Minister KTR Responds To Helpless MBBS Student In Sakshi Special Story Via Twitter - Sakshi
Sakshi News home page

సాక్షి కథనం: విజయ్‌ చదువుకు కేటీఆర్‌ హామీ

Jul 21 2021 10:42 AM | Updated on Jul 21 2021 4:50 PM

Sakshi Special Story Effect In Warangal

సాక్షి, కేసముద్రం(వరంగల్‌): హాస్టల్‌ ఫీజు చెల్లించలేని ఓ గిరిజన ఎంబీబీఎస్‌ విద్యార్థి పరిస్థితిపై ఈ నెల 19న ‘సాయం చేయండి..ప్లీజ్‌’ కథనం ప్రచురితమైంది. వివరాల్లోకి వెళ్తే..హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న కేసముద్రంస్టేషన్‌కి చెందిన లవణ్‌పటేల్‌  సాక్షిలో  ప్రచురితమైన ‘సాయం చేయండి ప్లీజ్‌’ కథనాన్ని మంగళవారం మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్‌ స్పందించి, నేను చూసుకుంటానని ట్విట్టర్‌ ద్వారా హామీ ఇచ్చాడు.

కేటీఆర్‌ ఆఫీస్‌ అధికారులను కోఆర్డినేట్‌ చేయాలంటూ మంత్రి ఆదేశించారు. ఈ మేరకు కేటీఆర్‌ ఆఫీసు నుంచి  గోప్యాతండాలో నివాసం ఉండే  వ్యక్తికి  ఫోన్‌ చేసి తన వివరాలను అడిగారని, మళ్లీ త్వరలోనే సమాచారం అందిస్తామని చెప్పినట్లు ఎంబీబీఎస్‌ విద్యార్థి విజయ్‌ తెలిపారు.  తమ ఇబ్బందులను వెలుగులోకి తీసుకువచ్చిన సాక్షి దినపత్రికకు,  ట్విట్టర్‌ ద్వారా స్పందించి హామీ ఇచ్చిన మంత్రి కేటీఆర్‌కు విజయ్‌ కుటుంబ సభ్యులు  కృతజ్ఞతలు తెలిపారు.

     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement