సాక్షి, హైదరాబాద్: రోజంతా శ్రమిస్తే గానీ రూ.500 సంపాదించడం కష్టమవుతున్న ఈ రోజుల్లో, టీఆర్ఎస్కు చెందిన మంత్రులు ఓ పది నిమిషాలు ఐస్ క్రీములు, టీ అమ్మి, మూటలు మోసి లక్షల రూపాయలు సంపాదించారని హైకోర్టుకు సీనియర్ న్యాయవాది సి.వి. మోహన్రెడ్డి నివేదించారు. ఇది నిజమే అయితే ప్రజలంతా కూలీ పని తప్ప, మరో పని చేయరన్నారు. మంత్రులుగా ఉండి.. గులాబీ కూలీ పేరుతో డబ్బు వసూలు చేయడం అవినీతి కిందకు వస్తుందన్నారు. దీనిపై పిటిషనర్ రేవంత్రెడ్డి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేస్తే, వారు కనీస దర్యాప్తు కూడా చేయలేదన్నారు.
ఈ వాదనలను ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్జీపీ) ఎస్.శరత్కుమార్ తోసిపుచ్చారు. ముఖ్యమంత్రి మొదలు పలువురు మంత్రులపై రేవంత్రెడ్డి ఈ పిటిషన్లో తీవ్ర ఆరోపణలు చేశారని, అయితే వారిని ప్రతివాదులుగా చేర్చలేదన్నారు. అందువల్ల ఈ వ్యాజ్యానికి విచారణార్హత లేదని తెలిపారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని, కొంత గడువునివ్వాలని ఆయన కోర్టును కోరారు. ఇందుకు కోర్టు నాలుగు వారాల గడువునిచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ‘గులాబీ కూలీ’పై దర్యాప్తు చేసేలా సీబీఐకి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ కొడంగల్ ఎమ్మెల్యే ఎ.రేవంత్రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మంగళవారం న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి విచారణ జరిపారు.
ఈ సందర్భంగా మోహన్రెడ్డి వాదనలు వినిపిస్తూ, ఏ కోణంలో చూసినా గులాబీ కూలీ విచారణకు స్వీకరించదగ్గ నేరం (కాగ్నిజబుల్ అఫెన్స్) కిందకు వస్తుందన్నారు. అయితే ఏసీబీ అధికారులు మాత్రం దర్యాప్తు అవసరం లేదంటున్నారని తెలిపారు. అందువల్ల సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరారు. శరత్ వాదనలు వినిపిస్తూ, రేవంత్ ఆరోపణలకు ఆధారాలు లేవని ఏసీబీ అధికారులు భావించారు కాబట్టే, అతని ఫిర్యాదును వారు మూసివేశారన్నారు.
‘గులాబీ కూలీ’ దర్యాప్తును సీబీఐకి ఇవ్వండి
Published Wed, Jun 6 2018 1:32 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే. ఫోటోలు వైరల్
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
కేజ్రీవాల్కు మరో షాక్.. ‘ఎల్జీ’ సంచలన నిర్ణయం
మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement