మండ్య: గొర్రెలు ఎన్ని ఉన్నాయో లెక్కపెట్టడం రాదు, ఆయనను ఆర్థిక మంత్రిని ఎందుకు చేశారని నాడు విమర్శించారు. అయితే తాను మంత్రిగా, ముఖ్యమంత్రిగా బడ్జెట్ను ప్రవేశ పెట్టానని ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు. మంగళవారం జిల్లాలోని నాగమంగల తాలూకా దొడ్డబాల గ్రామంలో బీరదేవర జాతర మహోత్సవంలో సీఎం పాల్గొని మాట్లాడారు. తాను కురుబ కులంలో పుట్టినందుకు ఓ పత్రికలో తన గురించి గొర్రెలు లెక్క పెట్టడం రాదు, ఆర్థిక మంత్రిని ఎందుకు చేశారని రాశారని గుర్తు చేసుకున్నారు. విద్యావంతున్ని అయినందుకు తాను ముఖ్యమంత్రిని అయ్యానన్నారు. ఒకప్పుడు శూద్రులు సంస్కృతం నేర్చుకుంటే వారి చెవిలో కాచిన సీసాన్ని పోసేవారన్నారు. అయితే నేడు ఆ పరిస్థితి లేదన్నారు. మీ పిల్లలను విద్యావంతులను చేయకుంటే సమాజంలో మీకు గౌరవం లేదని అన్నారు.
కులగణనలో తేడాలు ఉండొచ్చు
కులగణనలో లోపాలుంటే సరిచేస్తాం, అభిప్రాయాలు తెలియజేయాలని కేబినెట్ మంత్రులను కోరాం, అయితే ఇంకా ఎవరూ ఇవ్వలేదు అని సిద్దరామయ్య తెలిపారు. గత సమీక్షకు, ఈ సమీక్షకు వ్యత్యాసం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయన్నారు. అయితే జనాభాలో హెచ్చుతగ్గుల వల్ల సర్వేలో వ్యత్యాసం అయి ఉండవచ్చన్నారు. మంత్రులు అభిప్రాయాలు తెలిపిన తర్వాత కేబినెట్లో నిర్ణయం తీసుకుంటామని సీఎం అన్నారు.
అని నన్ను హేళన చేశారు
సీఎం సిద్దరామయ్య