నాటుసారా పట్టివేత | Capture bottles desidaru | Sakshi
Sakshi News home page

నాటుసారా పట్టివేత

Mar 21 2014 4:09 AM | Updated on Oct 17 2018 6:06 PM

ఎన్నికల నింబంధనల్లో భాగంగా ఏర్పాటు చేసిన పటిష్ట బందోబస్తులో గురువారం నాటుసారాను సరఫరా చేస్తున్న ఒకరిని పట్టుకున్నామని ఎక్సైజ్ అధికారి గంగారాం తెలిపారు.

నిజామాబాద్‌క్రైం, న్యూస్‌లైన్ : ఎన్నికల నింబంధనల్లో భాగంగా ఏర్పా టు చేసిన పటిష్ట బందోబస్తులో గురువారం నాటుసారాను సరఫరా చేస్తున్న ఒకరిని పట్టుకున్నామని ఎక్సైజ్ అధికారి గంగారాం తెలిపారు. నిజామాబాద్ మండలంలోని రామేశ్వపూర్‌తండాకు చెందిన రవి అనే వ్యక్తి నాటుసారా సరఫరా చేస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ సిబ్బంది దాడి చేసి 37.5 లీటర్ల నాటుసారాను పట్టుకుని స్వాధీనం చేసుకున్నారు.

దీంతోపాటు స్కూటర్‌ను కూడా స్వాధీనం చేసుకుని ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించామని అధికారులు తెలిపారు. ఈ దాడిలో టాస్క్‌ఫో ర్స్ సిబ్బంది నాగేందర్‌రెడ్డి, మశ్చేందర్, కమురుద్దీన్, హైమద్ ఉన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement