
వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా చంద
రేపల్లె: వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బాపట్ల జిల్లా వేమూరుకు చెందిన మేరుగ చందన్ నాగ్ నియమితులయ్యారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఈ ఉత్తర్వులను విడుదల చేసింది. వైఎస్సార్ సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి మేరుగ నాగార్జున తనయుడు చందన్ నాగ్ ఇప్పటివరకు వైఎస్సార్ సీపీ బాపట్ల జిల్లా యువజన విభాగం అధ్యక్షులుగా ఉన్నారు. రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షులుగా నియమితులు కావడంతో పలువురు నాయకులు అభినందనలు తెలిపారు.
రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీలలో చోటు
పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నియమించిన పార్టీ అనుబంధ విభాగ కమిటీలలో బాపట్ల జిల్లాకు చెందిన పలువురు నేతలకు చోటు లభించింది. రాష్ట్ర యువజన విభాగ జనరల్ సెక్రటరీగా బాపట్లకు చెందిన నక్క వీరారెడ్డి, రాష్ట్ర యువజన విభాగ సెక్రటరీగా బాపట్లకు చెందిన దొంతిబోయిన జయ భరత్ రెడ్డి, రాష్ట్ర యువజన విభాగ అధికార ప్రతినిధిగా రేపల్లెకు చెందిన నీలం వీరేంద్రనాథ్ , రాష్ట్ర యువజన విభాగ జాయింట్ సెక్రటరీలుగా అద్దంకికి చెందిన సి.రాజ్ కుమార్, వేమూరుకు చెందిన జల్లి జోషికాంత్, పరుచూరికి చెందిన ఉప్పలపాటి అనిల్ చౌదరి, రాష్ట్ర వలంటీర్స్ వింగ్ సెక్రటరీగా అద్దంకికి చెందిన కొల్లి వెంకటరావు, రాష్ట్ర వాణిజ్య విభాగ జాయింట్ సెక్రటరీగా వేమూరుకు చెందిన మద్దుల గిరిధర్లను నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులను జారీ చేసింది.