మరోసారి సీజీఆర్‌ఎఫ్‌ చైర్మన్‌గా సత్యనారాయణ | - | Sakshi
Sakshi News home page

మరోసారి సీజీఆర్‌ఎఫ్‌ చైర్మన్‌గా సత్యనారాయణ

Jun 1 2025 12:56 AM | Updated on Jun 1 2025 1:13 AM

మరోసారి సీజీఆర్‌ఎఫ్‌ చైర్మన్‌గా సత్యనారాయణ

మరోసారి సీజీఆర్‌ఎఫ్‌ చైర్మన్‌గా సత్యనారాయణ

మహారాణిపేట: ఎలక్ట్రిసిటీ కన్స్యూమర్‌ గ్రీవెన్స్‌ రెడ్రసల్‌ ఫోరం(సీజీఆర్‌ఎఫ్‌) చైర్మన్‌గా బి.సత్యనారాయణ రెండోసారి నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ ఈపీడీసీఎల్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ పృథ్వీతేజ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా.. శనివారం సత్యనారాయణ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆయన మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. 2022 నుంచి 2025 వరకు సత్యనారాయణ సీజీఆర్‌ఎఫ్‌ చైర్మన్‌గా సేవలందించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని వివిధ న్యాయస్థానాల్లో 1998 నుంచి 2022 వరకు పలు హోదాల్లో న్యాయమూర్తిగా పనిచేశారు. 2022లో జిల్లా జడ్జిగా పదవీ విరమణ పొందారు. విద్యుత్‌ వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి నిబద్ధతతో తీర్పులిచ్చారు. కాగా సత్యనారాయణ పునర్నియామకం పట్ల రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి రాష్ట్ర సలహా కమిటీ సభ్యుడు, కన్స్యూమర్‌ ఆర్గనైజేషన్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు కాండ్రేగుల వెంకటరమణ, ఏపీ ఈపీడీసీఎల్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ ఎస్‌.హరిబాబు(ఫైనాన్స్‌), సీజీఆర్‌ఎఫ్‌ సభ్యులు ఎ.మురళీకృష్ణ (ఇండిపెండెంట్‌), ఎస్‌.సుబ్బారావు (ఫైనాన్స్‌), బి.సులేఖరాణి (టెక్నికల్‌) హర్షం ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement