రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం | - | Sakshi
Sakshi News home page

రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం

May 27 2025 7:35 AM | Updated on May 27 2025 7:35 AM

రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం

రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం

● పౌరహక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి తిరుమలయ్య

షాద్‌నగర్‌: శవాల అప్పగింత పై హైకోర్టు ఉత్తర్వు లు జారీ చేసినా.. మృతదేహాలను కుటుంబ సభ్యులకు ఇవ్వకపోవడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని పౌరహక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్య దర్శి తిరుమలయ్య అన్నారు. సోమవారం పట్టణంలోని దేవీ గ్రాండ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వేములనర్వకు చెందిన విజయలక్ష్మి అలియాస్‌ భూమిక మృతదేహాన్ని వారి కుటుంబ సభ్యులకు అప్పగించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు అంబులెన్స్‌లను సీజ్‌ చేస్తామని డ్రైవర్లను బెదిరిస్తున్నారన్నారు. ఈ సమావేశంలో టీపీఎఫ్‌ నాయకులు అర్జునప్ప, పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్‌ రవీంద్రనాథ్‌, కార్మిక సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్‌ ప్రభాకర్‌, గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఈశ్వర్‌ నాయక్‌ పాల్గొన్నారు. ఇదిలా ఉండగా భూమిక మృతదేహాన్ని పోలీసులే ఖననం చేసినట్లు సాయంత్రం విషయం తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement