ఇద్దరు ఘరానా దొంగల అరెస్ట్ | robbery gang arrested in kurnool distirict | Sakshi
Sakshi News home page

ఇద్దరు ఘరానా దొంగల అరెస్ట్

Sep 1 2015 12:21 PM | Updated on Aug 30 2018 5:27 PM

పలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు ఘరానా దొంగలను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు.

కోయలకుంట్ల: పలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు ఘరానా దొంగలను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. ఈ సంఘటన మంగళవారం కర్నూలు జిల్లా కోయలకుంట్ల మండలం పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు.. కోయలకుంట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆరు ప్రాంతాల్లో ఇద్దరూ నిందితులు పలు దొంగతనాలకు పాల్పడ్డారు. ఈ మేరకు పోలీసులు నిందితుల కోసం గాలించి అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి రూ. 70 వేలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను నర్సింహులు, శ్రీనివాసులుగా పోలీసులు గుర్తించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement