
కలెక్టరేట్ ఎదుట సీహెచ్ఓల ధర్నా
రాయచోటి అర్బన్ : తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలను సత్వరమే పరిష్కరించాలని పలువురు సీహెచ్ఓలు డిమాండ్ చేశారు. మంగళవారం సీహెచ్ఓలు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీహెచ్ఓల యూనియన్ జిల్లా నాయకులు భరత్, శివకుమార్,అహమ్మద్ బాషా మాట్లాడుతూ ఆరేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న సీహెచ్ఓలను క్రమబద్ధీకరించాలన్నారు. ఆర్థిక, ఆర్థికేతర సమస్యల పరిష్కారం విషయమై స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు.
దాడి ఘటనపై కేసు నమోదు
మదనపల్లె : భూవివాదం కారణంగా జరిగిన దాడి ఘటనపై కేసు నమోదు చేసినట్లు తాలూకా సీఐ కళా వెంకటరమణ తెలిపారు. పట్టణంలోని పీఅండ్టీ కాలనీకి చెందిన జి.రామాంజులుకు దేవతానగర్ వద్ద వారసత్వంగా సంక్రమించిన భూమి సర్వే నెంబర్.90లో ఉంది. అందులో సోమవారం సాయంత్రం ఔషధ మొక్కలు నాటుకుంటుండగా, అతడి సోదరుడైన బాలాజీ అడ్డుకుని రామాంజులు, అతడి భార్య నారాయణమ్మలపై దాడి చేశాడు. ఈ ఘటనల్లో బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితుడైన బాలాజీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
మిద్దైపె నుంచి పడి వ్యక్తి మృతి
ములకలచెరువు : నూతనంగా నిర్మించిన ఇంటికి నీళ్లు పడుతుండగా ప్రమాదవశాత్తు కింద పడి ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన మంగళవారం మండలంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం మేరకు.. మండలంలోని సోంపల్లె పంచాయతీ బిళ్లూరివారిపల్లెకు చెందిన బి. గోవిందురెడ్డి(55) ఇంటి గోడలకు నీళ్లు పట్టే క్రమంలో అదుపుతప్పి కింద పడ్డారు. తీవ్రంగా గాయపడిన గోవిందురెడ్డిని మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుడికి కుమార్తె తేజస్విని, కుమారుడు ఈశ్వర్రెడ్డి సంతానం. మృతదేహానికి సర్పంచు బి. విష్ణువర్దన్రెడ్డి నివాళులు అర్పించారు.
చైన్నెలో రైల్వేకోడూరు
సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి
రైల్వేకోడూరు అర్బన్ : రైల్వేకోడూరు పట్టణానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి మందల ప్రతాప్ (30) చైన్నె తిరువళ్లూరులో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పట్టణానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు మందల నాగేంద్ర అన్న సుబ్రమణ్యం కుమారుడు మృతి చెందడంతో పలువురు నాయకులు విచారం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, వైస్ ఎంపీపీ రామిరెడ్డి ధ్వజారెడ్డి, సీహెచ్ రమేష్ సంతాపం ప్రకటించారు.
కడుపునొప్పి తాళలేక ఆత్మహత్య
బి.కొత్తకోట : కడుపు నొప్పి తాళలేక ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని బడికాయలపల్లి గ్రామంలో మంగళవారం జరిగింది. సీఐ జీవన్ గంగనాథ్ బాబు కథనం మేరకు వివరాలు.. బడికాయలపల్లె గ్రామం జింకదాటినపల్లెకు చెందిన జి.పెద్దరెడ్డప్ప (45) చిన్నచిన్న కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఇతనికి కడుపు నొప్పి సమస్య ఉండడంతో కొంత కాలంగా ఇబ్బంది పడుతున్నాడు. మంగళవారం నొప్పి అధికం కావడంతో సమీపంలోని ఓ తోటలో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

కలెక్టరేట్ ఎదుట సీహెచ్ఓల ధర్నా