ఏడాదిగా ప్రజలకు వెన్నుపోటు | - | Sakshi
Sakshi News home page

ఏడాదిగా ప్రజలకు వెన్నుపోటు

May 31 2025 1:37 AM | Updated on May 31 2025 1:37 AM

ఏడాదిగా ప్రజలకు వెన్నుపోటు

ఏడాదిగా ప్రజలకు వెన్నుపోటు

చీరాల అర్బన్‌: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తికావస్తున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఏ వర్గానికి న్యాయం చేయలేదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీమంత్రి మేరుగ నాగార్జున అన్నారు. శుక్రవారం చీరాల రామకృష్ణాపురంలోని పార్టీ కార్యాలయంలో చీరాల ఇన్‌చార్జి కరణం వెంకటేష్‌ అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహించారు. మేరుగ నాగార్జున మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు అమలు కాని ఎన్నో హామీలను ప్రజలకు చెప్పి అధికారం చేపట్టిందన్నారు. సంవత్సర కాలం పూర్తవుతున్నా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు. హామీలను అమలు చేయాలని ప్రశ్నిస్తే అక్రమ కేసులు, అరెస్ట్‌లతో రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ వైఎస్సార్‌ సీపీ నేతలు, నాయకులపై కేసులు బనాయించి అరెస్ట్‌ల పర్వానికి తెర తీశారన్నారు.

ప్రగల్భాలు చెప్పుకునేందుకే మహానాడు

తెలుగుదేశం పార్టీ కడపలో నిర్వహించిన మహానాడు కార్యక్రమాన్ని చూస్తే ప్రగల్భాలు చెప్పుకునేందుకే నిర్వహించినట్లుగా ఉందన్నారు. ఒకరినొకరు పొగడ్తలతో ముంచెత్తుకునేలా మహానాడు నిర్వహించారా అని ప్రశ్నించారు. సంవత్సర కాలంలో ప్రజలకు ఏం చేశామో చెప్పాలి గాని.. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించడంతో చేయడంతోనే సరిపెట్టడం ఏంటన్నారు. నిరుద్యోగులకు ఎటువంటి రిక్రూట్‌మెంట్‌ ఇవ్వలేదని, రైతుల కన్నీటి గోడు కూడా వినలేని విమర్శించారు. రాష్ట్రంలో పొగాకు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుందని కనిపించడంలేదా అని ప్రశ్నించారు. పర్చూరు, అద్దంకి, సంతనూతలపాడు ప్రాంతాల్లో పొగాకు రైతులు పడుతున్న కష్టాల కన్నీళ్ల గోడు ఈ ప్రభుత్వానికి వినిపించడం లేదన్నారు. గత ప్రభుత్వం పొగాకును ఎంతకు కొనుగోలు చేసిందో చూడాలన్నారు. కౌలు రైతులు, మిర్చి రైతుల గోడును మహానాడులో ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. మంత్రి అచ్చెన్నాయుడు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారన్నారు. రైతుల సమస్యలపై బహిరంగ చర్చకు సిద్ధమేనా అని, పొగాకు రైతుల వద్దకు వెళితే వారు చెప్పే సమస్యలు వింటే ఎంతగా నష్టపోతున్నారో తెలుస్తుందన్నారు.

హామీలు గాలికి.. కుట్రలు బయటకు..

చెరుకుపల్లి: ప్రజలకు గత వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారని, అయితే బూటకపు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి అయినా ఏ ఒక్క హామీని అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచారని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ మేరుగ నాగార్జున పేర్కొన్నారు. శుక్రవారం గుళ్ళపల్లిలోని డాక్టర్‌ ఈవూరి గణేష్‌ క్యాంపు కార్యాలయంలో పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు జూన్‌ 4వ తేదీన రేపల్లె ఆర్డీఓ కార్యలయం వద్ద నిర్వహించనున్న వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలని కోరుతూ నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన నాయకులు, కార్యకర్తల సమావేశంలో డాక్టర్‌ మేరుగ పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, కూటమి నేతలు ఏడాది కాలంగా ప్రజలకు ఇచ్చిన హామీలు గాలికొదిలి, తమ జేబులు నింపుకొనేందుకే వెచ్చించారన్నారు. కూటమి ఏడాది పాలనలో చిన్నారులను, మహిళలను, విద్యారంగాన్ని, వైద్యరంగాన్ని, చివరకు శాంతిభధ్రతలను పట్టించుకోకుండా రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందన్నారు. అనంతరం డాక్టర్‌ గణేష్‌ మాట్లాడేతూ 4వ తేదీ జరిగే వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో మండల కన్వీనర్లు దుండి వెంకట రామిరెడ్డి, ఇంకొల్లు రామకృష్ణ, కరేటి శేషగిరిరావు, యార్లగడ్డ వెంకట రాంబాబు, నాయకులు డాక్టర్‌ హతిక్‌, పట్టెం శ్రీనివాసరావు, లుక్కా బాపనియ్య, నిజాంపట్నం కోటేశ్వరరావు, ఉల్లంగుంట శ్రీరాంమూర్తి, పాగోలు వెంకటేశ్వరరావు, కందుల సురేష్‌, చదలవాడ శ్రీనివాసరావు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

హామీలు నెరవేర్చకుండా ప్రగల్భాలతోనే సరి అక్రమ కేసులు, అరెస్టులే తప్ప అభివృద్ధి శూన్యం జూన్‌ 4న వెన్నుపోటు దినాన్ని విజయవంతం చేయాలి వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి మేరుగ నాగార్జున

జూన్‌ 4న వెన్నుపోటు దినం

కూటమి ప్రభుత్వం చేసిన మోసాలు, అరాచకాలు, అన్యాయాలపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో జూన్‌ 4న వెన్నుపోటు దినం నిరసన ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. నియోజకవర్గ కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించి ఆర్డీఓ, తహసీల్దార్‌ కార్యాలయాల్లో వినతిపత్రం ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కరణం వెంకటేష్‌ మాట్లాడుతూ నియోజవర్గ ప్రజలకు తాను ఎప్పుడూ అండగా ఉంటారన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ సంవత్సర కాలం వేచి చూశామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తోందన్నారు. పార్టీ బీసీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి కర్నేటి వెంకటప్రసాద్‌, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు వాసిమళ్ళ వాసు, మున్సిపల్‌ వింగ్‌ అధ్యక్షుడు బత్తుల అనిల్‌, మైనార్టీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి షేక్‌ కబీర్‌, బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు గవిని శ్రీనివాసరావు, మాజీ మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ బొనిగల జైసన్‌బాబు, పట్టణ అధ్యక్షుడు యాతం మేరిబాబు, మున్సిపల్‌ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement