ఉగ్ర దాడిలో ఇద్దరు కన్నడిగుల బలి | - | Sakshi
Sakshi News home page

ఉగ్ర దాడిలో ఇద్దరు కన్నడిగుల బలి

Apr 23 2025 8:05 AM | Updated on Apr 23 2025 9:05 AM

ఉగ్ర దాడిలో ఇద్దరు  కన్నడిగుల బలి

ఉగ్ర దాడిలో ఇద్దరు కన్నడిగుల బలి

సాక్షి బెంగళూరు: జమ్ముకశ్మీర్‌ ఉగ్రవాదుల దాడిలో శివమొగ్గవాసి మంజునాథ్‌ రావు (47)తో పాటు మరో కన్నడిగుడు మరణించాడు. హావేరి జిల్లా రాణిబెన్నూరుకు చెందిన భరత్‌ భూషణ్‌గా గుర్తించారు. ఈయన మాజీ స్పీకర్‌ కేబీ కోళివాడ అల్లుడికి స్నేహితుడు. కాగా, జమ్మూకశ్మీర్‌లో కన్నడిగులు ఉగ్రదాడికి గురయ్యారనే వార్త విన్న వెంటనే కర్ణాటక సీఎం సిద్ధరామయ్య.. అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్య కార్యదర్శులు, సీనియర్‌ పోలీసు ఉన్నతాధికారుల నుంచి సమాచారం సేకరించి కన్నడిగుల కోసం తక్షణ సహాయం చేయాలని వారికి ముఖ్యమంత్రి సూచించారు. సీఎం సూచనల మేరకు అధికారుల బృందం ఒకటి కశ్మీర్‌కు పయనమైంది. పోలీసులు కూడా వెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement