
రగ్బీ ప్రీమియర్ లీగ్కు చైన్నె బుల్స్
సాక్షి, చైన్నె: ముంబై వేదికగా జరగనున్న రగ్బీ ప్రీమియర్ లీగ్ సీజన్ పోటీలకు చైన్నెబుల్స్ జట్టు ఎంపికై ంది. ఇందులో భాగంగా అఽధికారిక జెర్సీతోపాటు ప్రత్యేక పాటను బుల్స్ కోసం చైన్నెలో ఆవిష్కరించారు. మద్రాసు క్రికెట్ క్లబ్లో మంగళవారం జరిగిన చైన్నెబుల్స్ జట్టుతో పాటు ప్రాంఛైజీల పరిచయం, జెర్సీ, ప్రత్యేక పాట ఆవిష్కరణ కార్యక్రమానికి రగ్బీ ఇండియా కోశాధికారి సెంథిల్ వి.త్యాగరాజన్, బాస్కెట్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(బీఎఫ్ఐ,) తమిళనాడు ఒలింపిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు–ప్రధాన కార్యదర్శి ఆదవ్ అర్జున, చైన్నెబుల్స్ నాయకత్వ బృందం నుంచి అక్షిత్శర్మ, ఫ్రాంచైజీ ప్రధాన కోచ్ బెన్ గొల్లింగ్స్, సినీ నటుడు మాజీ భారత రగ్బీ ఆటగాడు వినయ్రాయ్ హాజరయ్యారు. ఈసందర్భంగా త్యాగరాజన్ మాట్లాడుతూ భారతదేశంలో రగ్బీ అనేది చాలా ఇష్టపడి ఆడే క్రీడ అని, దేశ వ్యాప్తంగా ఇందుకు పుష్కలంగా అవకాశాలు, ఆసక్తి ఉన్నట్టు వివరించారు. రగ్బీ ఇండియా జీఎంఆర్ స్పోర్ట్స్ మద్దతుతో ఆర్పీఎల్లో భాగం కావడం ఆనందంగా ఉందన్నారు. చైన్నెబుల్స్ రగ్బీ ప్రీమియర్ లీగ్ ప్రయాణంలో భాగం కావడం తమిళనాడులోని యువతరాలకు స్ఫూర్తిగా మారిందన్నారు. ఆదవ్ అర్జున మాట్లాడుతూ జాతీయ ఆటగాళ్లను ఉన్నత స్థాయి పోటీ, విభిన్న అంతర్జాతీయ ఆట శైలిలో పరిచయం చేయడం భారతదేశ రగ్బీ, ఒలింపిక్ ఆకాంక్షలను ముందుకు తీసుకెళ్లడంలో ఇది కీలకడుగు అని వివరించారు. రగ్బీ ప్రీమియర్ లీగ్ మొదటి సీజన్న్ జూన్ 15 నుంచి 29 వరకు ముంబైలోని అందేరి స్పోర్ట్స్ కాంప్లెక్స్లో జరగనున్నట్టు, ఇందులో బుల్స్తోపాటు ఆరుజట్లు పోటీ పడనున్నాయని వివరించారు. చైన్నె బుల్స్ స్క్వాడ్లో హన్నెస్ అడ్లెర్, హాకోన్ ఓయిస్, నికియాస్ లోహె, కెన్నెడీ, జోసెవా తలకోలో, రాటుసౌతు రాగా, జోక్విన్ పెల్లండిని, అలెగ్జాండర్ డేవిస్, వల్లభ్ పాటిల్, షానవాజ్ అహ్మద్, వినాయక్ హరిరాజ్, మహ్మద్ జాసిమ్ ఎపి, వినయ్ వంటి క్రీడాకారులు ఉన్నారని ప్రకటించారు.