
సెవ్వాపేట వేళమ్మాల్ విద్యాశ్రమ్కు అవార్డు
తిరువళ్లూరు: సామాజిక బాధ్యతతో అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం, విద్యార్థులకు సాయం అందిస్తూ ఆదర్శంగా నిలిచిన పాఠశాలలకు ఉత్తమ అవార్డులను అందజేసే కార్యక్రమాన్ని తాజ్ కోరమాండల్ సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించారు. బెంగళూరులో జరిగిన కార్యక్రమానికి రాష్ట్రం నుంచి మొత్తం 42 పాఠశాలలను ఎంపిక చేయగా, జిల్లా నుంచి సెవ్వాపేట వేళమ్మాల్ విద్యాశ్రమ్ పాఠశాల మొదటి స్థానంలో నిలిచి అవార్డుకు ఎంపికై ంది. సంస్థ నిర్వాహకులు అవార్డును పాఠశాల ప్రిన్సిపల్ సతీష్ సత్యమూర్తికి అందజేశారు. కాగా పాఠశాలకు చెందిన కీర్తన కామన్వెల్త్ పోటీల్లో వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో పాల్గొని బంగారు పతకం సాధించగా ఆమె ఉన్నత చదువుకు అయ్యే ఖర్చును పాఠశాల భరిస్తుందని కరస్పాండెంట్ సుడలైముత్తుపాండ్యన్ ప్రకటించారు. దీంతో పాటు పర్యావరణ పరిరక్షణ, రతన్టాటా నమూనాలో వెయ్యి మంది విద్యార్థులు నిలబడి గిన్నిస్ రికార్డులో నమోదు, మొక్కలు నాటడడం, అటవీ పరిరక్షణ, ప్రమాదాల రహిత జిల్లాగా తిరువళ్లూరును తీర్చిదిద్దే క్రమంలో అవగాహన ర్యాలీని పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించారు. వీరి సేవలను గుర్తించిన కోరమాండల్ సంస్థ ఉత్తమ పాఠశాలగా ఎంపిక చేసి అవార్డును అందజేసింది.