స్లాట్‌ బుక్‌ చేసుకోవచ్చు. ‘కా పాస్‌ కిసాన్‌’ యాప్‌లో రైతు పట్టాదారు పాస్‌బుక్‌ నంబర్‌, ఇతర వివరాలు నమోదు చేయగానే పంట ఎంత సాగు చేశారో వివరాలు అందులో వస్తాయి. వ్యవసాయ శాఖ ఇప్పటికే డిజిటల్‌ క్రాప్‌ సర్వే చేస్తూ పంట సాగు వివరాలు నమోదు చేస్తోంది. డిజిటల్‌ క్రాప్‌ సర్వే దాదాపు పూర్తి కావొచ్చింది. పంట సాగు విస్తీర్ణాన్ని బట్టి దిగుబడి లెక్కిస్తారు. ఈ యాప్‌ ద్వారా రైతులకు దళారుల నుంచి విముక్తి కలుగుతుంది. రైతులు నిరీక్షించాల్సిన బాధ తప్పుతుంది.

స్పాట్‌ సెల్లింగ్‌1
1/2

స్పాట్‌ సెల్లింగ్‌

స్పాట్‌ సెల్లింగ్‌2
2/2

స్పాట్‌ సెల్లింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement