రాష్ట్రంలో ధృతరాష్ట్ర పాలన: రామకృష్ణ | Dhrtarastra rule in the state: Ramakrishna | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో ధృతరాష్ట్ర పాలన: రామకృష్ణ

Aug 23 2016 1:27 AM | Updated on Aug 10 2018 8:16 PM

రాష్ట్రంలో ధృతరాష్ట్ర పాలన: రామకృష్ణ - Sakshi

రాష్ట్రంలో ధృతరాష్ట్ర పాలన: రామకృష్ణ

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ధృతరాష్ట్ర పాలన సాగిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మండిపడ్డారు.

సాక్షి, అమరావతి : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ధృతరాష్ట్ర పాలన సాగిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మండిపడ్డారు. చంద్రబాబు కనుసన్నల్లోనే టీడీపీ ప్రజాప్రతినిధులు, వారి వారసులు అవినీతి, అక్రమాల్లో పెట్రేగిపోతున్నారని ఆరోపించారు. విజయవాడలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కుమారుడు ఓ కాంట్రాక్టర్‌పై చేయిచేసుకున్నట్లు పత్రికల్లో వార్తలు వచ్చాయని గుర్తు చే శారు.  హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏ ఆగడాలు మితిమీరిపోయాయని, మున్సిపల్ కార్యాలయాల్లో అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement