51 కోట్ల మందికి ‘ఆధార్’ | UIDAI has issued 51 crore Aadhar numbers | Sakshi
Sakshi News home page

51 కోట్ల మందికి ‘ఆధార్’

Dec 6 2013 5:51 AM | Updated on May 25 2018 6:12 PM

దేశవ్యాప్తంగా 51 కోట్ల మందికి ఆధార్ సంఖ్యను జారీ చేసినట్లు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ గురువారం తెలిపింది.

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 51 కోట్ల మందికి ఆధార్ సంఖ్యను జారీ చేసినట్లు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ గురువారం తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా 60 కోట్ల మందికి ఆధార్ సంఖ్య కేటాయించాలన్న లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొంది. రోజూ 11 లక్షల మందికి ఆధార్ సంఖ్య జారీ అవుతోందని ఒక ప్రకటనలో తెలిపింది. ఆంధ్రప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, ఢిల్లీ, చండీగఢ్‌లలో ఆధార్ జారీ 90 శాతానికి చేరిందని తెలిపింది.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement