
పర్యాటకులకు వేదికగా షెరటాన్ గ్రాండ్
సాక్షి,చైన్నె: చైన్నె మహాబలిపురం పరిసరాలలో తీర ప్రాంత పర్యాటకులు, విహా ర యాత్రకు బ్రహ్మాండ వేదికగా షెరటాన్ గ్రాండ్ను తీర్చిదిద్దారు. ఈ వివరాలను మంగళవారం స్థానికంగా నిర్వాహకులు ప్రకటించారు. మహాబలిపురం అంటే, సముద్ర తీరానికి, శిల్ప సంపదలకు ప్రసిద్ధి చెందిందిగా గుర్తుచేశారు. ఈ తీరంలో షెరటాన్ గ్రాండ్ బ్రహ్మాండ రిసార్ట్గా విహారయాత్రకు వేదికగా ఉన్నట్టు వివరించారు. మారియట్ బోన్వాయ్, విహారయాత్రకు వచ్చే వారికి ప్రత్యేక రాయితీలను సైతం ఇవ్వనున్నారు. జూలై 31వ తేదీ లేదా అంతకుముందు షెరటాన్లో నమోదు చేసుకున్న వారికి ప్రత్యేక రాయితీలలో అవకాశం కల్పిస్తున్నామన్నారు. బంగాళాఖాతంలో సుందరమైన తీరాల వెంబడి, మహాబలిపురం వద్ద ఆధునిక సౌకర్యాలతో, ప్రత్యేక ఆకర్షణ, ప్రశంసల చిహ్నంగా, వీక్షకులకు ఉన్నత సేవలను అందించే విధంగా ఏర్పాట్లు చేసినట్టు వివరించారు.