
కోట చెరువు పూడికతీతకు చర్యలు
మేయర్ గుండు సుధారాణి
వరంగల్: దేశాయిపేట సమీపంలోని కోట చెరువు పూడికతీతకు చర్యలు చేపట్టాలని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం వరంగల్ దేశాయిపేటలోని కోట చెరువును ఇరిగేషన్, బల్దియా, ఇంజనీరింగ్ శానిటేషన్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో మేయర్ పరిశీలించారు. ఈసందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగర ముంపు నివారణ చర్యల్లో భాగంగా యూటీ నుంచి కోట చెరువు వరకు డీసిల్టింగ్ ప్రక్రియ చేపట్టేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. కోట చెరువు పరిధి ఆక్రమణకు గురవకుండా హద్దులు ఏర్పాటు చేయాలన్నారు. మేయర్ వెంట బల్దియా ఎంహెచ్ఓ రాజేశ్, ఈఈలు శ్రీనివాస్, ఇరిగేషన్ డీఈ ఖాదర్, ఏసీపీ శ్రీనివాస్ కార్పొరేటర్లు సురేశ్జోషి, బస్వరాజు కుమార్ ఉన్నారు.
సమీక్ష సమావేశంలో కమిషనర్
రాష్ట్రంలో పెరుగుతున్న ఎండలు, వడగాలుల నుంచి తీసుకోవాల్సిన రక్షణ చర్యలపై శుక్రవారం హైదరాబాద్లోని సచివాలయంలోని తన కార్యాలయంలో జరిగిన ఉన్నత స్థాయి అధికారుల సమావేశంలో కమిషనర్ అశ్విని తానాజీ వాకడే పాల్గొన్నారు. సమావేశంలో రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీని వాస్రెడ్డి, రాష్ట్ర ఉన్నతస్థాయి అధికారులున్నారు.