కోతులు బాబోయ్‌.. కోతులు | - | Sakshi
Sakshi News home page

కోతులు బాబోయ్‌.. కోతులు

May 5 2025 10:22 AM | Updated on May 5 2025 10:22 AM

కోతులు బాబోయ్‌.. కోతులు

కోతులు బాబోయ్‌.. కోతులు

ఎల్కతుర్తి : మండల కేంద్రంలో కోతుల బెడద రో జు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇళ్లలో చొరబడి ఏది దొరికితే అది ఎత్తుకెళ్లి నానా హంగామా విధ్వంసం సృష్టిస్తున్నాయి. చూ..అంటూ అడ్డు వెళ్లితే మీద ఎగబడి కరుస్తూ తీవ్రంగా గాయపరుసున్న సంఘటనలు నెలకొన్నాయి. దీంతో స్థానిక ప్రజలు రోడ్లు, వీధుల వెంబడి నడవాలంటేనే జంకుతున్నారు. ప దుల సంఖ్యలో ఉన్న కోతులు ప్రస్తుతం వందల సంఖ్యకు చేరుకున్నాయి. గుంపుగా వస్తూ ఇంటి త లుపులు తీసుకొని ఇళ్లలోకి చొరబడుతున్నాయి. ఇండ్లలోని వస్తువులు కూరగాయలు, బియ్యం పప్పులు ఏది ఉంటే అది ఎత్తుకెళ్తున్నాయి. బియ్యం బస్తాలు, వడ్ల బస్తాలను ఆగమాగం చేస్తున్నాయి. గతంలో మాజీ ఎంపీటీసీ కోతుల బెడుద అధికంగా ఉందని గ్రామస్తుల కోరిక మేరకు ఆయన తన సొంత ఖర్చులతో కోతులను పట్టించారు. అయినప్పటికీ తిరిగి వాటి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నా యి. ఎక్కడ ధాన్యం ఆరబోసిన అక్కడికి గుంపులు గా చేరి ఆరబోసిన ధాన్యాన్ని బుక్కడంతో పాటు చిందరవందర చేస్తూ ఆగమాగం చేస్తున్నాయి. దీంతో రైతులకు కష్టాలు తప్పడం లేదని పలువురు ఆ రోపిస్తున్నారు.

పట్టించుకోని అధికారులు, నాయకులు

కొంతకాలంగా మండల కేంద్రంలో కోతుల సంచా రం విపరీతంగా పెరిగిపోయింది. స్థానిక ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. తప్పని పరిస్థితుల్లో ఇళ్లలో నుంచి బయటకు వెళ్టేటప్పుడు చేతిలో కర్రలు పట్టుకొని వెళ్లాల్సిన దుస్థితి నెలకొంటుందని పలువురు వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఇళ్లపైకి చేరి పెంకలు విప్పి పగలగొడుతున్నాయి. వీధుల గుండా నడుచుకుంటూ వెళ్తున్న వృద్ధులపైకి దాడి చేసి తీవ్రంగా గాయపరుస్తున్నాయి. జనం రోడ్లపైకి రావాలంటేనే తీవ్ర భయాందోళనకు గువుతున్నా రు. ఇప్పటికైనా అధికారులు, నాయకులు స్పందించి ప్రజలను తీవ్రంగా గాయపరుస్తున్న వా నరసైన్యాన్ని పట్టించి వాటి నుంచి నుంచి విముక్తి కల్పించాలని కోరుతున్నారు.

ధాన్యం కల్లాలు, ఇళ్లలో చొరబడి

ఆగమాగం చేస్తున్న వానరాలు

బెంబేలెత్తుతున్న ప్రజానీకం

పట్టించుకోని అధికారులు, నాయకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement