వడదెబ్బతో వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

వడదెబ్బతో వ్యక్తి మృతి

Apr 30 2025 12:05 AM | Updated on Apr 30 2025 12:05 AM

వడదెబ

వడదెబ్బతో వ్యక్తి మృతి

బయ్యారం : వడదెబ్బతో తీవ్ర అస్వస్థతకు గురైన ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన మంగళవారం మండలంలోని కస్తూరినగర్‌లో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. కస్తూరినగర్‌ గ్రామానికి చెందిన కేలోత్‌ రంగ్య (52) ఎండ తీవ్రతకు వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.

ఐనవోలులో వృద్ధురాలు..

ఐనవోలు : మండలంలోని నందనం గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలు వడదెబ్బతో మృతిచెందింది. నందనం గ్రామానికి చెందిన యాకర సాలమ్మ (75) కూలీ పనులు, కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తోంది. రోజు మాదిరిగానే మంగళవారం ఉదయం కూరగాయలు అమ్ముకోవడానికి ఇంట్లో నుంచి వెళ్లింది. ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో వడదెబ్బ తగిలి అస్వస్థతకు గురై మధ్యాహ్నం ఇంటికి చేరుకుని కింద పడిపోయింది. చుట్టు పక్కల వాళ్లు గమనించగా అప్పటికే ఆమె మృతి చెందింది. వడదెబ్బతో మృతిచెందిందని ప్రభుత్వం ఆదుకోవాలని మృతురాలి బంధువులు కోరారు.

డీఏఓ విజయనిర్మలకు ఆత్మ పీడీగా పదోన్నతి

మహబూబాబాద్‌ రూరల్‌: మానుకోట జిల్లా వ్యవసాయ అధికారి ఎం.విజయనిర్మల వరంగల్‌ వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ) ప్రాజెక్టు డైరెక్టర్‌గా పదోన్నతి పొందారు. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, తదుపరి ఉత్తర్వులు వచ్చేంతవరకు మానుకోట జిల్లా వ్యవసాయ అధికారిగా కొనసాగనున్నారు.

పురుగుల మందు తాగి యువకుడి బలవన్మరణం

జనగామ రూరల్‌ : పురుగుల మందు తాగి ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన సంఘటన జనగామ మండలంలోని గోపిరాజుపల్లిలో మంగళవారం జరిగింది. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. గోపిరాజుపల్లికి చెందిన పిడుగు అనిల్‌ (22) వ్యవసాయం చేసుకుంటు కుటుంబ సభ్యులతో జీవిస్తున్నాడు. వ్యవసాయంతో పాటు ఇతర కూలీ పనులకు వెళ్తూ తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉండేవాడు. సోమవారం రాత్రి గ్రామశివారులో పొలం వద్ద పురుగుల మందు తాగాడు. గమనించిన స్నేహితులు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వెంటనే జనగామ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందాడు. కాగా మృతికి గల పూర్తి విషయాలు తెలియరాలేదు. తమ్ముడి మరణం తట్టుకో లేక అదే ఆస్పత్రిలో మృతుడి అన్న పిడుగు ర మేశ్‌ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. కుటుంబీకుల ఫిర్యాదు మే రకు కేసు నమోదు చేసి న్నట్లు ఎస్సై తెలిపారు.

వడదెబ్బతో వ్యక్తి మృతి
1
1/3

వడదెబ్బతో వ్యక్తి మృతి

వడదెబ్బతో వ్యక్తి మృతి
2
2/3

వడదెబ్బతో వ్యక్తి మృతి

వడదెబ్బతో వ్యక్తి మృతి
3
3/3

వడదెబ్బతో వ్యక్తి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement