
ప్రాంతీయమా? జాతీయమా అని చూడను
తమిళసినిమా: నటి రష్మిక మందన్న. ఈ పేరు ఇప్పు డు నేషనల్ క్రష్గా మారిందన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. మాతృభాషలో కిరా క్ పార్టీ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న కన్నడ బ్యూటీని తెలుగు చిత్ర పరిశ్రమ ఉన్నత స్థాయిలో కూర్చోబెట్టింది. తెలుగులో ఛలో చిత్రంతో కెరీర్ ప్రారంభించిన రష్మిక మందన పుష్ప–2 చిత్రంతో ఉన్నత శిఖరాలకు చేరారు. అలాగే గుడ్ బై చిత్రంతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడిని యానిమల్ చిత్రం నేషనల్ క్రష్ను చేసింది. అయితే తమిళంలోనే ఈమెకు సరైన హిట్టు పడలేదు. ఇలాంటి పరిస్థితుల్లో తమిళం, తెలుగు భాషల్లో రూపొందిన కుబేర చిత్రంలో ధనుష్ జంటగా నటించారు. ఈ చిత్రం భారీ అంచనాల మధ్య తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడం భాషల్లో ఈ నెల 20వ తేదీన తెరపైకి రానుంది. కాగా ఇటీవల చైన్నెలో జరిగిన కుబేర చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న నటి రష్మికా మందన్నా తమిళంలో మంచి కథా చిత్రం కోసం ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు. దీని గురించి ఆమె మాట్లాడుతూ తనను తరిమిన చిత్రాల్లో ఎక్కువగా చూడలేక పోతున్నామని చాలా మంది అడుగుతున్నారన్నారు. తాను అలాంటి అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు తమిళంలో మంచి కథా చిత్రంలో నటించే అవకాశం వస్తే పరిగెత్తుకుని వస్తానని కథానాయకి ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించాలని కోరుకుంటున్నారా? అని అడుగుతున్నారని, తనకు కథ ముఖ్యమని, మంచి కథ అయితే నటించడానికి సిద్ధమని పే ర్కొన్నారు. అందుకు తమిళం, తెలుగు, హిందీ అనే భాషా భేదం లేదని, అలాగే ప్రాంతీయ చిత్రమా? జాతీయ చి త్రమా అని కూడా చూడాలని చెప్పారు కదా? అని అడగ్గా బాగుంటే నటిస్తానని రష్మిక మందన్న స్పష్టం చేశారు. కాగా కుబేర చిత్రం తర్వా త రష్మిక నటించిన గర్ల్ ఫ్రెండ్ చిత్రం తెరపైకి రానుంది.
రష్మిక మందన్న