
వరంగల్ శ్రీనివాస్కు గద్దర్ ఐకాన్ అవార్డు ప్రదానం
దామెర : మండలంలోని తక్కళ్లపహాడ్కు చెందిన ప్రముఖ కవి, రచయిత, గాయకుడు, సినీసంగీత దర్శకుడు వరంగల్ శ్రీనివాస్కు గద్దర్ ఐకాన్ అవార్డుతో సత్కరించారు. సాయి అలేఖ్య సాంస్కృతిక సేవా సంస్ధ ఆధ్వర్యంలో హైదరాబాద్లో శనివారం సాయంత్రం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ చేతుల మీదుగా వరంగల్ శ్రీనివాస్ ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ 243 చరణాలతో తాను రాసిన నూరేళ్ల నా ఊరు గేయ కావ్యం 243 మంది గాయకులతో పాడించేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కళాకారులను ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. కర్రె గుట్టల్లో నిర్వహిస్తున్న ఆపరేషన్ కగార్ను నిలిపివేసి అటవీ ప్రాంతంలో శాంతియుత వాతావరణం నెలకొల్పాలని రాష్ట్ర కళాకారుల పక్షాన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెహల్గాంలో జరిగిన ఉగ్రవా దుల దాడి ఖండించడంతో పాటు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. కార్యక్రమంలో టూరిజం చైర్మన్ రమేష్ రెడ్డి, మాజీ మంత్రులు పట్నం మహేందర్ రెడ్డి, వేణుగోపాల చా రిలతో పాటు పలువురు కళాకారులు, తదితరులు పాల్గొన్నారు.