అండర్‌పాస్‌లో ఇరుక్కుపోయిన లారీ | - | Sakshi
Sakshi News home page

అండర్‌పాస్‌లో ఇరుక్కుపోయిన లారీ

Jun 2 2025 2:00 AM | Updated on Jun 2 2025 2:00 AM

అండర్‌పాస్‌లో ఇరుక్కుపోయిన లారీ

అండర్‌పాస్‌లో ఇరుక్కుపోయిన లారీ

తాడేపల్లి రూరల్‌: తాడేపల్లి పట్టణ పరిధిలోని ఎన్టీఆర్‌ కరకట్ట నుంచి సీతానగరం వచ్చే మార్గంలో బకింగ్‌హామ్‌ కెనాల్‌ వద్ద ఉన్న రైల్వే అండర్‌పాస్‌లో మరో సారి భారీ వాహనం ఆదివారం ఇరుక్కుపోయింది. సీతానగరం నుంచి ఎన్టీఆర్‌ కరకట్ట వైపు వెళుతున్న లారీ రైల్వేబ్రిడ్జి సేఫ్టీ కోసం ఏర్పాటు చేసిన గడ్డర్‌ను దాటి ముందుకు వచ్చేసింది. బ్రిడ్జి కిందకు రాగానే లారీపై ఉన్న లోడ్‌ తగిలి ఇరుక్కుపోవడంలో డ్రైవర్‌ నిలిపివేశాడు. చివరకు టైర్లలో గాలి తీసి ముందుకు తీసుకువెళ్లారు. రైల్వే బ్రిడ్జి కింద తరచూ ఇలాంటి సంఘటనలు జరుగుతుండడంతో పెను ప్రమాదం జరిగే అవకాశముందని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు. రైల్వే అధికారులు స్పందించి రైల్వే బ్రిడ్జికి ప్రమాదం కలగకుండా సమాంతరంగా గడ్డర్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఈ సంఘటనపై తెనాలి రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు.

చిన్నారులతో మైదానాలు కళకళలాడాలి

గుంటూరు వెస్ట్‌ (క్రీడలు): చిన్నారులతో క్రీడా మైదానాలు కళకళలాడాలని, ఆ విధంగా స్టేడియాన్ని తీర్చిదిద్దుతామని తూర్పు శాసన సభ్యుడు మొహమ్మద్‌ నసీర్‌ అహ్మద్‌ తెలిపారు. మూడు రోజల నుంచి స్థానిక బీఆర్‌ స్టేడియంలో జరుగుతున్న అండర్‌–16 బాలబాలికల ఓపెన్‌ టెన్నిస్‌ పోటీలు ఆదివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే నసీర్‌ అహ్మద్‌ మాట్లాడుతూ రూ.100 కోట్లతో స్టేడియాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. పోటీల నిర్వాహకుడు, టెన్నిస్‌ కోచ్‌ షేక్‌ అహ్మద్‌ మాట్లాడుతూ అండర్‌–16 బాలుర విజేతగా కె.విన్సెంట్‌, రన్నర్‌గా జయ సాయి కుమార్‌ నిలిచాడన్నారు. బాలికల్లో గోలి జోషిత విజేత కాగా తనిక్షరెడ్డి రన్నర్‌గా నిలిచిందని చెప్పారు. విజేతలకు బహుమతులను నసీర్‌ అహ్మద్‌, టోర్నమెంట్‌ స్పాన్సర్‌ డాక్టర్‌ రామకృష్ణ, రాష్ట్ర ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ వెంకటేశ్వరరావు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement