
అగ్నిమాపక కేంద్రానికి భూమిపూజ
రాయచూరు రూరల్: తాలూకా అభివృద్ధికి ప్రజల సహకారం అవసరమని విధానసభ సభ్యురాలు కరెమ్మ నాయక్ పేర్కొన్నారు. దేవదుర్గ తాలూకా అరకెరలో రూ.3 కోట్లతో నూతన అగ్నిమాపక కేంద్ర నిర్మాణానికి భూమిపూజ చేసి ఆమె మాట్లాడారు. భవిష్యత్తులో అరకెరలో పోలీస్ స్టేషన్, ఆస్పత్రుల నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు తాలూకాను అభివృద్ధి పరచడానికి పాటు పడతామన్నారు. అగ్నిమాపక అధికారులు మహేష్, తిమ్మారెడ్డి, రవీంద్ర, తహసీల్దార్ అమరేష్లున్నారు.
అక్రమ పాఠశాలల
రద్దుకు వినతి
రాయచూరు రూరల్: జిల్లాలో అక్రమంగా నడుస్తున్న పాఠశాలలను రద్దు చేయాలని నమ్మ కర్ణాటక సేనె సంఘం జిల్లాధ్యక్షుడు కొండప్ప డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో ఆయన మాట్లాడారు. విద్యార్థులను, పాలకులను వంచన చేస్తున్నారని ఆరోపించారు. మరుగుదొడ్లు లేకుండా ఉన్న పాఠశాలలు, అధికంగా డొనేషన్లు వసూలు చేస్తున్న, ఒకే గదిలో ఐదు తరగతులు నిర్వహిస్తున్న, అనుమతి లేకుండా నిర్వహిస్తున్న పాఠశాలలను, వేసవి శిబిరాలు, కోచింగ్, వసతి పాఠశాలలను నడిపిస్తున్న వాటిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు.
దళితుల ఆశాజ్యోతి అంబేడ్కర్
రాయచూరు రూరల్ : సమాజంలో బడుగు, బలహీన, దళిత వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అని రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు అభిప్రాయ పడ్డారు. మంగళవారం మాన్వి తాలూకా జాగీర్ పన్నూరులో 133వ జయంతిని ప్రారంభించి మాట్లాడారు. బడుగు, బలహీన, దళితుల ఆశాజ్యోతి అని, సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వం కోసం జీవితాంతం పోరాటం చేసిన మహా యోధుడని, ప్రపంచ మేధావుల్లో ఒకరని, ఆశయ సాధనకు అందరం కృషి చేద్దామన్నారు. సమావేశంలో మాన్వి శాసన సభ్యుడు హంపయ్య నాయక్, శరణయ్య, శాంతప్ప, జయన్న, బాలస్వామి, రుద్రప్ప, సుభాష్లున్నారు.
దాస సాహిత్యం సేవలు
అద్వితీయం
రాయచూరు రూరల్: సాహిత్య రంగానికి ప్రతి రూపం దాస సాహిత్యం అని ప్రధానోపాధ్యాయుడు మురళీధర్ కులకర్ణి పేర్కొన్నారు. మంగళవారం నందిని బీఈడీ కళాశాల ఆవరణలో తాలూకా కన్నడ సాహిత్య పరిషత్, కళాశాల ఆధ్వర్యంలో దత్తి ఉపన్యాస కార్యక్రమంలో మాట్లాడారు. కన్నడ సాహిత్యం ద్వారా కేవలం కన్నడ భాష, భూమి, నీటి కోసం ప్రయత్నిస్తే దాస సాహిత్యం మను ధర్మం, అన్యాయం, దౌర్జన్యం, అవినీతి, అసమానత, కుల మత భేదాలు లేకుండా మనమంతా ఒక్కటే అనే భావాన్ని పెంపొందించిందన్నారు. 64 మంది దాసులు సేవలు అందించారన్నారు. కార్యక్రమంలో కసాప అధ్యక్షుడు వెంకటేష్, ప్రిన్సిపాల్ అలీషా జోసెఫ్, వెంకటరావ్, వసుదేంద్ర, రావుత్ రావ్, విజయ రాజేంద్రలున్నారు.
రూ.14 లక్షల బంగారు
నగలు స్వాధీనం
యశవంతపుర: ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న నలుగురిని పోలీసులు కటకట్టాల్లోకి నెట్టారు. బెంగళూరు నగర పోలీసు కమిషనర్ దయానంద మంగళవారం వివరాలు వెల్లడించారు. బొమ్మనహళ్లి జేబిపాళ్యలో చోరీకి పాల్పడిన డీజెహళ్లికి చెందిన శబ్రీన్ తాజ్, రామయ్య లేఔట్కు చెందిన నీలోఫర్(22)ను అరెస్ట్ చేసి రూ.11లక్షల విలువైన 130 గ్రాముల బంగారం, ఆటో స్వాధీనం చేసుకున్నారు. మైక్రోలేఔట్ పోలీసుస్టేషన్ పరిధిలో రెండు ఇళ్లలో జరిగిన చోరీలకు సంబంధించి బేగూరు పటేల్ లేఔట్కు చెందిన రాజుదాస్(39), పశ్చిమ బెంగాల్కు చెందిన బేగూరు జేబన్ సర్కార్(29)ను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.3 లక్షల విలువైన 30 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు.

అగ్నిమాపక కేంద్రానికి భూమిపూజ

అగ్నిమాపక కేంద్రానికి భూమిపూజ

అగ్నిమాపక కేంద్రానికి భూమిపూజ