108కు ‘పచ్చ’కామెర్లు | - | Sakshi
Sakshi News home page

108కు ‘పచ్చ’కామెర్లు

Sep 24 2025 9:12 AM | Updated on Sep 25 2025 2:06 PM

108కు ‘పచ్చ’కామెర్లు

108కు ‘పచ్చ’కామెర్లు

ఉప్పలగుప్తం: 108 వాహనాలకు ‘పచ్చ’రంగు పడింది. సాధారణంగా అంబులెన్స్‌లకు నీలం రంగు, ఎరుపు రంగు రేడియం స్టిక్కర్లు వేస్తారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం నీలం రంగు వేసి, ఎరుపు, తెలుపు రేడియం స్టిక్కర్లు వేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 108 వాహనాల ముందు భాగానికి పసుపు రంగు వేసి, వాహనానికి ఇరువైపులా పసుపు రంగు బోర్డులు వేయడం గమనార్హం. వాహనాలకు రంగు మార్చేందుకు విజయవాడ తీసుకుని వెళుతున్నారు. రంగుల మార్చడానికి తోడు వాహనాన్ని విజయవాడ తీసుకుని వెళ్లడం అదనపు ఖర్చు. ఒక అంబులెన్స్‌ వెళ్లి రంగు మార్చుకొని రావడానికి పది నుంచి పదిహేను రోజులు పడుతోంది. ఈ సమయంలో స్థానికులకు ఎటువంటి ప్రమాదం జరిగినా సకాలంలో 108 అంబులెన్స్‌లు రావడం లేదు. గతంలో వైఎస్సార్‌సీపీ పార్టీ రంగులను పోలి ఉంటే చాలు పార్టీ రంగులు వేశారని నానా హంగామా చేసిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పార్టీలు ఇప్పుడు పచ్చరంగు వేయడంపై మాత్రం నోరు మెడపకపోవడం విమర్శలకు దారితీస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement