
ఇన్ఫోసిస్లో 4.81 శాతానికి ఎల్ఐసీ వాటా
ప్రభుత్వ రంగ బీమా సంస్థ, ఎల్ఐసీ ఈ ఏడాది జనవరి-మార్చి క్వార్టర్కు ఇన్ఫోసిస్లో తన
మార్చి క్వార్టర్లో రూ.300 కోట్ల షేర్లు కొనుగోలు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బీమా సంస్థ, ఎల్ఐసీ ఈ ఏడాది జనవరి-మార్చి క్వార్టర్కు ఇన్ఫోసిస్లో తన వాటాను పెంచుకుంది. ఈ క్వార్టర్లో ఎల్ఐసీ రూ.300 కోట్ల విలువైన ఇన్ఫోసిస్ షేర్లను కొనుగోలు చేసింది. దీంతో అక్టోబర్-డిసెంబర్ క్వార్టర్ నాటికి4.69 శాతంగా ఉన్న ఇన్ఫోసిస్లో ఎల్ఐసీ వాటా జనవరి-మార్చి క్వార్టర్కు 4.81 శాతానికి పెరిగింది. వరుసగా నాలుగు క్వార్టర్ల పాటు ఇన్ఫోసిస్ షేర్లను ఎల్ఐసీ కొనుగోలు చేస్తూనే ఉంది. స్టాక్ మార్కెట్లో అతి పెద్ద దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్ అయిన ఎల్ఐసీ జనవరి-మార్చి క్వార్టర్, 2014 నుంచి ఇన్ఫోసిస్లో తన వాటాను పెంచుకుంటూనే ఉంది. అయితే మార్చి క్వార్టర్లో ఇన్ఫోసిస్లో దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్ల వాటా 15.28 శాతం నుంచి 15.1 శాతానికి, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల వాటా 41.58% నుంచి 37.96 శాతానికి తగ్గింది.
యాక్సిస్లో 12 శాతానికి పెరిగిన వాటా
ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్లో కూడా ఎల్ఐసీ తన వాటాను పెంచుకుంది. 43 లక్షల షేర్లు (0.18 శాతం వాటా)ను రూ.243 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ కొనుగోలుతో యాక్సిస్ బ్యాంక్లో లో ఎల్ఐసీ వాటా 11.85 శాతం నుంచి 12.04 శాతానికి పెరిగింది.