
కేజీఎఫ్ దొంగలకు సంకెళ్లు
కృష్ణరాజపురం: బెంగళూరులోని కృష్ణరాజపురం పోలీసులు కార్యాచరణ చేపట్టి కేజీఎఫ్కు చెందిన ఇద్దరు ఘరానా దొంగలను అరెస్టు చేశారు. కేజీఎఫ్లోని హుసేన్పాళ్యకు చెందిన అజ్జు అలియాస్ జ్ఞానప్రకాష్, ఇనుప రాడ్డు సాయంతో తాళాలను పగులగొట్టి ఇళ్ల చోరీలకు పాల్పడేవాడు. ఇతని కుటుంబ సభ్యులందరిదీ చోరీనే వృత్తి. అజ్జుతో పాటు కేజీఎఫ్కు చెందిన మరొక ప్రముఖ చోరుడు నరసింహులును కూడా పోలీసులు సీసీ టీవీ ఫుటేజీల సాయంతో పట్టుకున్నారు. వారి నుంచి రూ.40 లక్షల విలువ చేసే 400 గ్రాముల బంగారు ఆభరణాలు, ఒక కేజీ వెండిని స్వాధీనపరచుకున్నారు. కేఆర్ పురం పరిధిలో పలు ఇళ్లలో దొంగతనాలు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టగా దొంగల ఆచూకీ బయటపడింది.
సీజ్ చేసిన నగలు

కేజీఎఫ్ దొంగలకు సంకెళ్లు

కేజీఎఫ్ దొంగలకు సంకెళ్లు