mad
-
సినిమా హిట్.. 10 రోజులు తాగుతూనే ఉన్నాం!
మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఇది అందరికీ తెలుసు. అయినా సరే తాగుతుంటారు. సామాన్యుల సంగతి పక్కనబెడితే సెలబ్రిటీలు కూడా మద్యం తాగుతుంటారు. కానీ ఇలాంటి విషయాలు బయటకు చెప్పుకోవడానికి పెద్దగా ఇష్టపడరు. కానీ తెలుగు యువ నటుడు మాత్రం తన డ్రింకింగ్ అలవాటు గురించి బయటపెట్టాడు.(ఇదీ చదవండి: ఐపీఎల్ క్రికెటర్ ని పెళ్లి చేసుకున్న యంగ్ హీరోయిన్) 'మ్యాడ్'(MAD Movie) ఫ్రాంచైజీలో మనోజ్ పాత్రలో ఆకట్టుకున్న నటుడు రామ్ నితిన్(Ram Nithin). లవర్ బాయ్ గా మంచి యాక్టింగ్ చేశాడు. ప్రేక్షకుల్ని అలరించాడు. అయితే తొలి భాగం హిట్ అయిన తర్వాత వరసగా 10 రోజుల పాటు తాను, సంగీత్ కలిసి మందు తాగుతూనే ఉన్నామని రామ్ నితిన్ చెప్పుకొచ్చాడు. 2021లో తాను తొలిసారిగా మందు తాగానని చెప్పిన రామ్ నితిన్.. 'మ్యాడ్' హిట్ అయిన తర్వాత వరసగా 10 రోజుల పాటు తాగానని, మందు ఇంత బాగుంటుందని అప్పుడు అనిపించిందని చెప్పుకొచ్చాడు. అలానే హాఫ్ బాటిల్ వోడ్కా తాగి, సంగీత్ ఇంట్లోని బాత్రూమ్ వాంతు చేసుకున్న సందర్భాన్ని కూడా గుర్తుచేసుకున్నాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన ఓల్డేజ్ ప్రేమకథ.. తెలుగులోనూ స్ట్రీమింగ్) రీసెంట్ గా 'మ్యాడ్ స్క్వేర్'(MAD Square Movie) హిట్ అయిన తర్వాత కూడా పార్టీ చేసుకున్నామని రామ్ నితిన్ చెప్పుకొచ్చాడు. ఇకపై సినిమా హిట్ అయితేనే మందు తాగాలని ఫిక్స్ అయినట్లు చెప్పుకొచ్చాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.సంగీత్ శోభన్, నార్నె నితిన్, విష్ణు, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటించిన కామెడీ సినిమా 'మ్యాడ్ స్క్వేర్'. మార్చి 28న థియేటర్లలో రిలీజై హిట్ అయింది. దాదాపు నెల తర్వాత అంటే ఏప్రిల్ 25 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.(ఇదీ చదవండి: ఇంతకీ ప్రవస్తి ఆరాధ్య ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి?) "We drank alcohol for 10 days after the success of MAD," says Ram Nithin. pic.twitter.com/yPBkpkrvfY— Movies4u Official (@Movies4u_Officl) April 23, 2025 -
ఓటీటీకి వచ్చేస్తోన్న మ్యాడ్ స్క్వేర్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో వచ్చిన యూత్ఫుల్ ఎంటర్టైనర్ మ్యాడ్ స్క్వేర్. మార్చి 28న థియేటర్లలో విడుదలైన ఈ కామెడీ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద ఆదరగొట్టింది. ఈ సినిమాకు కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. గతంలో విడుదలై బ్లాక్బస్టర్గా నిలిచిన మ్యాడ్ చిత్రానికి సీక్వెల్గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.తాజాగా ఈ మూవీ ఓటీటీలోనూ సందడి చేసేందుకు వచ్చేస్తోంది. ఈనెల 25 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెట్ఫ్లిక్స్ పోస్టర్ను పంచుకుంది. ఇంకేందుకు ఆలస్యం ఈ సినిమాను ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. ఇటీవలే ఈ సినిమాలో స్వాతిరెడ్డి అంటూ సాగే క్రేజీ సాంగ్ ఫుల్ వీడియోను విడుదల చేశారు. ఈ సాంగ్లో హీరోయిన్ రెబా మోనికా జాన్ తన డ్యాన్స్తో అదరగొట్టింది. కాగా.. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతమందించారు. The boys are back with double the MADness! 🤪Watch Mad Square on Netflix, out 25 April in Telugu, Hindi, Tamil, Kannada and Malayalam.#MadSquareOnNetflix pic.twitter.com/0WGsRj2Sgc— Netflix India South (@Netflix_INSouth) April 21, 2025 మ్యాడ్ స్క్వేర్ అసలు కథేంటంటే..ఈ కథలో పెద్దగా లాజిక్స్ అంటూ ఏమీ ఉండవ్.. దానిని దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రాన్ని చూస్తే ఎంజాయ్ చేస్తారని చెప్పవచ్చు. అశోక్ (నార్నె నితిన్), మనోజ్(రామ్ నితిన్), దామోదర్(సంగీత్ శోభన్),లడ్డు(విష్ణు) నలుగురు స్నేహితులు ఇంజనీరింగ్ పూర్తి అయిన తర్వాత విడిపోతారు. కానీ, లైఫ్లో సెటిల్ కాకుండా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. లడ్డు(విష్ణు) పెళ్లి నుంచి ఈ సినిమా అసలు కథ మొదలౌతుంది. స్నేహితులకు చెప్పకుండా లడ్డు పెళ్లికి రెడీ అయిపోతాడు. ఈ విషయం తెలుసుకున్న అతని మిత్రులు వేడక సమయంలో సడెన్గా ఎంట్రీ ఇస్తారు. ఈ క్రమంలో అక్కడ భారీగా ఫన్ మొదలౌతుంది. లడ్డుకు ఎలాగైనా పెళ్లి చేయాలని తండ్రి మురళీధర్ గౌడ్ ఎదురు కట్నం ఇచ్చి సంబంధం సెట్ చేస్తాడు. ఈ క్రమంలో ఆ పెళ్లి చెడిపోకూడదని లడ్డూ ఫ్యామిలీ పడే పాట్లు నవ్వులు తెప్పిస్తాయి. ఫ్రెండ్ పెళ్లి ఘనంగా చేయాలని దామోదర్, అశోక్, మనోజ్ అనేక ప్లాన్స్ వేస్తుంటారు. వారి హంగామాకు తోడు పెళ్లికూతురు ఫ్యామిలీ నుంచి లడ్డూకు ఎదురయ్యే అవమానాలు కడుపుబ్బా నవ్విస్తాయి.తన స్నేహితులు చేసే తుంటరి పనుల వల్ల ఆ పెళ్లిలో చాలా గందరగోళం నెలకొంటుంది. పెళ్లి జరుగుతున్నంత సేపు ఎక్కడ ఆ కార్యక్రమం ఆగిపోతుందో అనే భయంతో లడ్డు ఉంటాడు. సరిగ్గా పెళ్లి అవుతుందని సమయంలో లడ్డు స్నేహితులతో పాటు వచ్చిన ఒక వ్యక్తితో పెళ్లికూతురు వెళ్లిపోతుంది. ఈ విషయం తెలిశాక లడ్డూ ఇంట్లో జరిగే పంచాయితీ, అక్కడ మ్యాడ్ గ్యాంగ్ చేసే అతి ఫుల్గా నవ్విస్తుంది. దీంతో తీవ్ర నిరాశలో ఉన్న లడ్డు కోసం కాస్త రిలాక్స్ ఇవ్వాలని వారందరూ గోవా ట్రిప్ ప్లాన్ చేసుకుంటారు. వారు ఎంట్రీ ఇచ్చాక గోవా మ్యూజియంలో విలువైన లాకెట్ను గోవాలో పెద్ద డాన్గా ఉన్న మ్యాక్స్ (సునీల్) మనుసులు దొంగలిస్తారు. దానిని లడ్డు బ్యాచ్ చేశారని పోలీసులు అనుమానిస్తారు. దీంతో వారిపై నిఘా ఉంచుతారు.అయితే, ఒక ఘటనలో ఆ లాకెట్ లడ్డు చేతికి దొరుకుతుంది. దీంతో దానిని తిరిగి తెచ్చివ్వాలని లడ్డు తండ్రిని మ్యాక్స్ కిడ్నాప్ చేస్తాడు. ఈ కేసును చేధించేందుకు ఒక ఐపీఎస్ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. లడ్డు బ్యాచ్లో ఉన్న ఆ అధికారి ఎవరు..? లడ్డుని పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి మరో అబ్బాయితో ఎందుకు వెళ్లిపోయింది...? వారిద్దరూ కూడా గోవాకే ఎందుకు వెళ్తారు..? చివరిగా ఆ లాకెట్ కథ ఏంటి.. ఎవరి వద్ద ఉంటుంది..? ఫైనల్గా లడ్డును తన స్నేహితుడే జైలుకు ఎందుకు పంపుతాడు..? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
'మ్యాడ్ స్క్వేర్' ఓటీటీ డేట్ ఫిక్సయిందా?
రీసెంట్ టైంలో ఓటీటీలోకి కొత్త సినిమాలు వస్తున్నాయి. నెలలోపే స్ట్రీమింగ్ అవుతున్నాయి. అలా గత నెలలో రిలీజై హిట్ కొట్టిన 'కోర్ట్'(Court Movie) కూడా 28 రోజులకే డిజిటల్ వీక్షకుల ముందుకొచ్చేసింది. ఇప్పుడు ఇదే తరహాలో మరో హిట్ మూవీ స్ట్రీమింగ్ కి సిద్ధమైనట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: తమన్నా హారర్ సినిమా.. కలెక్షన్ మరీ ఇంత తక్కువా?)2023లో ఎలాంటి అంచనాల్లేకుండా రిలీజై హిట్ కొట్టిన సినిమా మ్యాడ్. జస్ట్ ముగ్గురు కుర్రాళ్లు.. ఇంజినీరింగ్ కాలేజీలో చేసే అల్లరి నేపథ్యంగా ఫుల్ కామెడీతో తీశారు. ప్రేక్షకులకు అది నచ్చేసింది. దీనికి కొనసాగింపుగా మ్యాడ్ స్క్వేర్(Mad Square Movie) పేరుతో మూవీ తీశారు. ఈ ఉగాదికి థియేటర్లలోకి తీసుకొచ్చారు.తొలి పార్ట్ అంతా కాకపోయినా సరే ప్రేక్షకులని పర్వాలేదనిపించేలా ఆకట్టుకుంది. కలెక్షన్స్ కూడా బాగానే వచ్చాయి. ఇప్పుడు ఈ మూవీని ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం. నెట్ ఫ్లిక్స్ లో ఏప్రిల్ 25 నుంచి 'మ్యాడ్ స్క్వేర్' స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇది కాకపోతే 28న రావొచ్చని అంటున్నారు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 20 సినిమాలు) -
దేవర 2, అదుర్స్ 2 చిత్రాలపై ఎన్టీఆర్ క్లారిటీ.. ఫ్యాన్స్కి పండగే!
‘‘షూటింగ్కి వెళ్లి కెమేరా ముందు నిల్చున్న ప్రతిసారీ నాకు వణుకు వస్తుంటుంది. అలాగే మీ ముందు (ఫ్యాన్స్) మాట్లాడాలన్నా... (నవ్వుతూ). ఒక నటుడికి వినోదం పండించడం అనేది చాలా కష్టం. అందుకే నేను ‘అదుర్స్ 2’ చేయడానికి కాస్త భయపడుతున్నాను. మళ్లీ జీవితంలో అలాంటి కామెడీ మూవీ వస్తుందో లేదో’’ అని హీరో ఎన్టీఆర్(Jr NTR) అన్నారు. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ హీరోలుగా నటించిన చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’ (Mad Square). కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సునీల్, ‘సత్యం’ రాజేశ్, కార్తికేయ, విష్ణు, ప్రియాంకా జవాల్కర్, రెబ్బా మోనికా జాన్ (స్పెషల్ సాంగ్) ఇతర పాత్రలు పోషించారు. సూర్యదేవర నాగవంశీ సమర్పణలో హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం మార్చి 28న విడుదలైంది. శుక్రవారం హైదరాబాద్లో జరిగిన ‘మ్యాడ్ స్క్వేర్’ సక్సెస్మీట్కి ముఖ్య అతిథిగా హాజరైన ఎన్టీఆర్ మాట్లాడుతూ– ‘‘అభిమాన సోదరులకు పేరు పేరునా కృతజ్ఞతలు. చాలా కాలమైంది మనం కలుసుకుని. నవ్వించడం అనేది చాలా గొప్ప వరం. ఎన్ని బాధలు, కష్టాలు ఉన్నా మనల్ని నవ్వించే మనిషి ఉంటే చాలు కదా అనిపిస్తుంది. ఈ రోజు దర్శకుడు కల్యాణ్ శంకర్ మనకి దొరికాడు. ‘మ్యాడ్ స్క్వేర్’తో మళ్లీ సక్సెస్ కొట్టిన కల్యాణ్కి అభినందనలు. ఓ బ్లాక్బస్టర్ మూవీ సీక్వెల్తో జనాలని రంజింపచేయడం చాలా కష్టం. కానీ మీరు సాధించారు. ఇలాంటి దర్శకుడికి అండగా నిలిచిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు థ్యాంక్స్. ఈ మూవీలో మురళీధర్గారు అద్భుతంగా నటించారు. లడ్డు పాత్ర చేసిన విష్ణు లేకుంటే ఈ సినిమా ఇంత పెద్ద హిట్ కాదేమో? అనిపించింది. డైరెక్టర్ శోభన్గారి అబ్బాయిలు సంతోష్, సంగీత్లను చూస్తే ఆయన గుర్తొస్తారు. మనకి బాగా ఇష్టమైన వాళ్లు మనకి దూరమైనా మన చుట్టూనే ఉంటారు. మీ నాన్నగారు కూడా గర్వపడుతుంటారు. ‘మ్యాడ్’లో రామ్ నితిన్ని చూస్తే నేను యంగ్గా ఉన్నప్పుడు ఎలా ఉన్నానో అలానే ఉన్నారు. నాకు 2011లో పెళ్లయింది. నార్నే నితిన్ అప్పుడు చాలా చిన్నపిల్లాడు. నాతో ఎక్కువ మాట్లాడేవాడు కాదు. కానీ, ధైర్యం చేసి నా వద్దకు వచ్చి నాతో చెప్పిన ఒకే ఒక్క మాట ‘బావా... నేను యాక్టర్ అవుతాను’ అని.. అంతే ధైర్యంగా నేను ‘నా సపోర్ట్ నీకు ఉండదు... పోయి చావ్ అన్నాను’. కానీ, ఇండస్ట్రీలో తన కెరీర్ ఎలా ఉండబోతోంది? అనే భయం ఉండేది. నీకు నువ్వుగా ముందుకెళ్లు అన్నాను. తనే నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్లాడు. ఈ రోజు తనని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. సునీల్ లేకపోతే ‘మ్యాడ్ స్క్వేర్’ లేదు. సంగీత దర్శకుడు భీమ్స్, రచయిత కాసర్ల శ్యామ్తో పాటు ఈ సినిమాకి పని చేసిన అందరికీ అభినందనలు. వీళ్లందరి వెనకాల కనపడని ఓ శక్తే మా చినబాబు. త్వరలోనే మేం ఓ సినిమా చేయబోతున్నాం. ఇక ‘దేవర’ చిత్రాన్ని ఆదరించినందుకు, మీ (ఫ్యాన్స్) భుజాలపైన మోసినందుకు ధన్యవాదాలు. ‘దేవర 2’ (Devara 2) కచ్చితంగా ఉంటుంది. కాకపోతే మధ్యలో ప్రశాంత్ నీల్గారు వచ్చారు. నేను ఫ్యాన్స్ కోసమే కష్టపడుతుంటాను. మిమ్మల్ని ఆనందపరచడానికే బతికుంటాను. మీరెప్పుడూ కాలర్ ఎత్తుకునేలాగే ప్రయత్నిస్తాను.. అప్పుడప్పుడు కుదరకపోయినా పర్లేదు.. కానీ మీకోసం కష్టపడుతూనే ఉంటాను’’ అన్నారు. డైరెక్టర్ త్రివిక్రమ్ మాట్లాడుతూ– ‘‘మ్యాడ్ స్క్వేర్’ సినిమా నటీనటులకు, సాంకేతిక నిపుణులందరికీ కంగ్రాట్స్. నేను వచ్చినప్పటి నుంచి ‘జై ఎన్టీఆర్.. జై ఎన్టీఆర్’ అనే స్లోగన్స్ చూస్తుంటే... జేఏఐఎన్టి... జెయింట్ గుర్తొస్తోంది. సో.. ఎన్టీఆర్ జెయింట్’’ అన్నారు. ఈ వేడుకలో ‘మ్యాడ్ స్క్వేర్’ నటీనటులు, సాంకేతిక నిపుణులు, పంపిణీదారులకు షీల్డ్లు ప్రదానం చేశారు. -
గ్రాండ్ ‘మ్యాడ్ స్క్వేర్’మూవీ సక్సెస్ మీట్..అతిథిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ (ఫొటోలు)
-
'మ్యాడ్ స్క్వేర్' సెలబ్రేషన్స్ వివరాలు.. బావమరిది కోసం వస్తున్న ఎన్టీఆర్
'మ్యాడ్ స్క్వేర్' సక్సెస్ సెలబ్రేషన్స్కు ఏర్పాట్లు అన్నీ పూర్తి అయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జూ.ఎన్టీఆర్ వస్తుండటంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మ్యాడ్ గ్యాంగ్ (నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ )తో తారక్ అల్లరి ఎలా ఉంటుందో మరికొన్ని గంటల్లో చూడొచ్చు. 2023లో వచ్చిన మ్యాడ్ సినిమాకు సీక్వెల్గా 'మ్యాడ్ స్క్వేర్' చిత్రాన్ని దర్శకుడు కల్యాణ్ శంకర్ తెరకెక్కించారు. సూర్యదేవర హారిక, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. నాగవంశీ సమర్పకులుగా ఉన్నారు.మార్చి 28న విడుదలైన 'మ్యాడ్ స్క్వేర్' కేవలం ఐదురోజుల్లోనే రూ. 74 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. వారంలోపే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ మార్క్ను దాటేసి లాభాల బాట పట్టింది. దీంతో అభిమానుల కోసం సక్సెస్ మీట్ను ఏర్పాటుచేస్తున్నారు. ఈ కార్యక్రమానికి పాన్ ఇండియా హీరో ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా వస్తుండటంతో అభిమానుల్లో ఫుల్ జోష్ కనిపిస్తుంది. తన బావమరిది నార్నె నితిన్ 'మ్యాడ్ స్క్వేర్'తో వరుసగా హ్యాట్రిక్ కొట్టడంతో ఆయన ఎలాంటి కాంప్లిమెంట్స్ ఇస్తారో చూడాలి.ఏప్రిల్ 4న హైదరాబాద్లోని శిల్పా కళా వేదికలో 'మ్యాడ్ స్క్వేర్' సక్సెస్ సెలబ్రేషన్స్ జరిపేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేశారు. శుక్రవారం సాయింత్రం 6గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎన్టీఆర్ రాత్రి 8గంటలకు అక్కడికి చేరుకోవచ్చని తెలుస్తోంది. ఎన్టీఆర్తో చిత్ర నిర్మాత నాగవంశీకి మంచి సాన్నిహిత్యం ఉన్న విషయం తెలిసిందే. గతంలో 'మ్యాడ్' ట్రైలర్ను రిలీజ్ చేసిన తారక్ ఇప్పుడు 'మ్యాడ్ స్క్వేర్' సక్సెస్ సెలబ్రేషన్స్కు ముఖ్య అతిథిగా వస్తున్నారు. -
వీకెండ్ విన్నర్ 'మ్యాడ్ స్క్వేర్'..4 రోజుల కలెక్షన్ ఎంతంటే?
ఉగాది-రంజాన్ కానుకగా థియేటర్లలోకి నాలుగైదు సినిమాలు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం మ్యాడ్ స్క్వేర్ మూవీ ఫుల్ డామినేషన్ చూపిస్తోంది. వస్తున్న కలెక్షన్సే దీనికి ఉదాహరణగా చెప్పొచ్చు. ఇప్పటికే లాభాల్లోకి వెళ్లిపోయిన ఈ చిత్రం.. రూ.100 కోట్లకు చేరువలో ఉంది.(ఇదీ చదవండి: దమ్ముంటే నన్ను, నా సినిమాలను బ్యాన్ చేయండి: నాగవంశీ)తాజాగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్ ప్రకారం.. 4 రోజుల్లో ఈ సినిమాకు రూ.69.4 కోట్ల గ్రాస్ కలెక్షన్ వచ్చినట్లు పేర్కొన్నారు. చాలా తక్కువ బడ్జెట్ తో తీసిన ఈ సినిమాకు తొలిరోజు వచ్చిన టాక్, ఇప్పుడు వస్తున్న వసూళ్లకు ఏ మాత్రం సంబంధం లేదని చెప్పొచ్చు. ఓవర్సీస్ లోనూ ఇప్పటికే మిలియన్ డాలర్ మార్క్ వసూళ్లు దాటేసింది.ప్రస్తుతం ఊపు చూస్తుంటే ఈ వీకెండ్ అయ్యేసరికి రూ.100 కోట్ల మార్క్ దాటేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇకపోతే ఈ చిత్రానికి మూడో భాగం కూడా ఉందని చివర్లో ప్రకటించారు. మరి అది ఎప్పుడు తీసి రిలీజ్ చేస్తారో చూడాలి?(ఇదీ చదవండి: యంగ్ హీరోయిన్ చెల్లి పెళ్లి.. ఫొటోలు వైరల్!) -
దమ్ముంటే నన్ను, నా సినిమాలను బ్యాన్ చేయండి: నాగవంశీ
ఇటీవల విడుదలైన ‘మ్యాడ్ స్క్వేర్’ (mad square) చిత్రం మంచి టాక్తో దూసుకెళ్తోంది. మూడురోజుల్లోనే ఈ మూవీ రూ. 50.2 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి ఈ మధ్యకాలం అత్యధిక వసూళ్లను రాబట్టిన చిన్న చిత్రంగా రికార్డు సృష్టించింది. బ్రేక్ ఈవెన్ సాధించడంతో పెంచిన టికెట్ల ధరను సాధారణ స్థాయికి తీసుకువచ్చామని నిర్మాత సూర్యదేవర నాగవంశీ( Suryadevara Naga Vamsi) తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమా గురించి నెగెటివ్ ప్రచారం చేస్తున్న వారిపై గ్రహం వ్యక్తం చేశాడు. సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నప్పుడు దాన్ని ఎందుకు ప్రోత్సహించరని ఆయన ప్రశ్నించారు.‘సినిమా రిలీజ్ తర్వాత రివ్యూలు వచ్చాయి. అప్పుడు ప్రెస్ మీట్పెట్టాను కానీ నేను ఏమీ మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్ల పని వాళ్లు చేశారు అనుకున్నాను. కానీ, సినిమా బాగా ఆడుతున్నప్పటికీ.. ఆ రివ్యూల మీద సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ‘కంటెంట్ లేకపోయినా సీక్వెల్ కాబట్టి ఆడుతోందని అంటున్నారు. ఈ సినిమ ఎలా ఉన్నా చూడటానికి ఇదేమైనా ‘బాహుబలి2’, ‘పుష్ప2’, ‘కేజీఎఫ్2’ కాదు కదా! సినిమా ఆశించినంత లేకపోయినా చూడటానికి ఇందులో నటించిన వాళ్లేమీ పెద్ద హీరోలు కాదు. ‘మ్యాడ్ స్క్వేర్’ బాగుంది కాబట్టి చూస్తున్నారు. వేరే మూవీలు బాగోలేవని దీన్ని చూడటం లేదు. ఇది అందరూ తెలుసుకోవాలి. కంటెంట్ లేదు. సెకండాఫ్ పండలేదని అంటున్నారు. నేను థియేటర్లో చాలాసార్లు సినిమా చూశా. ప్రేక్షకుల నుంచి స్పందన బాగుంది. జనాలకు తెలిసినంత బాగా రివ్యూవర్లకు తెలియడం లేదా?మీరు (మీడియా) మేమూ కలిసి పనిచేయాలి. నేను సినిమాలు తీసి విడుదల చేస్తేనే మీ వెబ్సైట్స్ రన్ అవుతున్నాయి. నేను ఇంటర్వ్యూలు ఇస్తేనే మీ యూట్యూబ్ ఛానళ్లు పనిచేస్తున్నాయి. మేము ప్రకటనలు ఇస్తేనే మీ సైట్స్ పనిచేస్తాయి. దమ్ముంటే నా సినిమాలు బ్యాన్ చేసి చూపించండి. నా సినిమా ఆర్టికల్స్ రాయకండి. నా సినిమాను ఎలా ప్రమోట్ చేసుకోవాలో నాకు బాగా తెలుసు.సినిమాలు ఆడితేనే మీరూ ఉంటారు. లేకపోతే ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది. అది గుర్తుపెట్టుకుని ప్రవర్తించండి’ అని నాగవంశీ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
కలెక్షన్స్ లో మ్యాడ్ స్క్వేర్ మ్యాజిక్.. పోటీ ఇవ్వలేకపోయిన నితిన్
-
నేను అందుకున్న గొప్ప ప్రశంస అదే: కల్యాణ్ శంకర్
‘‘మ్యాడ్’ సినిమా ఎక్కువగా యువతకి చేరువైంది. ఆ చిత్రానికి సీక్వెల్గా రూపొందిన ‘మ్యాడ్ స్క్వేర్’ మూవీని యువతతో పాటు, కుటుంబ ప్రేక్షకులు కూడా ఆదరిస్తున్నారు.. ఎంజాయ్ చేస్తున్నారు’’ అని డైరెక్టర్ కల్యాణ్ శంకర్ తెలిపారు. నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ హీరోలుగా నటించిన చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’. కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. సూర్యదేవర నాగవంశీ సమర్పణలో హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం మార్చి 28న విడుదలైంది.ఈ సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.55 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టినట్లు ప్రకటించారు మేకర్స్. ఈ నేపథ్యంలో సోమవారం కల్యాణ్ శంకర్ విలేకరులతో మాట్లాడుతూ–‘‘మ్యాడ్ స్క్వేర్’లో పెద్ద కథ ఆశించి సినిమాకి రాకండి, సరదాగా నవ్వుకోవడానికి రండి’ అని ముందే చెప్పడం మాకు చాలా ప్లస్ అయింది. రాజమౌళిగారు కూడా సినిమా మొదలుపెట్టే ముందే కథ ఇలా ఉండబోతుంది అని చెబుతుంటారు. అలా చెప్పడం వల్ల ప్రేక్షకులను మనం ముందే ప్రిపేర్ చేసినట్టు అవుతుంది. మా ఫ్రెండ్ వాళ్ల అమ్మ పదిహేనేళ్ల తర్వాత థియేటర్లో చూసిన సినిమా ‘మ్యాడ్ స్క్వేర్’. ‘సినిమా చూస్తున్నప్పుడు నవ్వి నవ్వి కళ్లల్లో నీళ్లు తిరిగాయి’ అని ఆమె చెప్పడం నేను అందుకున్న గొప్ప ప్రశంస. ఇతర నిర్మాతల నుంచి కూడా నాకు అవకాశాలు వస్తున్నాయి. కానీ, నాగవంశీగారితో నాకు మంచి ర్యాపో ఉండటంతో ఆయనతోనే వరుస సినిమాలు చేస్తున్నాను. రవితేజగారితో నేను చేయబోయే సినిమాలోనూ కచ్చితంగా వినోదం ఉంటుంది’’ అన్నారు. -
'మ్యాడ్ స్క్వేర్' మూడురోజుల్లోనే కలెక్షన్ల రికార్డ్స్ క్లబ్లో ఎంట్రీ
మ్యాడ్ స్క్వేర్(Mad Square) సినిమాతో బాక్సాఫీస్ను షేక్ చేస్తున్నారు. మార్చి 28 సినిమా విడుదలైన ఈ మూవీ భారీ కలెక్షన్ల దిశగా దూసుకెళ్తుంది. థియేటర్స్ రన్లో గట్టి పోటీ ఉన్నప్పటికీ నవ్వులు, పంచ్ డైలాగ్స్తో మ్యాడ్ గ్యాంగ్ దుమ్మురేపుతున్నారు. అందరి అంచనాలను దాటేసి ఎవరూ ఊహించలేని కలెక్షన్లను ఈ సినిమా రాబడుతుంది. మ్యాడ్ స్క్వేర్ చిత్రం కేవలం మూడోరోజుల్లోనే ఫస్ట్ మైలురాయిని దాటేసింది.2023లో విడుదలైన హిట్ సినిమా ‘మ్యాడ్’ (Mad) చిత్రానికి ఇది కొనసాగింపుగా మ్యాడ్ స్క్వేర్ చిత్రాన్ని దర్శకుడు కల్యాణ్ శంకర్ తెరకెక్కించారు.నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ మరోసారి తమ కామెడీ టైమింగ్తో ప్రేక్షకులను థియేటర్స్కు రప్పిస్తున్నారు. సూర్యదేవర హారిక, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని సుమారు రూ. 10 కోట్లకు పైగా బడ్జెట్తో నిర్మించారు. అయితే, మూడురోజుల్లోనే ఈ మూవీ రూ. 50.2 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మొదటిరోజే రూ. 20.8 కోట్లు, రెండో రోజు రూ. 16.4 కోట్లు, మూడోరోజు రూ. 13 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే, నేడు రంజాన్ ఉంది కాబట్టి మ్యాడ్ స్క్వేర్ కలెక్షన్స్ మరింతగా పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. ఓవర్సీస్లో కూడా ఈ మూవీ సత్తా చాటుతుంది. అక్కడ వన్ మిలియన్ డాలర్ల క్లబ్లో చేరింది. ఇలా ప్రపంచవ్యాప్తంగా మ్యాడ్ గ్యాంగ్ పిచ్చెక్కిస్తోంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. -
'మ్యాడ్ స్క్వేర్'కి ఊహించని కలెక్షన్స్.. రెండు రోజుల్లో ఎంతంటే?
ఈసారి ఉగాది కానుకగా థియేటర్లలోకి నాలుగు సినిమాలు వచ్చాయి. వీటిలో రెండు స్ట్రెయిట్ తెలుగు మూవీస్ కాగా, రెండు డబ్బింగ్ బొమ్మలు. కానీ వీటిలో మ్యాడ్ స్క్వేర్ మాత్రమే ప్రేక్షకుల దగ్గర నుంచి సూపర్ రెస్పాన్స్ అందుకుంది. దీంతో కలెక్షన్స్ కూడా అదే రేంజులో వచ్చాయి. ఏకంగా రెండో రోజుకే లాభాల్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: థియేటర్లలో రిలీజ్ కి ముందే పైరసీ.. పాపం 'సికందర్')2023లో మ్యాడ్ మూవీ రిలీజైనప్పుడు.. ఎవరికీ పెద్దగా అంచనాల్లేవు. అప్పుడే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దీంతో సీక్వెల్ పై హైప్ బాగానే ఏర్పడింది. మొదటితో దానితో పోలిస్తే అక్కడక్కడ లోటుపాట్లు ఉన్నప్పటికీ యూత్ అంతా దీనికే ఓటు వేస్తున్నారు. కామెడీ మూవీ కావడం కూడా దీనికి ప్లస్ అయింది.అలా మ్యాడ్ స్క్వేర్ మూవీకి రెండు రోజుల్లో రూ.37.2 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేశారు. తొలిరోజు ఎంతొచ్చిందనేది మాత్రం బయటపెట్టలేదు. ఈ సినిమా ఓవర్సీస్ లోనూ ($850k) మిలియన్ డాలర్ వసూళ్లకు దగ్గరగా ఉంది. ట్రెండ్ చూస్తుంటే లాంగ్ రన్ లో రూ.100 కోట్ల మార్క్ చేరినా సరే ఆశ్చర్యపోనక్కర్లేదు.(ఇదీ చదవండి: ప్రభాస్ 'స్పిరిట్'.. ఫారెన్ పోలీస్?)They came. They saw. They went full MAD 🔥🔥#MADSquare hits 37.2Cr Worldwide Gross in 2 days 💥💥Wishing you all a very #HappyUgadi ✨#BlockBusterMaxxMadSquare is turning this festive season into a MAD CELEBRATION at theatres ❤️🔥❤️🔥@NarneNithiin #SangeethShobhan… pic.twitter.com/U9zor9ABrZ— Sithara Entertainments (@SitharaEnts) March 30, 2025 -
ఆ సినిమా క్లోజింగ్ కలెక్షన్లకు దగ్గరగా 'మ్యాడ్ స్క్వేర్' డే-1 నంబర్స్
మ్యాడ్ స్క్వేర్(Mad Square) సినిమాతో థియేటర్స్లో నవ్వులు పూయించిన మ్యాడ్ గాంగ్.. బాక్సాఫీస్ వద్ద మొదటిరోజే భారీ కలెక్షన్స్తో రికార్డ్ క్రియేట్ చేశారు. 2023లో విడుదలైన హిట్ సినిమా ‘మ్యాడ్’ (Mad) చిత్రానికి ఇది కొనసాగింపుగా మార్చి 28 సినిమా విడుదలైంది. ఈ చిత్రానికి కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ మరోసారి తమ కామెడీ టైమింగ్తో ప్రేక్షకులను మెప్పించారు. సూర్యదేవర హారిక, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.మ్యాడ్ స్క్వేర్ మూవీని ప్రపంచవ్యాప్తంగా 650కి పైగా థియేటర్లలో గ్రాండ్గా రిలీజ్ చేశారు. అయితే, ఈ సినిమా మొదటిరోజే బాక్సాఫీస్ వద్ద రూ. 20.8 కోట్ల గ్రాస్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. తాజాగా చిత్ర యూనిట్ అధికారికంగా ఈ విషయాన్ని తెలిపింది. సినిమా విడుదల సమయంలో నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ మ్యాడ్ సినిమా క్లోజింగ్ కలెక్షన్లకు దగ్గరగా మ్యాడ్ స్క్వేర్ మొదటిరోజు కలెక్షన్లు ఉంటాయని చెప్పారు. ఇప్పుడు ఆయన మాటే నిజం అయిందని నెటిజన్లు అంటున్నారు. 2023లో విడుదలైన మ్యాడ్ సినిమా క్లోజింగ్ కలెక్షన్లు రూ. 26 కోట్లు అని తెలిసిందే. (ఇదీ చదవండి: 'మ్యాడ్ స్క్వేర్' మూవీ రివ్యూ)ఈ వారంలో బాక్సాఫీస్ వద్ద గట్టిపోటీనే ఉంది. లూసిఫర్-2, వీర ధీర శూర, రాబిన్ హుడ్ వంటి సినిమాలు థియేటర్స్లో ఉన్నాయి. ఇలాంటి పోటీ సమయంలోనూ మ్యాడ్ స్క్వేర్ భారీ ఓపెనింగ్స్ని రాబట్టింది. మ్యాడ్ పార్ట్-1 కోసం రూ. 8 కోట్ల ఖర్చుతో తెరకెక్కిస్తే రూ. 26 కోట్లు రాబట్టింది. ఇప్పుడు సీక్వెల్ కోసం రూ. 10 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే, మొదటిరోజే మ్యాడ్ స్క్వేర్ రూ. 20.8 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. -
సినిమా చూస్తూ నవ్వుతూనే ఉన్నారు: హారిక సూర్యదేవర
‘మ్యాడ్ స్క్వేర్’ని కాలేజ్ స్టూడెంట్స్తోపాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూస్తూ నవ్వుతూనే ఉన్నారు. ఇలా మా కష్టానికి తగ్గ ఫలితం దక్కడం హ్యాపీగా ఉంది’’ అని హారిక సూర్యదేవర తెలిపారు. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ హీరోలుగా నటించిన చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’. కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. సూర్యదేవర నాగవంశీ సమర్పణలో హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ– ‘‘మ్యాడ్ స్క్వేర్’ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.అన్ని షోలు హౌస్ఫుల్ అవుతున్నాయి. కొన్ని ఏరియాల్లో ‘మ్యాడ్’ మూవీ క్లోజింగ్ కలెక్షన్స్ ‘మ్యాడ్ స్క్వేర్’కి మాత్రం మొదటి రోజే వచ్చే అవకాశం ఉంది’’ అన్నారు. ‘‘థియేటర్లో ప్రేక్షకులంతా ఎంజాయ్ చేస్తుంటే... దీనికోసమే కదా మనం సినిమా తీసింది అనే అనుభూతి కలిగింది’’ అని కల్యాణ్ శంకర్ పేర్కొన్నారు. ‘‘థియేటర్లో ప్రేక్షకులు గోల చేసుకుంటూ సినిమా చూస్తుంటే మాటల్లో చెప్పలేనంత ఆనందం కలిగింది’’ అన్నారు నార్నే నితిన్.‘‘మా సినిమాపై ఇంతటి ప్రేమ కురిపిస్తున్న ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు’’ అని రామ్ నితిన్ చెప్పారు. ‘‘ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన పట్ల చాలా ఆనందంగా ఉన్నాం’’ అన్నారు సంగీత్ శోభన్. ‘‘ఇలాంటి విజయవంతమైన సినిమాలో భాగం కావడం సంతోషంగా ఉంది’’ అని ప్రియాంక జవాల్కర్ తెలిపారు. -
'మ్యాడ్ స్క్వేర్' మూవీ రివ్యూ
టైటిల్ : మ్యాడ్ స్క్వేర్నటీనటులు: నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, శుభలేఖ సుధాకర్, మురళీధర్ గౌడ్, తదితరులునిర్మాణ సంస్థలు: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్నిర్మాతలు: సూర్యదేవర హారిక, సాయి సౌజన్యసమర్పకులు: ఎస్. నాగ వంశీఎడిటింగ్: నవీన్ నూలిదర్శకత్వం, కథ: కల్యాణ్ శంకర్ సంగీతం: భీమ్స్ సిసిరోలియో, తమన్సినిమాటోగ్రఫీ: శామ్దత్విడుదల: మార్చి 28, 2025'మ్యాడ్ స్క్వేర్'తో(Mad Square) మరోసారి నవ్వులు పూయించేందుకు నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ థియేటర్స్లోకి వచ్చేశారు. 2023లో విడుదలైన హిట్ సినిమా ‘మ్యాడ్’ (Mad) చిత్రానికి ఇది కొనసాగింపుగా ఉంది. కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహించగా.. సూర్యదేవర హారిక, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. నేడు (మార్చి 28) సినిమా విడుదలైంది. కాలేజీ నేపథ్యంతో పరిచయం అయిన కొందరు స్నేహితులు వారి చదువులు పూర్తి అయిన తర్వాత మళ్లీ ఒకచోట కలిస్తే వారి అల్లరి ఎలా ఉంటుందో ఈ చిత్రంలో చూపించారు. రాయల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాల(RIE)లో చదువుకోవడం ఇష్టం లేక ఓ విద్యార్థి పారిపోయే సంఘటన నుంచి మ్యాడ్ పార్ట్-1 కథ మొదలవుతుంది. ఫైనల్గా ఆ విద్యార్థి RIEలోనే చదివి తీరుతాననే నిర్ణయంతో కథ ముగుస్తుంది. ఇప్పుడు లడ్డు గాడి పెళ్లితో మ్యాడ్ స్క్వేర్ కథ ప్రారంభమౌతుంది. కాలేజీ నుంచి తమ చదవులు పూర్తి చేసిన తర్వాత వారు ఏం చేశారనేది మ్యాడ్ స్క్వేర్లో ఫుల్ ఫన్తో దర్శకుడు చూపించాడు.కథేంటంటే..ఈ కథలో పెద్దగా లాజిక్స్ అంటూ ఏమీ ఉండవ్.. దానిని దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రాన్ని చూస్తే ఎంజాయ్ చేస్తారని చెప్పవచ్చు. అశోక్ (నార్నె నితిన్), మనోజ్(రామ్ నితిన్), దామోదర్(సంగీత్ శోభన్),లడ్డు(విష్ణు) నలుగురు స్నేహితులు ఇంజనీరింగ్ పూర్తి అయిన తర్వాత విడిపోతారు. కానీ, లైఫ్లో సెటిల్ కాకుండా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. లడ్డు(విష్ణు) పెళ్లి నుంచి ఈ సినిమా అసలు కథ మొదలౌతుంది. స్నేహితులకు చెప్పకుండా లడ్డు పెళ్లికి రెడీ అయిపోతాడు. ఈ విషయం తెలుసుకున్న అతని మిత్రులు వేడక సమయంలో సడెన్గా ఎంట్రీ ఇస్తారు. ఈ క్రమంలో అక్కడ భారీగా ఫన్ మొదలౌతుంది. లడ్డుకు ఎలాగైనా పెళ్లి చేయాలని తండ్రి మురళీధర్ గౌడ్ ఎదురు కట్నం ఇచ్చి సంబంధం సెట్ చేస్తాడు. ఈ క్రమంలో ఆ పెళ్లి చెడిపోకూడదని లడ్డూ ఫ్యామిలీ పడే పాట్లు నవ్వులు తెప్పిస్తాయి. ఫ్రెండ్ పెళ్లి ఘనంగా చేయాలని దామోదర్, అశోక్, మనోజ్ అనేక ప్లాన్స్ వేస్తుంటారు. వారి హంగామాకు తోడు పెళ్లికూతురు ఫ్యామిలీ నుంచి లడ్డూకు ఎదురయ్యే అవమానాలు కడుపుబ్బా నవ్విస్తాయి. తన స్నేహితులు చేసే తుంటరి పనుల వల్ల ఆ పెళ్లిలో చాలా గందరగోళం నెలకొంటుంది. పెళ్లి జరుగుతున్నంత సేపు ఎక్కడ ఆ కార్యక్రమం ఆగిపోతుందో అనే భయంతో లడ్డు ఉంటాడు. సరిగ్గా పెళ్లి అవుతుందని సమయంలో లడ్డు స్నేహితులతో పాటు వచ్చిన ఒక వ్యక్తితో పెళ్లికూతురు వెళ్లిపోతుంది. ఈ విషయం తెలిశాక లడ్డూ ఇంట్లో జరిగే పంచాయితీ, అక్కడ మ్యాడ్ గ్యాంగ్ చేసే అతి ఫుల్గా నవ్విస్తుంది. దీంతో తీవ్ర నిరాశలో ఉన్న లడ్డు కోసం కాస్త రిలాక్స్ ఇవ్వాలని వారందరూ గోవా ట్రిప్ ప్లాన్ చేసుకుంటారు. వారు ఎంట్రీ ఇచ్చాక గోవా మ్యూజియంలో విలువైన లాకెట్ను గోవాలో పెద్ద డాన్గా ఉన్న మ్యాక్స్ (సునీల్) మనుసులు దొంగలిస్తారు. దానిని లడ్డు బ్యాచ్ చేశారని పోలీసులు అనుమానిస్తారు. దీంతో వారిపై నిఘా ఉంచుతారు. అయితే, ఒక ఘటనలో ఆ లాకెట్ లడ్డు చేతికి దొరుకుతుంది. దీంతో దానిని తిరిగి తెచ్చివ్వాలని లడ్డు తండ్రిని మ్యాక్స్ కిడ్నాప్ చేస్తాడు. ఈ కేసును చేధించేందుకు ఒక ఐపీఎస్ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. లడ్డు బ్యాచ్లో ఉన్న ఆ అధికారి ఎవరు..? లడ్డుని పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి మరో అబ్బాయితో ఎందుకు వెళ్లిపోయింది...? వారిద్దరూ కూడా గోవాకే ఎందుకు వెళ్తారు..? చివరిగా ఆ లాకెట్ కథ ఏంటి.. ఎవరి వద్ద ఉంటుంది..? ఫైనల్గా లడ్డును తన స్నేహితుడే జైలుకు ఎందుకు పంపుతాడు..? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..?మ్యాడ్ స్క్వేర్ విడుదలకు ముందే నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. ఈ సినిమాలో కథ గురించి పెద్దగా ఏమీ ఉండదని తెలిపారు. ఆయన చెప్పినట్లుగానే కథ బలం ఉండదు. కానీ, నవ్వులతో వంద శాతం ఎంటర్టైన్ చేస్తారు. ప్రతి సీన్లో వరుస పంచ్లతో నవ్విస్తారు. డీడీ, లడ్డు గ్యాంగ్ కావాల్సినంత హంగామా చేస్తారు. ఆద్యంతం ఎక్కడా విసుగు లేకుండా ప్రతి సన్నివేశంలో వారు వినోదాన్ని పంచుతారు. పార్ట్-1లో కాలేజి క్యాంపస్ను ఎంచుకున్న దర్శకుడు.. పార్ట్లో లడ్డు గాడి పెళ్లి, గోవా కాన్సెప్ట్ను ప్రధానంగా ఎంచుకున్నాడు. యువతను ఆకట్టుకునేలా ఫుల్ పంచ్లతో సినిమా ఉంటుంది. ఎలాంటి డబుల్ మీనింగ్ డైలాగ్స్ లేకుండా ప్రేక్షకులకు వినోదాన్ని పంచాడు దర్శకుడు కల్యాణ్ శంకర్. కాలేజీలో మొదలైన స్నేహం.. ఆ తర్వాత కూడా ఎంత మధురంగా ఉంటుందో లడ్డు కథతో దర్శకుడు చెప్పాడు. (ఇదీ చదవండి: ‘రాబిన్హుడ్’ మూవీ రివ్యూ)ఈ కథలో ప్రధాన పాత్రధారులైన మనోజ్, అశోక్, దామోదర్ల పేర్లలోని మొదటి అక్షరాలను తీసుకొని మ్యాడ్ అనే టైటిల్ పెట్టి హిట్ కొట్టాడు. ఇప్పుడు దానికి లడ్డుగాడి కథన కలిపి మ్యాడ్ స్క్వేర్ చేశాడని చెప్పవచ్చు. సెకండాఫ్లో కథ గోవా షిఫ్ట్ అయ్యాక ఇంకాస్త స్పీడ్ పెంచాడు దర్శకుడు. ఫస్టాఫ్ అంతా లడ్డు పెళ్లితో ఫుల్ ఎంటర్టైన్ చేస్తే రెండో భాగం కాస్త ఫన్ నెమ్మదిస్తుంది. మ్యాక్స్ గ్యాంగ్ చేసే దొంగతనం మ్యాడ్ గ్యాంగ్కు చుట్టుకోవడం. ఆపై లడ్డూ తండ్రిని మ్యాక్స్ కిడ్నాప్ చేయడం.. ఆయన్ని ఎలాగైనా కాపాడాలని డీడీ, లడ్డూ, అశోక్, మనోజ్ చేసే ప్రయత్నాలు సెకండాఫ్లో ఉంటాయి.సునీల్, లడ్డు ఫాదర్ మురళీధర్ మధ్య సీన్స్ బాగున్నాయి. సత్యం రాజేష్ పోలీసు పాత్ర నుంచి వచ్చే ప్రతి సీన్ కాస్త ఫోర్స్డుగా ఉంటుంది. సినిమాలో హిట్ సాంగ్ స్వాతిరెడ్డి కూడా సరైన పాయింట్లో లేదు అనిపిస్తుంది. ప్రియాంక జవల్కార్ను కామియో రోల్ ఇచ్చారు. కానీ, అంత ఎట్రాక్ట్ అనిపించలేదు. లడ్డు మీద వరుస పంచ్లు పడుతున్నా సరే సినిమాను ఫుల్ స్వింగ్లో నడిపించాడని చెప్పవచ్చు. అక్కడక్కడ మినహాయిస్తే.. విసుగు లేకుండా ప్రతి సన్నివేశంలో ఫుల్ వినోదం ఉంటుంది. రెండు గంటలపాటు బాగా ఎంజాయ్ చేసే థియేటర్ నుంచి ప్రేక్షకుల బయటకు వస్తారని చెప్పవచ్చు.ఎవరెలా చేశారంటే..?మ్యాడ్-1లో చాలా పాత్రలు ఉంటాయి.. అక్కడ అన్ని క్యారెక్టర్స్కు ప్రాధాన్యత ఉంటుంది. కానీ, ఇందులో కొన్నింటికి తక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. నార్నె నితిన్ తనదైన స్టైల్లో సెట్ అయిపోయాడు. లడ్డూగా విష్ణు తన నటన తీరుతో నూటికి నూరు మార్కులు కొట్టేశాడు. ఈ సినిమాకు ప్రధాన బలం లడ్డునే అని చెప్పవచ్చు. సంగీత్ శోభన్ డీడీగా తన వేగం ఎక్కడా తగ్గనివ్వకుండా పంచ్ డైలాగ్స్ పేలుస్తూనే ఉంటాడు. ఎక్కడా కూడా తన ఎనర్జీ తగ్గకుండా మెప్పిస్తాడు. మనోజ్ పాత్రలో రామ్ నితిన్ సైలెంట్గా లవర్ బాయ్లా తన ఫెయ్యిల్యూర్ స్టోరీ చెబుతూ చుట్టేస్తూ ఉంటాడు. రఘుబాబు, మురళీధర్ గౌడ్లు తమ పాత్రల పరిధి మేరకు నవ్వులు పంచారు. జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ మరోసారి అతిథి పాత్రలో కనిపించింది కొద్దిసేపు మాత్రమే అయినప్పటికీ ప్రేక్షకులతో విజిల్స్ వేపించేలా చేశాడు. మ్యాక్స్ పాత్రలో సునీల్ విలనిజమే కాకుండా కామెడీని కూడా పండించాడు. శుభలేఖ సుధాకర తన పాత్ర పరిమితిమేరకు పర్వాలేదు. మ్యాడ్ స్క్వేర్ కథలో పెద్దగా బలం లేకున్నప్పటికీ దర్శకుడు కల్యాణ్ శంకర్ తెరకెక్కించిన విధానం బాగుంది. కానీ, సంభాషణల విషయంలో బలవంతంగా నవ్విద్దాం అనేలా కొన్ని సీన్లు ఉన్నాయి. పాటల విషయంలో భీమ్స్ ఇంకాస్త శ్రద్ధ పెట్టింటే బాగుండు. తమన్ బీజీఎమ్ కూడా పెద్దగా వర్కౌట్ కాలేదని చెప్పవచ్చు. శ్యామ్ దత్ సినిమాటోగ్రఫి సూపర్ అనిచెప్పవచ్చు. నిర్మాణం పరంగా ఉన్నంతమేరకు బాగుంది. నిర్మాతలు సూర్యదేవర హారిక, సాయి సౌజన్యలకు మ్యాడ్ స్క్వేర్ మంచి విజయాన్ని ఇచ్చే సినిమా అని చెప్పవచ్చు. -
'మ్యాడ్ స్క్వేర్' మూవీ ట్విటర్ రివ్యూ
మ్యాడ్ స్క్వేర్తో(Mad Square) నవ్వులు పూయించేందుకు థియేటర్స్లోకి నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ మరోసారి ఎంట్రీ ఇచ్చేశారు. 2023లో విడుదలైన హిట్ సినిమా ‘మ్యాడ్’ (Mad) చిత్రానికి ఇది కొనసాగింపుగా ఉంది. కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహించగా.. సూర్యదేవర హారిక, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. నేడు (మార్చి 28) సినిమా విడుదలైంది. ఇప్పుటికే ఓవర్సీస్లో మూవీని చూసిన సినీ అభిమానులు మ్యాడ్ స్క్వేర్ సినిమా గురించి ఎక్స్ వేదికగా పోస్ట్లు చేస్తున్నారు. కాలేజీ నేపథ్యంతో పరిచయం అయిన కొందరు స్నేహితులు వారి చదువులు పూర్తి అయిన తర్వాత మళ్లీ ఒకచోట కలిస్తే వారి అల్లరి ఎలా ఉంటుందో ఈ చిత్రంలో చూపించారు. మ్యాడ్ స్క్వేర్ చిత్రానికి ప్రధాన బలం ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ , సంతోష్ శోభన్ సోదరుడు సంగీత్ శోభన్ అని తెలిసిందే.మ్యాడ్ స్క్వేర్ సినిమా ఇప్పటికే అమెరికా, లండన్, ఆస్ట్రేలియా వంటి నగరాల్లో షోలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. గతంలో మ్యాడ్ సినిమా వచ్చిన పాజిటివ్ రివ్యూలే ఇప్పుడు కూడా సోషల్మీడియాలో కనిపిస్తున్నాయి. కానీ, ప్రస్తుతం ఇంటర్వెల్ వరకు మాత్రమే షో పూర్తి అయిందని వారు చెబుతున్నారు. ఇప్పటి వరకు అయితే బొమ్మ అదిరిపోయిందని తెలుపుతున్నారు. డీడీ, లడ్డు పాత్రలు మళ్లీ దుమ్మురేపాయని కామెంట్లు పెడుతున్నారు. ఫస్టాఫ్కు మంచి మార్కులే పడుతున్నాయి. కానీ, సెకండాఫ్కు అంతగా రెస్పాన్స్ రావడం లేదని ట్వీట్లతో చెబుతున్నారు.'మ్యాడ్ స్క్వేర్' కథ గురించి అడగొద్దని నిర్మాత నాగవంశీ విడుదలకు ముందే చెప్పాడు. థియేటర్స్లో సినిమా చూసిన వారు అది నిజమే అని చెబుతున్నారు. కానీ, సినిమా ప్రారంభం నుంచే సుమారు 30 నిమిషాలకు పైగా నాన్ స్టాప్గా నువ్వులు తెప్పిస్తారని వారు చెప్పుకొస్తున్నారు. దర్శకుడు కళ్యాణ్ శంకర్ మరోసారి హిట్ రైడ్ చేశాడని తెలుపుతున్నారు. స్టోరీ లైన్ వరకు డైరెక్టర్ వెళ్లినా కూడా అది వర్కౌట్ కాలేదని చెబుతున్నారు. 'లడ్డు గాడి పెళ్లి' నేపథ్యంలో వచ్చే సీన్స్ అన్నీ చాలా ఎక్కువ ఫన్ అందించాయని అందరూ చెబుతున్నారు. టాక్సీవాలా హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ క్యారెక్టర్ ఈ సినిమాలో చాలా స్పెషల్ సర్ప్రైజ్ ఇస్తుందని చెబుతున్నారు. సెకండాఫ్ కాస్త ఇబ్బందేసినిమా డల్ అయిన ప్రతిసారి కామెడీ పంచ్లను ప్రేక్షకుల ముందుకు తెచ్చారట. ఫుల్ కామెడీగా ఉన్నప్పటికీ అక్కడక్కడా డల్ మూమెంట్స్ కూడా ఉన్నాయని చెబుతున్నారు. ఈ సినిమాలో కథ లేదంటూ కామెడీకే అధిక ప్రాధాన్యం ఇచ్చామని చెప్పిన కొన్ని సన్నివేశాల్లో మాత్రం బలవంతంగా కామెడీ రుద్దినట్లు అనిపిస్తుంది. గోవా ఎపిసోడ్ బాగా ఉంటుందని అనుకుంటే అది అంతగా వర్కౌట్ కాలేదని చెబుతున్నారు. లడ్డుగాడి కామెడీ బావుంది కానీ ఆశించిన మేరకు లేదని కొందరు డిసప్పాయింట్ అవుతున్నారు. ఫస్టాఫ్లో ఉన్నంత ఎనర్జీ సెకండాఫ్లో కనిపించదని చెబుతున్నారు. ప్రతిదానికి కామెడీ చేయాలని చూడటం అంతగా కనెక్ట్ కాలేదని చెబుతున్నారు. రెబ్బా మోనికా జాన్ స్పెషల్ సాంగ్ సూపర్ అంటున్నారు. ఈ సినిమాకు ఆశించినంత స్థాయిలో మ్యూజిక్ కూడా లేదని చెబుతున్నారు. ఓవరాల్గా సినిమా యావరేజ్గా ఉందని నెటిజన్లు చెబుతున్నారు. యూత్కు కనెక్ట్ అయితే బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబడుతుందని చెబుతున్నారు. ఈ అభిప్రాయం నెటిజన్లది మాత్రమే.. పూర్తి రివ్యూ మరికొంత సమయంలో సాక్షి. కామ్లో మరికొంత సమయంలో వస్తుంది. #MADSquare Good 1st Half! The first half runs on the lead characterizations and well written dialogues. The comedy in the wedding sequence worked very well. Laddu is the show stealer so far. Apart from a few drops here and there, the comedy works well. 2nd Half awaits!— Venky Reviews (@venkyreviews) March 28, 2025Very good first half. The director infused comedy in every scene. The entire marriage sequence which lasts for 30 minutes is a LAUGH RIOT. Watch it for this segment. All the actors did well but it is LADDU who steals the show in first half. Waiting for second half!#MADSquare pic.twitter.com/1eGRZh09kH— sharat 🦅 (@sherry1111111) March 28, 2025#MadSquare Good 1st half with bad 2nd half.#Robinhood okayish 1st half with Very good 2nd half .#Mad2— Narendra News (@Narendra4News) March 27, 2025#MADSquare Hilarious Ride. 🤣🤣🤣🔥🔥Crazy first half, Laddoo being the show stealer, while DD being DD. Laughed throughout the marriage episode. 👌🏻👌🏻Every cameo worked out very well. Sunil’s part is too good in second half. Music and energy levels haven’t dropped at all.… pic.twitter.com/08WabFlIV2— appie 🎀 (@fizz_nandamuri) March 28, 2025 -
‘మ్యాడ్ స్క్వేర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
'మ్యాడ్ స్క్వేర్' ట్రైలర్ రిలీజ్.. మీరు చూశారా?
ఈ వీకెండ్ రిలీజయ్యే సినిమాల్లో కాస్తంత ఎక్కువ బజ్ ఉన్న సినిమా మ్యాడ్ స్క్వేర్. 2023లో రిలీజైన చిత్రానికి ఇది సీక్వెల్. ఇప్పటికే జోరుగా ప్రమోషన్స్ జరుగుతుండగా.. తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. టీజర్ లానే ఇది కూడా ఫన్నీగా ఉంది.(ఇదీ చదవండి: రష్మిక ఆస్తి ఎన్ని కోట్లు? ఏమేం ఉన్నాయి?)కొన్నిరోజుల క్రితం రిలీజైన టీజర్.. అద్భుతమైన స్పందన తెచ్చుకుంది. ఇప్పుడు ట్రైలర్ లోనూ పంచులు, ప్రాసలు మరీ అంత కాకపోయినా బాగానే ఉన్నాయి. టీజర్ చివర్లో ఓకే బాయ్ అన్నట్లు.. ఇందులోనూ నేను గర్ల్స్ అయితేనే మాట్లాడుతా అని లడ్డు క్యారెక్టర్ చెప్పడం బాగుంది. నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. కల్యాణ్ శంకర్ దర్శకుడు. నాగవంశీ నిర్మాత. మార్చి 28న మూవీ థియేటర్లలోకి వస్తోంది.(ఇదీ చదవండి: పరువు పోతుందని భయపడ్డాను.. ఒకప్పటి హీరోయిన్ సుహాసిని) -
మార్చిలో థియేటర్ మూవీస్.. హిట్ కొడితే చాలు!
మార్చి అంటేనే పరీక్షల సీజన్. నెల చివర్లో తప్పితే మిగతా రోజుల్లో సినిమాలు సరిగా రిలీజ్ కావు. కానీ ఈ సారి మాత్రం స్ట్రెయిట్, డబ్బింగ్ చిత్రాలు 10 వరకు ఉన్నాయి. ఇవి కాకుండా పలు రీ రిలీజులు కూడా ఉన్నాయండోయ్. ఇంతకీ ఏంటవి? వాటి సంగతేంటి?మార్చి తొలివారంలో కింగ్ స్టన్, ఛావా, ఆఫీసర్ ఆన్ డ్యూటీ అనే డబ్బింగ్ సినిమాలతో పాటు నారి అనే తెలుగు మూవీ రాబోతుంది. వీటిలో 'ఛావా'పైనే అంచనాలు ఉన్నారు. దేశవ్యాప్తంగా సెన్సేషన్ సృష్టిస్తున్న ఈ మూవీకి తెలుగులో ఎలాంటి ఆదరణ దక్కుతుందో చూడాలి?(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 20 సినిమాలు)రెండో వారంలో నాని నిర్మించిన 'కోర్ట్', కిరణ్ అబ్బవరం 'దిల్ రుబా', హిందీ మూవీ 'డిప్లమాట్' విడుదలవుతాయి. వీటిలో దేనిపైన పెద్దగా అంచనాల్లేవు.మూడో వారంలో ఇప్పటివరకైతే ఏ సినిమాలు లేవు. నాలుగో వారంలో మాత్రం లూసిఫర్ సీక్వెల్ 'ఎల్ 2: ఎంపురన్' మార్చి 27న, నితిన్ రాబిన్ హుడ్ 28న, మ్యాడ్ స్క్వేర్ 29న థియేటర్లలోకి వస్తాయి. వీటిలో మ్యాడ్ 2పైనే కొద్దో గొప్పో అంచనాలు ఉన్నాయి.(ఇదీ చదవండి: రెండు వారాలకే ఓటీటీలోకి వచ్చేస్తున్న 'బాపు')మార్చి 28న పవన్ కల్యాణ్ 'హరిహర వీరమల్లు' రిలీజ్ అవుతుందని నిర్మాతలు అంటున్నారు. కానీ షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు కాబట్టి అయ్యే అవకాశాలు అస్సలు లేవని చెప్పొచ్చు. అలానే మార్చిలోని సినిమాలకు హిట్ టాక్ వస్తే లాభాలు వచ్చేస్తాయి. ఎందుకంటే అన్నీ చిన్న బడ్జెట్ చిత్రాలే!వీటితో పాటు సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, సలార్ లాంటి సినిమాలు కూడా ఇదే నెలలో రీ రిలీజ్ కానున్నాయి.(ఇదీ చదవండి: 'కన్నప్ప' కొత్త టీజర్ రిలీజ్.. ఈసారి మాత్రం) -
రెట్టింపు వినోదం
సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో కల్యాణ్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న యూత్ఫుల్ ఎంటర్టైనర్ ‘మ్యాడ్ స్క్వేర్’. ఈ కాంబినేషన్లోనే రూపొందిన హిట్ ఫిల్మ్ ‘మ్యాడ్ (2023)’కు సీక్వెల్గా ‘మ్యాడ్ స్క్వేర్’ రూపొందుతోంది. సూర్యదేవర నాగవంశీ సమర్పణలో హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.తొలి భాగానికి కూడా వీరే నిర్మాతలనే సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాను మార్చి 29న రిలీజ్ చేయనున్నట్లుగా ప్రకటించారు. ‘‘ప్రేక్షకులు ఊహించినదానికంటే రెట్టింపు వినోదం ఈ సినిమాలో ఉంటుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: భీమ్స్ సిసిరోలియో. -
థియేటర్లలో రిలీజ్కు ముందే ఓటీటీ ఫిక్స్.. ఆ టాలీవుడ్ సినిమాలివే!
సినీ ఇండస్ట్రీలో ఇప్పుడంతా ఓటీటీల హవానే నడుస్తోంది. దీంతో సినీ ప్రియులంతా కుటుంబంతో కలిసి మూవీ వీక్షించేందుకు సరికొత్త వేదికగా మారింది. ఈ నేపథ్యంలో కొత్త కొత్త చిత్రాలు ఓటీటీల్లో ఇప్పటికే సందడి చేస్తున్నాయి. అయితే ఈ రోజుల్లో కొన్ని థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఓటీటీకి వస్తే.. మరికొన్ని చిన్న చిత్రాలు డైరెక్ట్గా ఓటీటీలోనే విడుదల చేస్తున్నారు.అయితే ఈ సంక్రాంతి సందర్భంగా టాలీవుడ్ సినిమాలు రిలీజ్కు ముందే ఓటీటీ ఫ్లాట్ఫామ్ను ఫిక్స్ చేసుకున్నాయి. ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ప్లిక్స్ వెల్లడించింది. ఇంతకీ ఆ సినిమాలేవో మీరు ఓ లుక్కేయండి.గతంలో విడుదలైన మ్యాడ్ మూవీ సూపర్ హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ మూవీకి సీక్వెల్గా మ్యాడ్ స్క్వేర్ కూడా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా థియేటర్లో ఇంకా విడుదల కాలేదు. రిలీజ్ తర్వాత నెట్ఫ్లిక్స్లోనే స్ట్రీమింగ్ కానుంది. సంక్రాంతి సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు.దీంతో పాటు డీజే టిల్లు ఫేమ్ హీరో సిద్ధు జొన్నల గడ్డ నటిస్తోన్న తాజా చిత్రం జాక్. ఈ సినిమా కూడా నెట్ఫ్లిక్స్లోనే స్ట్రీమింగ్ కానుందని పోస్టర్ రిలీజ్ చేశారు. మరో టాలీవుడ్ హీరో ప్రియదర్శి పులికొండ నటిస్తోన్న కోర్టు మూవీ కూడా ఈ ఓటీటీలోనే రానుంది. అలాగే రవితేజ హీరోగా వస్తున్న మాస్ జాతర, నవీన్ పొలిశెట్టి హీరోగా వస్తోన్న అనగనగా ఒక రాజు, పవన్ కల్యాణ్ ఓజీ చిత్రాల హక్కులను కూడా నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. పొంగల్ కానుకగా ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ రివీల్ చేసింది.Brace yourself for a mass jathara from the one and only Mass Maharaja! Mass Jathara, coming to Netflix in Telugu, Tamil, Malayalam & Kannada, after its theatrical release! #NetflixPandaga pic.twitter.com/zUpUbt2SdV— Netflix India South (@Netflix_INSouth) January 14, 2025 Grab your gold, the King is getting married! 🤭 Anaganaga Oka Raju, coming to Netflix, in Telugu, Tamil, Malayalam & Kannada, after its theatrical release! #NetflixPandaga pic.twitter.com/fewgneVXv8— Netflix India South (@Netflix_INSouth) January 14, 2025 The truth is on trial, and one lawyer is determined to prove it. ⚖️ Court: State vs A Nobody, coming to Netflix, in Telugu, Tamil, Kannada, Malayalam & Hindi, after its theatrical release! #NetflixPandaga pic.twitter.com/HzHtBdITgc— Netflix India South (@Netflix_INSouth) January 14, 2025 No plan, no limits, only guts 💥 Jack, coming to Netflix in Telugu, Tamil, Malayalam, Kannada & Hindi, after its theatrical release! #NetflixPandaga pic.twitter.com/90hJsZEYKd— Netflix India South (@Netflix_INSouth) January 14, 2025The boys are back with double the MADness! 🔥 Mad Square, coming to Netflix, in Telugu, Tamil, Kannada, Malayalam & Hindi, after its theatrical release! #NetflixPandaga pic.twitter.com/vW4nedPEsB— Netflix India South (@Netflix_INSouth) January 14, 2025 -
దుమ్ముదులిపేసిన మ్యాడ్ స్క్వేర్ ఐటెం పాప ‘రెబా మోనికా జాన్’ (ఫోటోలు)
-
ఓటీటీలో 'మ్యాడ్' ఫేమ్ అనంతిక థ్రిల్లర్ సినిమా
'మ్యాడ్' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న అనంతిక సనీల్కుమార్ తమిళ్ నటించిన రైడ్ సినిమా ఓటీటీలో విడుదల కానుంది. ఈ చిత్రం తెలుగులో కూడా స్ట్రీమింగ్ కానున్నడంతో ఆమె అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ చిత్రంగా గతేడాదిలో థియేటర్లోకి వచ్చిన ఈ మూవీ అనుకున్నంత స్థాయిలో మెప్పించలేకపోయింది. ఈ సినిమాలో శ్రీదివ్య ప్రధాన హీరోయిన్గా నటించిగా.. విక్రమ్ ప్రభు హీరోగా మెప్పించారు.రైడ్ టైటిల్తో కోలీవుడ్లో విడుదలైన ఈ సినిమా ఆహా ఓటీటీలో అదే పేరుతో తెలుగులో స్ట్రీమింగ్ కానుంది. అక్టోబర్ 19 నుంచి ఈ మూవీ అందుబాటులో ఉండనుందని ఒక పోస్టర్ను విడుదల చేశారు. కన్నడలో శివరాజ్కుమార్ హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమా 'తగారు'కు రీమేక్గా రైడ్ తెరకెక్కించారు.అనంతిక సనీల్కుమార్ కోసమే ఈ చిత్రాన్ని చూసేందుకు తెలుగు ప్రేక్షకుల ఆసక్తిచూపుతున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్తో మ్యాడ్ సినిమాలో కనిపించిన ఈ బ్యూటీకి టాలీవుడ్లో మంచి ఆదరణే లభించింది. ఆమె చేతిలో మ్యాడ్ స్క్వేర్, 8 వసంతాలు మూవీస్ ఉన్నాయి. తక్కువ సమయంలోనే మైత్రీ మూవీ మేకర్స్ వంటి భారీ బ్యానర్లో ఆమె ప్రధాన పాత్రలో ఛాన్స్ దక్కించుకుంది. -
మ్యాడ్ బ్లాక్బస్టర్ అవుతుంది
సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్కుమార్, గోపికా ఉద్యాన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మ్యాడ్’. సూర్యదేవర హారిక నిర్మాతగా పరిచయం అవుతూ, సాయి సౌజన్య సహ–నిర్మాతగా కల్యాణ్ శంకర్ దర్శకత్వంలో రూ΄÷ందిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ఓ ముఖ్య అతిథిగా హాజరైన దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ– ‘‘మ్యాడ్’ ట్రైలర్ నిజంగానే మ్యాడ్గా, చాలా ఫన్నీగా ఉంది. నటీనటులు ఎవరూ కొత్తవాళ్లలా లేరు. ‘మ్యాడ్’ చిత్రం బ్లాక్ బస్టర్ అవుతుంది’’ అన్నారు. మరో అతిథి సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ– ‘‘మ్యాడ్’ స్టోరీ లైన్ నాకు తెలుసు. సినిమాను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు. ‘‘గుంటూరు కారం’ సెట్స్లో ‘మ్యాడ్’ ప్రస్తావన విన్నాను. ‘మ్యాడ్’ చిత్రం ‘మ్యాడ్’గా ఉంటుందట’’ అన్నారు శ్రీ లీల. ‘నా ఫ్రెండ్ అనుదీప్ లేక΄ోతే నేను లేను’’ అన్నారు కల్యాణ్ శంకర్. -
యూత్ఫుల్ మ్యాడ్ – నాగవంశీ
‘‘మ్యాడ్’ యూత్ఫుల్ సినిమా అయినప్పటికీ కుటుంబమంతా చూసేలా ఉంటుంది. లాజిక్లు, ట్విస్ట్లు ఉండవు. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు నవ్వుతూనే ఉంటారు. ‘జాతి రత్నాలు’ చిత్రం కంటే ఒక్కసారైనా తక్కువ నవ్వానని ఎవరైనా చెబితే.. టిక్కెట్ డబ్బులు వెనక్కి ఇచ్చేస్తాం’’ అని నిర్మాత నాగవంశీ అన్నారు. రామ్ నితిన్, సంగీత్ శోభన్, నార్నే నితిన్, శ్రీ గౌరీప్రియా రెడ్డి, అనంతిక సనీల్ కుమార్, గోపికా ఉద్యన్ కీలక పాత్రల్లో కల్యాణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మ్యాడ్’. సూర్యదేవర నాగవంశీ సమర్పణలో హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 6న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో దర్శకుడు అనుదీప్ మాట్లాడుతూ–‘‘నా ‘జాతిరత్నాలు’ కంటే ‘మ్యాడ్’ బాగా నచ్చింది’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో వినోదం మాత్రమే ఉంటుంది’’ అన్నారు కల్యాణ్ శంకర్. -
మ్యాడ్తో ఎంట్రీ!
నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, గౌరీ ప్రియా రెడ్డి, అనతిక సునీల్ కుమార్, గోపికా ఉద్యన్ ముఖ్య తారలుగా నటిస్తున్న చిత్రం ‘మ్యాడ్’. కల్యాణ్ శంకర్ దర్శకుడు. సితార ఎంటర్టైన్మెంట్స్పై రూపొందుతున్న ఈ సినిమా ద్వారా నిర్మాతలు చినబాబు కుమార్తె, నాగవంశీ సోదరి హారిక సూర్యదేవర నిర్మాతగా ఎంటర్ అవుతున్నారు. ఎస్. నాగవంశీ సమర్పణలో హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ‘‘యూత్ఫుల్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న చిత్రమిది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్, కెమెరా: షామ్దత్ సైనుద్దీన్, దినేష్ కష్ణన్ బి. -
మీ ఇంట్లో పిల్లలు స్మార్ట్ఫోన్ వాడుతున్నారా?.. అయితే ఈ హెచ్చరిక మీకోసమే!
జైపూర్: ప్రస్తుత రోజుల్లో మొబైల్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఏ ఇంట చూసినా స్మార్ట్ఫోన్ దర్శనమిస్తున్నాయి. ఈ మొబైల్ వల్ల ఉపయోగాలు ఎన్ని ఉన్నాయో.. నష్టాలు కూడా అన్నే ఉన్నాయి. ఇంట్లో పసిపిల్లలు ఉంటే వీటి వల్ల ఎదురయ్యే అనర్థాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొబైల్ తమకు ఇవ్వకపోతే పిల్లలు మారాం చేసి మరీ తల్లిదండ్రుల నుంచి తీసుకొంటున్నారు. చిన్నవయసులో వరకు ఇది ఆమోదమే గానీ కాస్త ఎదిగిన పిల్లలకు ఇది శాపంగా మారుతోంది. వాళ్లు ప్లేస్టోర్ల నుంచి వివిధ రకాల ఆటలు ఇన్స్టాల్ చేసి ఆడుతూ చాలా సమయం వాటితోనే గడుపుతున్నారు. ఇలా ఆడుతూ ఆడుతూ.. స్మార్ట్ఫోన్లకు బానిసైన పిల్లల్లో కొందరు అరుదైన వ్యాధుల బారినపడుతున్నారు. రాజస్థాన్లో అల్వార్కు చెందిన దాదాపు పదేళ్ల బాలుడు మతిస్థిమితం కోల్పోయాడు. ఏకంగా అతడి పరిస్థితి ఎలా మారిందంటే.. ఆన్లైన్ గేమ్ ఆడాలని పట్టుబట్టడం వల్ల చాలాసార్లు బలవంతంగా కట్టివేయాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఓ బాలుడికి అతని తల్లిదండ్రులు ఏడు నెలల క్రితం ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ కొనిచ్చారు. జనవరి 2023 నుండి, అతను ఫోన్తో ఇంట్లోనే ఉంటాడు. తల్లిదండ్రులు ఉదయాన్నే తమ తమ పనులకు వెళ్లేవారు. ఆ తర్వాత 14 ఏళ్ల చిన్నారి ఇంట్లో ఒంటరిగా ఉంటూ మొబైల్లో 14 నుంచి 15 గంటల పాటు ఫైర్ ఫ్రీ అనే మొబైల్ గేమ్ను ఆడుతుండేది. గత ఆరు నెలలుగా పబ్జీ (PUBG) ఫ్రీ ఫైర్ ఆడుతున్న ఆ బాలుడు తీవ్రమైన మానసిక, శారీరక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నాడు. అతను మానసిక స్థితి చాలా వరకు క్షీణించింది. చివరికి నిద్రలో కూడా గేమ్ ఆడుతున్నట్లు భావించడం మొదలుపెట్టాడు. మరలా ఆ బాలుడిని మామూలుగా మార్చేందుకే చికిత్సలో భాగంగా అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ, ఎటువంటి పురోగతి కనిపించలేదు. చివరికి చేసేదేమిలేక బాలుడి కుటుంబం అతన్ని అల్వార్ మేధో వికలాంగుల రెసిడెన్షియల్ స్కూల్లో చేర్చారు. అక్కడ అతని మానసిక స్థితిని మెరుగుపరిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అక్కడ కౌన్సెలర్లు అతనికి సహాయం చేస్తున్నారు. సైకియాట్రిస్ట్, ఇతర వైద్యుల బృందం కూడా దానిపై పని చేస్తోంది. చదవండి: ఫ్లైట్లో ప్రయాణికుడి వీరంగం.. సిబ్బందిపై దాడి చేసి.. బాత్రూం డోర్ పగులగొట్టి.. -
మా సినిమా చూడకుండా కామెంట్స్ చేయకండి
MAD Movie Pre Release Event: ‘‘సినిమా విడుదల ముందు వరకే చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా ఉంటుంది. చిన్న సినిమా అయినా బాగుంటే పెద్ద సినిమా అవుతుంది. ‘మ్యాడ్’ మంచి విజయం సాధించాలి’’ అని నిర్మాత టి. రామ సత్యనారాయణ అన్నారు. మాధవ్ చిలుకూరి, స్పందన పల్లి, రజత్ రాఘవ్, శ్వేతావర్మ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మ్యాడ్’. లక్ష్మణ్ మేనేని దర్శకత్వం వహించారు. టి. వేణుగోపాల్ రెడ్డి, బి. కృష్ణారెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 6న రిలీజవుతోంది. ప్రీ రిలీజ్ వేడుకలో లక్ష్మణ్ మేనేని మాట్లాడుతూ– ‘‘మ్యాడ్’ రెగ్యులర్ చిత్రంలా ఉండదు. సినిమా చూసి, బాగుంటే తోటివారికి కూడా చెప్పండి’’ అన్నారు. ‘‘మేమంతా చాలా నమ్మకంతో ‘మ్యాడ్’ చేశాం. మా మూవీ థియేటర్లో రిలీజ్ అవుతుండటం హ్యాపీ’’ అన్నారు మాధవ్ చిలుకూరి. ‘‘మా సినిమా చూడకుండా కామెంట్స్ పెట్టకండి.. సినిమా చూశాకే స్పందించాలని నా విన్నపం’’ అన్నారు రజత్ రాఘవ్. ‘‘కరోనా టైమ్లో మా చిత్రం ద్వారా ఓ 50 మందికి ఉపాధి కల్పించాననే సంతృప్తి ఉంది. ఈ సినిమా సక్సెస్ అయితే మరో సినిమా చేసే నమ్మకం వస్తుంది’’ అన్నారు నిర్మాత కృష్ణారెడ్డి. -
కైలాష్ ఖేర్ ‘సూఫీ పాట’కి మంచి స్పందన
ప్రస్తుత జనరేషన్ని ప్రతిబింబించేలా పెళ్లి, సహజీవనంలో ఉన్న రెండు జంటల కథతో రాబోతున్న చిత్రం ‘మ్యాడ్’. ఈ మూవీ ఫస్ట్ లుక్ని ఇటీవల చిత్ర బృందం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఫస్ట్లుక్లో అందరినీ ఆకర్షించిన మ్యాడ్ మూవీ తాజాగా ఓ సుఫీ పాటతో తన ప్రత్యేకతను చాటుకుంది. తెలుగు పాటల్లో చాలా అరుదుగా కనిపించే సుఫీ పాట ‘మ్యాడ్’ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ‘బందిషీ ఖాతల్ దిల్ కీ’ అంటూ సాగే ఈ పాట కైలాష్ ఖేర్ పాడారు. ఈ పాటతో కైలాష్ ఖేర్ గొంతు తెలుగు ప్రేక్షకుల మనసులో శాశ్వత స్థానం సంపాదించుకుంది. మోహిత్ రెహ్మానిక్ స్వరపరచిన ఈ సుఫీని శ్రీమాన్ శ్రీమనస్వి రచించారు. మోదెల టాకీస్ బ్యానర్పై టి. వేణు గోపాల్ రెడ్డి, బి. కృష్ణారెడ్డి నిర్మాతలుగా.. లక్ష్మణ్ మేనేని దర్శకత్వంలో రూపోందిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రస్తుతం వేగంగా జరుపుకుంటోంది. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాలో మాధవ్ చిలుకూరి, స్పందన పల్లి, రజత్ రాఘవ్, శ్వేతవర్మ లీడ్ రోల్స్లో కనిపించనున్నారు. ‘కైలాష్ ఖేర్ ఈ పాటను పాడటానికి ఒప్పుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. సినిమాలో ఓ ఎమోషనల్ సన్నివేశంలో ఈ పాట వస్తుంది. కథలోని ఫీల్కి సుఫీ పాట అయితే కొత్తగా ఉంటుందని అనుకున్నాం. మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చిన ట్యూన్ చాలా బాగుంది. కైలాష్ ఖేర్ పాట విన్నాక మాకు చాలా సంతోషంగా ఉంది’ అని డైరెక్టర్ లక్ష్మణ్ మేనేని అన్నారు. -
‘ ఆ మంత్రిని పిచ్చోడని అంటున్నారు’
పశ్చిమ గోదావరి జిల్లా : టీడీపీ, బీజేపీ నేతల మధ్య ఈ నడుమ మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా టీడీపీ ప్రభుత్వంలో మంత్రి అయిన బీజీపీ నేత మాణిక్యాల రావు మీద టీడీపీ నేత, జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు మండిపడ్డారు. మంత్రి మాణిక్యాల రావును ఆయన నియోజకవర్గ ప్రజలు పిచ్చోడని అంటున్నారని బాపిరాజు ఎద్దేవా చేశారు. నిట్కు సంబంధించి శంకుస్థాపన సమయంలో వేసిన శిలాఫలకం మినహా ఇప్పటి వరకూ ఒక్క రాయి కూడా వేయలేని అసమర్ధుడు మంత్రి మాణిక్యాల రావు అని సంబోధించారు. మంత్రి గారి అనుచరుల వల్లే అవినీతి పెరిగిందని ఆరోపించారు. ఆరుగోలను గ్రామంలో జరిగిన నీరు-చెట్టు కార్యక్రమంలో మంత్రి అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. తాడేపల్లి గూడెం, నల్లజర్ల మండలాల్లో జరిగిన అభివృద్ధి దేశవ్యాప్తంగా మరెక్కడైనా జరిగిందా అని ప్రశ్నించారు. తాను అవినీతి పాల్పడినట్లు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని సవాల్ విసిరారు. -
ఆలస్యంగా నిద్రిస్తే పిచ్చెక్కే ప్రమాదం!
లండన్ : ఆలస్యంగా నిద్రపోవడం ఇప్పుడు సాధారణంగా మారిపోయింది. అర్ధరాత్రి దాటేదాకా టీవీలు, స్మార్ట్ఫోన్లతో గడిపి ఆ తర్వాత ఎప్పటికో పడుకోవడం.. తెల్లారి ఆలస్యంగా నిద్రలేచి హడావుడి పడడమూ నిత్యకృత్యమే! ఇలా ఆలస్యంగా నిద్రించేవాళ్లకు పిచ్చెక్కే ప్రమాదం ఉందని బ్రింగ్హాటన్ యూనివర్సిటీ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. నిద్ర చాలకపోతే అనారోగ్యాలు పాలయ్యే ప్రమాదం ఉందనే విషయం తెలిసిందే! దీంతోపాటు హార్మోన్ల ఉత్పత్తిలో తేడాలు, మానసిక సమస్యలు కూడా ఎదురవుతాయని తెలిపారు. ఈమేరకు మానసిక సమస్యలతో బాధపడుతున్న 20 మందిని వర్సిటీ శాస్త్రవేత్తల బృందం పరీక్షించింది. ఈ అధ్యయనంలో వాళ్ల మానసిక అనారోగ్యానికి కారణం నిద్రలేమి అని తేలిందట! ఇక నిద్రలేమితో ఎదురయ్యే ఇతర అనారోగ్యాలు.. రాత్రి సరిగా నిద్రించకపోతే ఉదయం లేవగానే చేసిన పనినే మళ్లీ మళ్లీ చేయడం, హింసాత్మక ఆలోచనలు, భయం లేకపోవడం, పొంతనలేని వాగుడు, ఆత్మహత్య ఆలోచనలూ చేస్తారని శాస్త్రవేత్తలు తెలిపారు. -
మతిస్థిమితం లేని గర్భిణి ఆత్మహత్య
శెట్టూరు: మాకొడికి తండాకు చెందిన మతిస్థిమితం లేని సుగాలి లలితమ్మ (32) అనే గర్భిణి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి జానకమ్మ తెలిపిన మేరకు... లలితమ్మకు కర్ణాటకలోని పావగడ తాలూకా పళకహళ్లికి చెందిన రాజానాయక్తో వివాహమైంది. వీరికి ఏడాదిన్నర కిందట తొలికాన్పులో అనారోగ్యంతో బిడ్డ పుట్టి మరణించాడు. ప్రస్తుతం లలితమ్మ ఏడు నెలల గర్భిణి. మతిస్థిమితం లేని ఈమె మూడు రోజుల క్రితం పురుగుల మందు తాగింది. విషయం తెలుసుకున్న తల్లి, బంధువులు హుటాహుటిన అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున ఆస్పత్రిలో మృతి చెందింది. తల్లి ఫిర్యాదు మేరకు శెట్టూరు ఎస్ఐ శ్రీకాంత్ కేసు నమోదు చేసుకున్నారు. -
పిచ్చికుక్క స్వైర విహారం
– నలుగురికి తీవ్ర గాయాలు వలిగొండ : మండలంలోని ప్రొద్దటూరులో ఆదివారం ఉదయం పిచ్చికుక్క స్వైర విహారం చేసి నలుగురి తీవ్రంగా గాయపరి చింది. గాయపడిన వారిలో దుబ్బ నర్సింహ, స్వామి, రాజయ్య, సాయి ఉన్నారు. వీరిలో నర్సింహ, స్వామిని 108లో, రాజయ్య, సాయిని ప్రైవేట్ వాహనంలో భువనగిరి ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లి అక్కడి నుంచి హైదరాబాద్లోని కోరంటి వైద్యశాలకు తరలించారు. కుక్క మనుషులతో పాటు పది గేదెలు, ఒక మేకను కరిచింది. దీంతో గ్రామస్తులు కుక్కను వెంటాడి చంపేశారు. కాగా, బాధితులను జెడ్పీటీసీ మొగుళ్ల శ్రీనివాస్, మాద శంకర్, తుమ్మల వెంకట్రెడ్డి, వంగాల భిక్షపతి పరమార్శించారు. -
రైల్వే స్టేషన్లలో చిరుతపులుల సంచారం!
ముంబై: 'లోకల్ రైల్వే స్టేషన్లలో చిరుత సంచారం' వార్తలు ముంబై వాసులను కాసేపు హడలగొట్టేశాయి. వేలమంది జనం, సాయుధ రైల్వే పోలీసుల నడుమ రైల్వే స్టేషన్ లో చిరుతపులి సంచారం సాధ్యమేనా? అనుకుంటూ యధావిధిగా స్టేషన్లకు వెళ్లినవారికి నిజంగానే పులల చిత్తరువులు కనిపించాయి. ఖర్, బోరీవ్యాలీ లోకల్ స్టేషన్ ఫ్లాట్ ఫామ్ మెట్లపై ఠీవిగా నిల్చున్న చిరుతపులి బొమ్మలు చూసి అవాక్కయిన ప్రయాణికులు.. వాటిని గీసినవాళ్లను మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. అంత అందంగా కుదిరాయా చిత్తరువులు. ఒక్క చిరుతపులేకాదు జీబ్రా, ఉదయిస్తున్న సూర్యుడు, పచ్చని చెట్లు తదితర బొమ్మలు స్టేషన్ గోడలపై అలరిస్తున్నాయి. రద్దీ ప్రదేశాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం సృష్టించేందుకు మేక్ ఎ డిఫరెన్స్(ఎంఏడీ) అనే స్వచ్ఛంద సంస్థ ఈ చిత్తరువుల పనిని చేపట్టింది. ఒక్క రైల్వే ష్టేషన్లేకాక నేషనల్ హైవేలు, బీచ్ లు, పార్కుల వంటి పబ్లిక్ ప్లేసెస్ లోనూ అందమైన బొమ్మలు ఫ్రీగా గీసిపెట్టేందుకు సిద్ధమవుతోంది ఎంఏడీ. ఖర్, బోరీవ్యాలీ స్టేషన్లలో కనువిందు చేస్తోన్న ఈ చిత్రరాజాలను రైల్వే మంత్రి సురేశ్ ప్రభు త్వరలోనే అధికారికంగా ప్రారంభించనున్నారు. -
'చంద్రబాబుకు ఆ పిచ్చి పీక్ స్టేజ్కి చేరింది'
హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైఎస్ఆర్ సీపీ నేత బత్తుల బ్రహ్మానందరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబుకు పబ్లిసిటీ పిచ్చి పట్టిందని, ఆ పిచ్చి కాస్తా పీక్ స్టేజ్కి చేరిందని ధ్వజమెత్తారు. బుధవారం పార్టీ కార్యాలయంలో బత్తుల బ్రహ్మానందరెడ్డి విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఉద్యోగుల జీతాలకే డబ్బులు లేవన్న చంద్రబాబు, తన ప్రచారానికి మాత్రం వందల కోట్లు ఖర్చు చేస్తున్నారని మండిపడ్డారు. రాజధాని శంకుస్థాపన పేరుతో రూ.కోట్లు ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. గోదావరి పుష్కరాలలో రూ.1650 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తే అందులో రూ.1400 కోట్లు దుర్వినియోగం అయ్యాయని బత్తుల బ్రహ్మానందరెడ్డి అన్నారు. ఓటుకు కోట్లు కేసు నుంచి బయటపడేందుకే రాజధాని శంకుస్థాపనకు కేసీఆర్ను ఆహ్వానిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. పథకాల పేరుతో వందల కోట్లు దోచుకుంటున్నారని అన్నారు. రాజధాని శంకుస్థాపనకు వస్తున్న అథితులకు వాళ్ల సొంత హోటల్స్లో విడిది ఏర్పాటు చేసి ప్రజలు, ప్రభుత్వ సొమ్ము ఖర్చు పెడుతున్నారని బత్తుల ఆరోపించారు. -
రోజు రోజుకు పెరుగుతున్న కల్లు బాదితులు
-
‘పవనిజం’ సినిమా స్టిల్స్
-
సైకో చేష్టలతో ఇబ్బంది పడ్డ రోగులు
-
దిగ్విజయ్ సింగ్కు మతిభ్రమించింది: మైసూరా
తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేఖ ఇచ్చిందన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలను ఆ పార్టీ బుధవారం ఖండించింది. బుధవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ సీనియర్ నాయకుడు ఎం.వి.మైసూరారెడ్డి మాట్లాడుతూ... దిగ్విజయ్ సింగ్ మాటలు పూర్తిగా అసత్యమని ఆయన పేర్కొన్నారు. ఓ వేళ రాష్ట్ర విభజన జరిగితే ఇరు ప్రాంతాల్లోని అన్ని అంశాలను పరిగణలో తీసుకోవాలని, అలాగే అందరికి సమన్యాయం చేయాలని గతంలో దిగ్విజయ్ సింగ్ను కలసినప్పుడు సూచించామని ఆయన గుర్తు చేశారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ విభజనపై ఓ తండ్రిలా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని దిగ్విజయ్ సింగ్కు చెప్పామన్నారు. ఆల్పార్టీ మీటింగ్లో తాము చెప్పిన విషయాలను షిండే పక్కనపెట్టారని మైసూరారెడ్డి ఆరోపించారు. దిగ్విజయ్ సింగ్ మతి భ్రమించినట్లు మాట్లాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఓ సీనియర్ రాజకీయ నాయకుడు ఈ విధంగా మాట్లాడటం దౌర్బాగ్యమని మైసూరారెడ్డి పేర్కొన్నారు. -
దిగ్విజయ్ సింగ్కు మతిభ్రమించింది: మైసూరా